Australia: మిగిలిన టీ20లకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు..!
టీమ్ ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్కు ఆసీస్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. అరడజను మంది ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: భారత్తో టీ20 సిరీస్ మధ్యలో ఆస్ట్రేలియా (Australia) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. ఓపెనర్ స్టీవ్ స్మిత్, స్టార్ బౌలర్ ఆడమ్ జంపా స్వదేశానికి పయనమయ్యారు. ఈ విషయాన్ని క్రికెట్.కామ్ వెల్లడించింది. మూడో మ్యాచ్ ఆడిన తర్వాత బుధవారం గ్లెన్ మ్యాక్స్వెల్, స్టాయినిస్, ఇంగ్లిస్, అబాట్ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. ఇక ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్ మాత్రం జట్టుతోపాటే కొనసాగనున్నాడు.
ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ను అందించిన ఆ ఒక్క మీటింగ్..!
ఆస్ట్రేలియా నుంచి కీపర్ జోష్ ఫిలిప్, హిట్టర్ బెన్ మెక్డెర్మోట్ వచ్చి జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇక బెన్ డ్వార్షస్, స్పిన్నర్ క్రిస్ గ్రీన్ నాలుగో మ్యాచ్ నాటికి అందుబాటులోకి రానున్నారు. ఆసీస్ జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాన్ని వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ సమర్థించాడు. టీ20 సిరీస్ మధ్యలో సహచరులు వెనక్కి రావడానికి మద్దతు పలికాడు. ప్రపంచకప్ జైత్రయాత్ర తర్వాత తమ ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్ కోసం సర్వశక్తులు ధారపోసి.. ఆ తర్వాత మరికొన్ని మ్యాచ్లు ఆడటానికి వారేమీ రోబోలు కాదని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. వారి నిర్ణయాన్ని తాను వ్యతిరేకించనని తెలిపాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ప్రపంచకప్ ట్రోఫీని మీడియాకు ప్రదర్శించిన సందర్భంగా పాట్ కమిన్స్ మాట్లాడుతూ..‘‘గత కొన్ని నెలలుగా మా జట్టు చాలా బిజీగా ఉంది. ఇప్పటికీ ఆసీస్కు చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఈ పర్యటనలు తుది జట్టులో స్థానం దక్కించుకోని.. మా యువకులకు సరికొత్త అవకాశాలు ఇవ్వడం సంతోషకరం. వారు ఈ పర్యటనల నుంచి చాలా నేర్చుకోవచ్చు’’ అని అన్నాడు.
భారత్తో జరుగుతున్న పొట్టి సిరీస్లో నిర్ణయాత్మక సమరానికి ఆసీస్ సన్నద్ధమైంది. నేడు జరిగే మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా ఢీకొంటుంది. తొలి మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 44 పరుగుల తేడాతో పైచేయి సాధించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు