Mohammed Siraj: సిరాజ్ అలసిపోయాడు.. విశ్రాంతి ఇవ్వండి: బెంగళూరు మేనేజ్మెంట్కు హర్భజన్ సూచన
హైదరాబాదీ బౌలర్ సిరాజ్ ఈసారి ఐపీఎల్లో తన మాయను ప్రదర్శించలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటి? సమస్యకు పరిష్కారం ఏంటనేది భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత సీజన్లో అత్యంత ఘోరమైన ప్రదర్శనతో బెంగళూరు స్టార్ బౌలర్ సిరాజ్ (Mohammed Siraj) నిరాశ పరుస్తున్నాడు. ముంబయితో జరిగిన మ్యాచ్లోనూ 3 ఓవర్లు వేసిన అతడు వికెట్ లేకుండా 37 పరుగులు సమర్పించాడు. ఓవైపు బుమ్రా ఐదు వికెట్లు తీస్తే.. సిరాజ్ కనీసం ఒక్కటి కూడా పడగొట్టకపోవడంతో నెట్టింట విమర్శలూ వస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన 15 మంది జాబితాలోనూ సిరాజ్ లేడు. ఆరు మ్యాచుల్లో 4 వికెట్లు మాత్రమే తీసి 229 పరుగులు సమర్పించాడు. ఈక్రమంలో బెంగళూరు ఫ్రాంచైజీకి హర్భజన్ సింగ్ కీలక సూచనలు చేశాడు.
‘‘ఒకవేళ నేను బెంగళూరు మేనేజ్మెంట్లో ఉండుంటే.. సిరాజ్కు తప్పకుండా విశ్రాంతినిస్తా. కొన్ని మ్యాచ్లకు అతడిని దూరంగా పెడతా. కొత్త బంతితో వికెట్లు తీసే అతడు ఇబ్బందిపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీమ్ఇండియాకు అతడు ఛాంపియన్ బౌలర్. బెంగళూరుకూ స్టార్ పేసర్. జాతీయ జట్టు తరఫున విపరీతంగా క్రికెట్ ఆడటం వల్ల అతడు బాగా అలసిపోయాడు. మానసికంగా, శారీరంగానూ సిరాజ్కు కాస్త విశ్రాంతి అవసరం’’ అని హర్భజన్ తెలిపాడు.
ఐపీఎల్ 2024లో ఆడకపోవడానికి కారణమదే: జేసన్ రాయ్
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జేసన్ రాయ్ ప్రస్తుత సీజన్ ఆడకుండా వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఆడటం లేదని మెగా లీగ్ ప్రారంభానికి ముందు రాయ్ ప్రకటించాడు. దీంతో అతడి స్థానంలో ఇంగ్లాండ్కు చెందిన మరో ఆటగాడు ఫిల్ సాల్ట్ను కోల్కతా తీసుకుంది. గతేడాది శ్రేయస్ అయ్యర్, షకిబ్ అల్ హసన్ జట్టులో లేనప్పుడు రాయ్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. మరోసారి అతడి ఆటను చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. తాను సీజన్లో ఆడకపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేసన్ రాయ్ వెల్లడించాడు.
‘‘కోల్కతా నాపై చాలా నమ్మకం ఉంచింది. నన్ను మళ్లీ రిటైన్ చేసుకుని జట్టులో అవకాశం కల్పించింది. కానీ, నేను ఆడటానికి సిద్ధంగా లేకపోవడంతో ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నా. మేం తొలి మ్యాచ్ ఆడే సమయానికి నా కుమార్తె జన్మదినం ఉంది. కుటుంబం కోసం ఉండాలనుకున్నా. అంతేకాకుండా చక్కదిద్దాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు వరకు పెద్దగా మ్యాచ్లు కూడా ఆడలేదు. దీంతో ఇక్కడికి వచ్చి నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించలేకపోతే నాపై జట్టుకున్న నమ్మకం పోతుంది. దీంతో నా మానసిక స్థితితోపాటు శారీరకంగా ఫిట్నెస్ కోసం తప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నా’’ అని జేసన్ రాయ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల