Shubman Gill: ‘శుభ్మన్ గిల్ తదుపరి కోహ్లీ కావాలనుకుంటున్నాడు.. ప్రపంచకప్లో దంచికొడతాడు’
టీమ్ఇండియా భవిష్యత్ స్టార్గా ఎదుగుతున్న శుభ్మన్ గిల్ (Shubman Gill) గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్మన్ గిల్ తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత క్రికెట్లో ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల జాబితాలో శుభ్మన్ గిల్ (Shubman Gill) ముందువరుసలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ 24ఏళ్ల కుర్రాడు కొంతకాలంగా నిలకడగా ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో టాప్ స్కోరర్గా నిలిచిన గిల్.. ఇటీవల ముగిసిన ఆసియా కప్లో 75.50 సగటుతో 302 పరుగులు చేశాడు. మరో రెండు, మూడేళ్లలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైరయ్యే అవకాశం ఉంది. దీంతో టీమ్ఇండియా భవిష్యత్ స్టార్గా ఎదుగుతున్న గిల్ గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్మన్ గిల్ తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. రాబోయే వన్డే ప్రపంచకప్ (World Cup 2023)లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో గిల్ కూడా ఉంటాడని పేర్కొన్నాడు.
‘‘గిల్ గత ఏడాదిన్నరగా నిలకడగా ఆడుతున్నాడు. మధ్యలో వెస్టిండీస్ టూర్లో కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ, ఆసియా కప్తో తిరిగి ఫామ్ అందుకుని మంచి స్కోర్లు చేశాడు. అతను సానుకూలంగా కనిపిస్తున్నాడు. ఫుట్వర్క్ కూడా బాగుంది. సునాయాసంగా 50, 100 పరుగులు చేస్తున్నాడు. రానున్న వన్డే ప్రపంచకప్లో అతి ముఖ్యమైన ఆటగాళ్లలో శుభ్మన్ గిల్ కూడా ఉంటాడు. అతను స్టార్ ఆటగాడిగా ఎదగాలని, తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడని నాకు తెలుసు. ఇప్పటికే అలాంటి వాతావరణం ఏర్పడింది. ప్రపంచకప్ తర్వాత మనం తరచూ అతని గురించే మాట్లాడుకుంటాం. అతని హ్యాండ్ పవర్ బలంగా ఉంది. ఆ బలాన్ని ఉపయోగించి బలమైన షాట్లు ఆడతాడు. అతనికి ఎక్కడ బౌలింగ్ వేయాలో స్పిన్నర్లకు తెలియదు. ఫాస్ట్ బౌలర్లు బంతిని స్వింగ్ చేయకపోతే నేరుగా లేదా ఫ్లిక్తో వాటిని బాగా ఆడగలడు. గిల్ దూకుడు ఇక్కడితో ఆగదు. 2019 ప్రపంచకప్లో రోహిత్ శర్మ దంచికొట్టాడు. గిల్ ఈ ప్రపంచకప్లో రోహిత్ మాదిరిగానే రాణిస్తాడు. అతను ఓపెనర్ కావడంతో 50 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు అవకాశం దొరికింది. అతడికున్న అడ్వాంటేజ్ ఇదే’’ అని సురేశ్ రైనా జియో సినిమాతో అన్నాడు. గిల్ సెప్టెంబరు 22 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్పై దృష్టిపెట్టాడు. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.