Team India: భారత బ్యాటర్లలో ఎప్పటికీ అతడే బెస్ట్: నవ్జ్యోత్ సిద్ధూ
ప్రతీ తరానికి ఒక్కో అత్యుత్తమ క్రికెటర్ వస్తుంటారు. అయితే, ఓవరాల్ ఎవరు టాప్ ప్లేయర్ అని చెప్పడం కష్టమే. కానీ, మాజీ ఆటగాడు నవ్జ్యోత్ సిద్ధూ మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ కామెంట్రీలోకి మళ్లీ అడుగుపెట్టిన భారత మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సిద్ధూ (Navjot Sidhu) విశ్లేషణలకు పదునుపెట్టాడు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్తో (IPL) కామెంట్రీ బాక్స్లోకి సిద్ధూ పునరాగమనం చేయనున్నాడు. తాజాగా ఓ ఛానల్లో మాట్లాడిన సిద్ధూ భారత్ తరఫున అద్భుతంగా ఆడిన బ్యాటర్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తదితరుల్లో ఎవరు బెస్ట్ అనేది వెల్లడించాడు. అలాగే ఆర్సీబీ తరఫున కోహ్లీ (Virat Kohli) మూడో స్థానంలో ఆడటమే ఉత్తమం అని వ్యాఖ్యానించాడు. గత సీజన్లో ఎక్కువ భాగం కోహ్లీ ఓపెనర్గానే బరిలోకి దిగాడు.
‘‘జట్టు అవసరాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు ప్రపంచంలోని గొప్ప క్రికెటర్. అయితే, జట్టు విజయాలు సాధించకపోతే ఎంతటి ఆటగాడైనా ఇబ్బంది పడతాడు. ఐపీఎల్లో ఒక్కసారి కూడా టైటిల్ను ఎత్తుకోలేదు. ఇప్పుడు అదంతా వదిలేసి తాజాగా ఆర్సీబీ మొదలుపెట్టాలి. కోహ్లీని తక్కువ చేయడం కాదు. తన జట్టు కోసం అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాడనడంలో సందేహం లేదు. అందుకే, అతడిని భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్గా నేను ఎంపిక చేస్తా. నా క్రికెట్ కెరీర్లో చాలా తరాలను చూశా. 70ల్లో సునీల్ గావస్కర్ విండీస్పై అదరగొట్టాడు. భీకరమైన బౌలర్లను ఎదుర్కొని మరీ ఆడాడు. మేం తరగతులు ఎగ్గొట్టి మరీ రేడియోల్లో వినేవాళ్లం. దాదాపు 20 ఏళ్లపాటు క్రికెట్ను శాసించాడు.
ఇక సచిన్ తెందూల్కర్ రావడం మరో అద్భుతం. ధోనీ, విరాట్ కోహ్లీ.. ఇలా ప్రతిఒక్కరూ అత్యుత్తమంగా రాణించారు. వీరి నలుగురిలో కోహ్లీకే ఎక్కువ మార్కులు ఇస్తా. మూడు ఫార్మాట్లలో అదరగొట్టేశాడు. కోహ్లీ ఫిట్నెస్ స్థాయి అద్భుతం. టెక్నికల్గానూ ఉత్తమ ఆటగాడు. సచిన్ కూడా తన కెరీర్లో చాలాసార్లు గాయపడ్డాడు. ధోనీ ఫిట్గా ఉన్నా.. విరాట్ మాత్రం సూపర్ ఫిట్ ప్లేయర్. అందుకే, అతడు నిలకడగా జట్టులో ఉంటున్నాడు’’ అని సిద్ధూ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్