Gujarat Vs Mumbai: తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నట్లు గిల్ కనిపించడు: సాయి కిశోర్
భారీ లీగ్లో జట్టును నడిపించాలంటే అనుభవం ఉండాలి. కానీ, గిల్ మాత్రం పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేకపోయినా తొలి మ్యాచ్లో ఆకట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబయి జట్టును గుజరాత్ ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే ఓడించింది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ వ్యూహాలతో స్టార్ బ్యాటర్లు కలిగిన ముంబయిని కట్టడి చేయగలిగాడు. లక్ష్యం పెద్దది కాకపోయినా.. బౌలర్లను వినియోగించుకున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు దక్కాయి. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో యువ క్రికెటర్ సాయి కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుభ్మన్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడిని చూస్తే తొలిసారి సారథ్యం చేపట్టిన కెప్టెన్గా కనిపించడు. స్పిన్నర్గా నాకు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. తొలుత మేం 10 పరుగులు తక్కువగా చేశామని భావించాం. కానీ, గత రెండేళ్లుగా జట్టు ఎలాంటి ప్రదర్శన చేసిందో అందరికీ తెలిసిందే. మేం గెలిచినా.. ఓడినా మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంటాం. చివరి వరకూ పోటీనివ్వాలని మా కోచ్ ఆశిశ్ నెహ్రా ఎప్పుడూ చెబుతుంటాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం కోసం శ్రమించాం’’ అని సాయి కిశోర్ తెలిపాడు.
ఇంతటి హేళనను చూడలేదు..: కెవిన్ పీటర్సెన్
గుజరాత్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యను హేళన చేస్తూ అహ్మదాబాద్ అభిమానులు ప్రవర్తించిన తీరుపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్కు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని కెవిన్ అభిప్రాయపడ్డాడు. గుజరాత్ కెప్టెన్సీని వదిలేసి.. ముంబయి సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ టాస్ కోసం వచ్చినప్పుడు.. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో హేళనకు గురైన సంగతి తెలిసిందే. దానిని కెవిన్ ప్రస్తావించాడు. ‘‘సొంతగడ్డపై ఈ స్థాయిలో అభిమానులు అరుస్తూ హేళన చేయడం ఇప్పటి వరకు చూడలేదు. చాలా అరుదుగా చోటు చేసుకొనే ఘటన’’ అంటూ తన కామెంట్రీలో వ్యాఖ్యానించాడు.
కోహ్లీ.. ఎప్పటికీ దిగ్గజమే: రిజ్వీ
గత మినీ వేలంలో భారీ ధరకు చెన్నై జట్టు సమీర్ రిజ్వీని సొంతం చేసుకుంది. బెంగళూరుతో జరిగిన ఈ సీజన్ తొలి మ్యాచ్లో అతడికి అవకాశం రాలేదు. కానీ, ఓ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకొనే క్రమంలో.. విరాట్ కోహ్లీతో షేక్హ్యాండ్ ఇస్తుండగా రిజ్వీ తన టోపీని తలపై నుంచి తీశాడు. సీనియర్లకు అతడు ఇచ్చే మర్యాద ఇదంటూ అభినందిస్తూ నెట్టింట కామెంట్లతో ముంచెత్తారు. ఆ తర్వాత విరాట్తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో రిజ్వీ షేర్ చేశాడు. దానికి ‘ఎప్పటికీ దిగ్గజమే’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి