Shubman Gill: ‘శుభ్మన్ గిల్ తదుపరి కోహ్లీ కావాలనుకుంటున్నాడు.. ప్రపంచకప్లో దంచికొడతాడు’
టీమ్ఇండియా భవిష్యత్ స్టార్గా ఎదుగుతున్న శుభ్మన్ గిల్ (Shubman Gill) గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్మన్ గిల్ తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత క్రికెట్లో ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల జాబితాలో శుభ్మన్ గిల్ (Shubman Gill) ముందువరుసలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ 24ఏళ్ల కుర్రాడు కొంతకాలంగా నిలకడగా ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో టాప్ స్కోరర్గా నిలిచిన గిల్.. ఇటీవల ముగిసిన ఆసియా కప్లో 75.50 సగటుతో 302 పరుగులు చేశాడు. మరో రెండు, మూడేళ్లలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైరయ్యే అవకాశం ఉంది. దీంతో టీమ్ఇండియా భవిష్యత్ స్టార్గా ఎదుగుతున్న గిల్ గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్మన్ గిల్ తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. రాబోయే వన్డే ప్రపంచకప్ (World Cup 2023)లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో గిల్ కూడా ఉంటాడని పేర్కొన్నాడు.
‘‘గిల్ గత ఏడాదిన్నరగా నిలకడగా ఆడుతున్నాడు. మధ్యలో వెస్టిండీస్ టూర్లో కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ, ఆసియా కప్తో తిరిగి ఫామ్ అందుకుని మంచి స్కోర్లు చేశాడు. అతను సానుకూలంగా కనిపిస్తున్నాడు. ఫుట్వర్క్ కూడా బాగుంది. సునాయాసంగా 50, 100 పరుగులు చేస్తున్నాడు. రానున్న వన్డే ప్రపంచకప్లో అతి ముఖ్యమైన ఆటగాళ్లలో శుభ్మన్ గిల్ కూడా ఉంటాడు. అతను స్టార్ ఆటగాడిగా ఎదగాలని, తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడని నాకు తెలుసు. ఇప్పటికే అలాంటి వాతావరణం ఏర్పడింది. ప్రపంచకప్ తర్వాత మనం తరచూ అతని గురించే మాట్లాడుకుంటాం. అతని హ్యాండ్ పవర్ బలంగా ఉంది. ఆ బలాన్ని ఉపయోగించి బలమైన షాట్లు ఆడతాడు. అతనికి ఎక్కడ బౌలింగ్ వేయాలో స్పిన్నర్లకు తెలియదు. ఫాస్ట్ బౌలర్లు బంతిని స్వింగ్ చేయకపోతే నేరుగా లేదా ఫ్లిక్తో వాటిని బాగా ఆడగలడు. గిల్ దూకుడు ఇక్కడితో ఆగదు. 2019 ప్రపంచకప్లో రోహిత్ శర్మ దంచికొట్టాడు. గిల్ ఈ ప్రపంచకప్లో రోహిత్ మాదిరిగానే రాణిస్తాడు. అతను ఓపెనర్ కావడంతో 50 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు అవకాశం దొరికింది. అతడికున్న అడ్వాంటేజ్ ఇదే’’ అని సురేశ్ రైనా జియో సినిమాతో అన్నాడు. గిల్ సెప్టెంబరు 22 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్పై దృష్టిపెట్టాడు. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?