WI vs IND: టీమ్ఇండియా ‘హ్యాట్రిక్’ కొట్టాలి.. టీ20 సిరీస్ పట్టేయాలి!
వెస్టిండీస్తో ఐదో టీ20 ఫైనల్లాంటిది. సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్లో గత జట్టుతో బరిలోకి దిగుతాడా..? లేదా..? అనేది హార్దిక్ ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.
తొలి రెండు మ్యాచుల్లో ఓటమి.. అదీనూ చివరి వరకు వచ్చి మరీ చేజారాయి. ఇక యువకులతో కూడిన జట్టు.. స్వదేశంలో పటిష్ఠమైన విండీస్ను (WI vs IND) ఎలా ఎదుర్కొంటుందోననే సందేహాలు మొదలయ్యాయి. పొట్టి సిరీస్ చేజారుతుందేమోనని ఆందోళనా రేగింది. ఐదు టీ20ల సిరీస్లో 0-2తో టీమ్ఇండియా వెనుకబడింది. అయితే కీలకమైన మూడు, నాలుగు టీ20ల్లో మాత్రం అద్భుత విజయాలు సాధించి తామూ సిరీస్ రేసులో ఉన్నామని ఘనంగా చాటిచెప్పింది భారత యువ క్రికెట్ జట్టు. మరీ ముఖ్యంగా నాలుగో టీ20లో ఆడిన తీరు అద్భుతం. బ్యాటింగ్ పిచ్పై విండీస్ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడిన వేళ.. భారత యువ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేశారు. ఇదే ఫామ్ను ఇవాళ జరగనున్న ఐదో టీ20లోనూ ప్రదర్శిస్తే సిరీస్ కైవసం చేసుకోవడం భారత్కు కష్టమేం కాదు. హ్యాట్రిక్ విజయాలు సాధించి సిరీస్ను కైవసం చేసుకోవడానికి భారత్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తొలుత 0-2తో వెనుకబడి.. 2-2 సిరీస్ రేసులో నిలవడం టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇదేనేమో..!
బౌలర్లు మరోసారి..
ఫ్లోరిడాలోని లాడర్హిల్స్ మైదానం బ్యాటింగ్కు అనుకూలం. అయితే, అలాంటి పిచ్పైనా భారత బౌలర్లు (Team India Bowlers) కష్టపడ్డారనే చెప్పాలి. అయితే, హెట్మయెర్, షై హోప్ను కూడా కట్టడి చేసి ఉంటే ఇంకాస్త త్వరగానే భారత్ గెలిచే అవకాశం ఉండేది. అయితే, ఫైనల్లాంటి ఐదో టీ20లో మాత్రం విండీస్ బ్యాటర్లను తక్కువగా అంచనా వేయకూడదు. గత మ్యాచ్లో నికోలస్ పూరన్, రోవ్మన్ పావెల్ను ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి భారత బౌలర్లు రాణించాల్సిన అవసరం ఉంది. అక్షర్, అర్ష్దీప్ వికెట్లు తీసినా భారీగానే పరుగులు సమర్పించారు. మూడు మ్యాచుల్లో నాణ్యమైన పేస్ బౌలింగ్ను వేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్య నాలుగో టీ20లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే సంధించాడు. అందులోనూ 14 పరుగులు ఇవ్వడంతో మళ్లీ బౌలింగ్కు రాలేదు. చాహల్, ముకేశ్ కూడా ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. చివరి మ్యాచ్లోనైనా రిజర్వ్ బెంచ్కే పరిమితమై ఉన్న అవేశ్ ఖాన్కు అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.
వారిపైనే ఆధారపడొద్దు!
వరుగా రెండు మ్యాచుల్లో భారత్ గెలిచేందుకు కారణం యశస్వి, గిల్, సూర్య, తిలక్ వర్మ. అయితే ‘ఫైనల్’లో మాత్రం మిగతా బ్యాటర్లూ రాణించాలి. అందులో మరీ ముఖ్యంగా సంజూ శాంసన్. మూడు, నాలుగో టీ20ల్లో సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అంతకుముందు మ్యాచుల్లో విఫలమై నిరాశపరిచాడు. ఇక చివరి టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విఫలం కాకుండా ఉండాలి. ఒకవేళ మరోసారి నిరాశపరిస్తే మాత్రం మళ్లీ జాతీయ జట్టులో అవకాశాలు తగ్గడం ఖాయం. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అభేద్యమైన తొలి వికెట్కు 165 పరుగులు జోడించడంతోపాటు ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. చివరి మ్యాచ్లోనూ ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బాబర్ అజామ్తో అదే తొలిసారి మాట్లాడటం.. ఇప్పటికీ అలాంటి గౌరవమే: విరాట్
పిచ్ పరిస్థితి, వాతావరణం..
ఒక్క రోజు వ్యవధిలోనే ఒకే మైదానంలో రెండు అంతర్జాతీయ టీ20లు ఆడనుండటం అక్కడి క్రికెట్ అభిమానులకు పండగే. అయితే, ఫ్లోరిడాలోని హ్యుమిడిటీ వల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈసారి కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకుల అంచనా. మ్యాచ్ను జియోసినిమా ఓటీటీ, ఫ్యాన్కోడ్ ఓటీటీలతోపాటు దూరదర్శన్ ఛానల్లో వీక్షించొచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
జట్లు (అంచనా):
భారత్: శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్యాదవ్, అవేశ్ ఖాన్/అర్ష్దీప్, ముకేశ్ కుమార్
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కేల్ మేయర్స్, షై హోప్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మయెర్, జాసన్ హోల్డర్, రొమారియో షెఫెర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హుసేన్, మెకాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
-
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..