Ruturaj Gaikwad: అప్పుడూ.. ఇప్పుడూ నా వెంటే ధోనీ భాయ్: రుతురాజ్ గైక్వాడ్
కోల్కతాపై సూపర్ ఇన్నింగ్స్తో చెన్నైను గెలిపించడంలో కెప్టెన్ రుతురాజ్ (Ruturaj Gaikwad) కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో తొలిసారి హాఫ్ సెంచరీ మార్క్ను అందుకొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెపాక్లో చెన్నై హ్యాట్రిక్ విజయం సాధించింది. బయటి వేదికల్లో జరిగిన గత రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన ఆ జట్టుకు ఊరటనిచ్చే గెలుపు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ -4లోనే కొనసాగుతోంది. కోల్కతాపై కెప్టెన్ ఇన్నింగ్స్తో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్కు వచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు. భారీ షాట్లు కొట్టకపోయినా క్రీజ్లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఇక తన గురువుతో కలిసి మ్యాచ్ను ముగించడంపై రుతురాజ్ ఆనందం వ్యక్తం చేశాడు.
‘‘ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత నాకు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఐపీఎల్లో నేను తొలిసారి హాఫ్ సెంచరీ సాధించినప్పుడు నా పక్కన ధోనీ ఉన్నాడు. ఇప్పుడు కోల్కతాపై విజయం సాధించినప్పుడు అతడితో కలిసి ముగించడం బాగుంది. అజింక్య రహానె స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో నేను చివరి వరకూ క్రీజ్లో ఉండాలని భావించా. పిచ్ కూడా బ్యాటింగ్కు పెద్దగా అనుకూలంగా లేదు. 160 పరుగులు చేసినా మంచి స్కోరే అవుతుంది. లక్ష్య ఛేదన సమయంలో స్ట్రైక్ను రొటేట్ చేస్తూ బౌండరీల కోసం చూడాలి. ఇక్కడ భారీ సిక్స్లు కొట్టడం సులువేం కాదు. పవర్ ప్లే తర్వాత జడేజా అత్యంత ప్రభావితం చేసే బౌలర్. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయగలడు. జట్టులోని ప్రతి ఒక్కరికీ ప్రతి విషయమూ చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ధోనీ భాయ్ ఉన్నాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నాడు. ఈసారి సీజన్లో నా ఆట నెమ్మదిగా ప్రారంభమైందని అనుకోవడం లేదు. టీ20ల్లో కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. దూకుడుగా ఆడే క్రమంలో అదృష్టమూ కలిసి రావాలి. కోల్కతాపై సరైన సమయంలోనే ఫామ్ అందుకున్నానని భావిస్తున్నా. నా స్ట్రైక్రేట్ గురించి విశ్లేషకులు ఏదో ఒకటి మాట్లాడతారు. అయితే, మేం విజయం సాధించడం ఆనందం కలిగించింది’’ అని రుతురాజ్ వ్యాఖ్యానించాడు.
ఇలాంటి పిచ్లపై బౌలింగ్ను ఆస్వాదిస్తా: జడేజా
ఐపీఎల్లో చెన్నై తరఫున అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకొన్న రెండో ఆటగాడు రవీంద్ర జడేజా (Ravindra Jadeja). తాజాగా మ్యాచ్లో మూడు వికెట్లు తీయడంతో అతడికి ఈ అవార్డు వరించింది. దీంతో ఎంఎస్ ధోనీతో (15) కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సంందర్భంగా మాట్లాడుతూ.. ‘‘చెపాక్ పిచ్పై బౌలింగ్ను ఎప్పుడూ ఆస్వాదిస్తా. సరైన ప్రాంతంలో బంతులేస్తే ఫలితం అనుకూలంగా వస్తుంది. ఇక్కడ చాలా ప్రాక్టీస్ చేశా. చెపాక్లో పర్యటించే జట్టు కుదురుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. ఆలోపే వారిని ఔట్ చేయడానికి ప్రయత్నించాలి. మాకు ఇక్కడి పిచ్ పరిస్థితిపై అవగాహన ఉండటం కలిసొచ్చే అంశం’’ అని జడేజా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు