Australia: మిగిలిన టీ20లకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు..!
టీమ్ ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్కు ఆసీస్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. అరడజను మంది ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: భారత్తో టీ20 సిరీస్ మధ్యలో ఆస్ట్రేలియా (Australia) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. ఓపెనర్ స్టీవ్ స్మిత్, స్టార్ బౌలర్ ఆడమ్ జంపా స్వదేశానికి పయనమయ్యారు. ఈ విషయాన్ని క్రికెట్.కామ్ వెల్లడించింది. మూడో మ్యాచ్ ఆడిన తర్వాత బుధవారం గ్లెన్ మ్యాక్స్వెల్, స్టాయినిస్, ఇంగ్లిస్, అబాట్ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. ఇక ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్ మాత్రం జట్టుతోపాటే కొనసాగనున్నాడు.
ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ను అందించిన ఆ ఒక్క మీటింగ్..!
ఆస్ట్రేలియా నుంచి కీపర్ జోష్ ఫిలిప్, హిట్టర్ బెన్ మెక్డెర్మోట్ వచ్చి జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇక బెన్ డ్వార్షస్, స్పిన్నర్ క్రిస్ గ్రీన్ నాలుగో మ్యాచ్ నాటికి అందుబాటులోకి రానున్నారు. ఆసీస్ జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాన్ని వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ సమర్థించాడు. టీ20 సిరీస్ మధ్యలో సహచరులు వెనక్కి రావడానికి మద్దతు పలికాడు. ప్రపంచకప్ జైత్రయాత్ర తర్వాత తమ ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్ కోసం సర్వశక్తులు ధారపోసి.. ఆ తర్వాత మరికొన్ని మ్యాచ్లు ఆడటానికి వారేమీ రోబోలు కాదని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. వారి నిర్ణయాన్ని తాను వ్యతిరేకించనని తెలిపాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ప్రపంచకప్ ట్రోఫీని మీడియాకు ప్రదర్శించిన సందర్భంగా పాట్ కమిన్స్ మాట్లాడుతూ..‘‘గత కొన్ని నెలలుగా మా జట్టు చాలా బిజీగా ఉంది. ఇప్పటికీ ఆసీస్కు చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఈ పర్యటనలు తుది జట్టులో స్థానం దక్కించుకోని.. మా యువకులకు సరికొత్త అవకాశాలు ఇవ్వడం సంతోషకరం. వారు ఈ పర్యటనల నుంచి చాలా నేర్చుకోవచ్చు’’ అని అన్నాడు.
భారత్తో జరుగుతున్న పొట్టి సిరీస్లో నిర్ణయాత్మక సమరానికి ఆసీస్ సన్నద్ధమైంది. నేడు జరిగే మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా ఢీకొంటుంది. తొలి మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 44 పరుగుల తేడాతో పైచేయి సాధించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి