Mohammed Siraj: సిరాజ్ అలసిపోయాడు.. విశ్రాంతి ఇవ్వండి: బెంగళూరు మేనేజ్మెంట్కు హర్భజన్ సూచన
హైదరాబాదీ బౌలర్ సిరాజ్ ఈసారి ఐపీఎల్లో తన మాయను ప్రదర్శించలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటి? సమస్యకు పరిష్కారం ఏంటనేది భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత సీజన్లో అత్యంత ఘోరమైన ప్రదర్శనతో బెంగళూరు స్టార్ బౌలర్ సిరాజ్ (Mohammed Siraj) నిరాశ పరుస్తున్నాడు. ముంబయితో జరిగిన మ్యాచ్లోనూ 3 ఓవర్లు వేసిన అతడు వికెట్ లేకుండా 37 పరుగులు సమర్పించాడు. ఓవైపు బుమ్రా ఐదు వికెట్లు తీస్తే.. సిరాజ్ కనీసం ఒక్కటి కూడా పడగొట్టకపోవడంతో నెట్టింట విమర్శలూ వస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన 15 మంది జాబితాలోనూ సిరాజ్ లేడు. ఆరు మ్యాచుల్లో 4 వికెట్లు మాత్రమే తీసి 229 పరుగులు సమర్పించాడు. ఈక్రమంలో బెంగళూరు ఫ్రాంచైజీకి హర్భజన్ సింగ్ కీలక సూచనలు చేశాడు.
‘‘ఒకవేళ నేను బెంగళూరు మేనేజ్మెంట్లో ఉండుంటే.. సిరాజ్కు తప్పకుండా విశ్రాంతినిస్తా. కొన్ని మ్యాచ్లకు అతడిని దూరంగా పెడతా. కొత్త బంతితో వికెట్లు తీసే అతడు ఇబ్బందిపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీమ్ఇండియాకు అతడు ఛాంపియన్ బౌలర్. బెంగళూరుకూ స్టార్ పేసర్. జాతీయ జట్టు తరఫున విపరీతంగా క్రికెట్ ఆడటం వల్ల అతడు బాగా అలసిపోయాడు. మానసికంగా, శారీరంగానూ సిరాజ్కు కాస్త విశ్రాంతి అవసరం’’ అని హర్భజన్ తెలిపాడు.
ఐపీఎల్ 2024లో ఆడకపోవడానికి కారణమదే: జేసన్ రాయ్
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జేసన్ రాయ్ ప్రస్తుత సీజన్ ఆడకుండా వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఆడటం లేదని మెగా లీగ్ ప్రారంభానికి ముందు రాయ్ ప్రకటించాడు. దీంతో అతడి స్థానంలో ఇంగ్లాండ్కు చెందిన మరో ఆటగాడు ఫిల్ సాల్ట్ను కోల్కతా తీసుకుంది. గతేడాది శ్రేయస్ అయ్యర్, షకిబ్ అల్ హసన్ జట్టులో లేనప్పుడు రాయ్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. మరోసారి అతడి ఆటను చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. తాను సీజన్లో ఆడకపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేసన్ రాయ్ వెల్లడించాడు.
‘‘కోల్కతా నాపై చాలా నమ్మకం ఉంచింది. నన్ను మళ్లీ రిటైన్ చేసుకుని జట్టులో అవకాశం కల్పించింది. కానీ, నేను ఆడటానికి సిద్ధంగా లేకపోవడంతో ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నా. మేం తొలి మ్యాచ్ ఆడే సమయానికి నా కుమార్తె జన్మదినం ఉంది. కుటుంబం కోసం ఉండాలనుకున్నా. అంతేకాకుండా చక్కదిద్దాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు వరకు పెద్దగా మ్యాచ్లు కూడా ఆడలేదు. దీంతో ఇక్కడికి వచ్చి నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించలేకపోతే నాపై జట్టుకున్న నమ్మకం పోతుంది. దీంతో నా మానసిక స్థితితోపాటు శారీరకంగా ఫిట్నెస్ కోసం తప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నా’’ అని జేసన్ రాయ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్