Gujarat Vs Mumbai: తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నట్లు గిల్ కనిపించడు: సాయి కిశోర్
భారీ లీగ్లో జట్టును నడిపించాలంటే అనుభవం ఉండాలి. కానీ, గిల్ మాత్రం పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేకపోయినా తొలి మ్యాచ్లో ఆకట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబయి జట్టును గుజరాత్ ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే ఓడించింది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ వ్యూహాలతో స్టార్ బ్యాటర్లు కలిగిన ముంబయిని కట్టడి చేయగలిగాడు. లక్ష్యం పెద్దది కాకపోయినా.. బౌలర్లను వినియోగించుకున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు దక్కాయి. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో యువ క్రికెటర్ సాయి కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుభ్మన్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడిని చూస్తే తొలిసారి సారథ్యం చేపట్టిన కెప్టెన్గా కనిపించడు. స్పిన్నర్గా నాకు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. తొలుత మేం 10 పరుగులు తక్కువగా చేశామని భావించాం. కానీ, గత రెండేళ్లుగా జట్టు ఎలాంటి ప్రదర్శన చేసిందో అందరికీ తెలిసిందే. మేం గెలిచినా.. ఓడినా మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంటాం. చివరి వరకూ పోటీనివ్వాలని మా కోచ్ ఆశిశ్ నెహ్రా ఎప్పుడూ చెబుతుంటాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం కోసం శ్రమించాం’’ అని సాయి కిశోర్ తెలిపాడు.
ఇంతటి హేళనను చూడలేదు..: కెవిన్ పీటర్సెన్
గుజరాత్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యను హేళన చేస్తూ అహ్మదాబాద్ అభిమానులు ప్రవర్తించిన తీరుపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్కు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని కెవిన్ అభిప్రాయపడ్డాడు. గుజరాత్ కెప్టెన్సీని వదిలేసి.. ముంబయి సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ టాస్ కోసం వచ్చినప్పుడు.. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో హేళనకు గురైన సంగతి తెలిసిందే. దానిని కెవిన్ ప్రస్తావించాడు. ‘‘సొంతగడ్డపై ఈ స్థాయిలో అభిమానులు అరుస్తూ హేళన చేయడం ఇప్పటి వరకు చూడలేదు. చాలా అరుదుగా చోటు చేసుకొనే ఘటన’’ అంటూ తన కామెంట్రీలో వ్యాఖ్యానించాడు.
కోహ్లీ.. ఎప్పటికీ దిగ్గజమే: రిజ్వీ
గత మినీ వేలంలో భారీ ధరకు చెన్నై జట్టు సమీర్ రిజ్వీని సొంతం చేసుకుంది. బెంగళూరుతో జరిగిన ఈ సీజన్ తొలి మ్యాచ్లో అతడికి అవకాశం రాలేదు. కానీ, ఓ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకొనే క్రమంలో.. విరాట్ కోహ్లీతో షేక్హ్యాండ్ ఇస్తుండగా రిజ్వీ తన టోపీని తలపై నుంచి తీశాడు. సీనియర్లకు అతడు ఇచ్చే మర్యాద ఇదంటూ అభినందిస్తూ నెట్టింట కామెంట్లతో ముంచెత్తారు. ఆ తర్వాత విరాట్తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో రిజ్వీ షేర్ చేశాడు. దానికి ‘ఎప్పటికీ దిగ్గజమే’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?