T20 Cricket Effect: పసికూనలు కాదు.. కసికూనలు.. షాక్లు మీద షాకులిస్తున్నాయిగా!
క్రికెట్లో పెద్ద జట్టును చిన్న జట్టు ఓడించడం అంటే.. ఎప్పుడో ఏడాదికి ఒకసారి అనేలా ఉండేది. కానీ ఇప్పుడు తరచుగా ఈ మాట వింటున్నాం. ఇటీవల న్యూజిలాండ్ (NewZeland)ను యూఏఈ (UAE) ఓడించి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మార్పునకు కారణమేంటో ఓసారి చూద్దాం.
న్యూజిలాండ్ (NewZeland) అంటే ప్రపంచ క్రికెట్ (World Cricket)లో పెద్ద జట్లలో ఒకటి. అన్ని ఫార్మాట్లలోనూ బలంగా ఉంది. తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో విజేత న్యూజిలాండే. చివరి రెండు వన్డే ప్రపంచకప్పుల్లో రన్నరప్. 2021 టీ20 ప్రపంచకప్లో రన్నరప్. ఇలాంటి జట్టును యూఏఈ (UAE) లాంటి అనామక జట్టు టీ20 మ్యాచ్ (T20 Cricket)లో ఓడించి సంచలనం రేపింది. ఇక్కడ ఆశ్చర్యం అంటే.. ఆ ఓటమి చాలా ఘోరంగా ఉండటం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇలా చిన్న జట్లు.. పెద్ద టీంలకు షాకులివ్వడం ఇప్పుడు మామూలైపోతోంది.
యూఏఈతో మూడు టీ20ల సిరీస్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా విజయం ఆ జట్టునే వరించింది. ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో తడబడ్డ కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. ఛేదనలో యూఏఈ పోరాడినప్పటికీ.. సీనియర్ పేసర్ టిమ్ సౌథీ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడంతో ప్రత్యర్థిని 136 పరుగులకు ఆలౌట్ చేసి 19 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. తొలి మ్యాచ్లో కష్టపడి నెగ్గిన కివీస్.. రెండో టీ20లో రెచ్చిపోయి ఆడుతుందని, ఘనవిజయం సాధిస్తుందని ఆ జట్టు అభిమానులు ఆశించారు. కానీ రెండో టీ20లో యూఏఈ దెబ్బకు కివీస్ షాక్ తింది.
మొదట 8 వికెట్లకు 142 పరుగులే చేయగలిగిందా జట్టు. చాప్మన్ (63) పోరాడకుంటే ఆ మాత్రం స్కోర్ కూడా చేసేది కాదు కివీస్. తర్వాత బ్యాటింగ్లోనూ అదరగొట్టిన యూఏఈ కేవలం 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి కివీస్కు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఈ విజయం తర్వాత యూఏఈ ఆటగాళ్ల సంబరాలు మామూలుగా లేవు. ఆ దేశ క్రికెట్లో ఇదే అతి పెద్ద విజయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఇలా చిన్న జట్లు.. పెద్ద టీంలకు షాకులిస్తే చాలా కాలం దాని గురించి మాట్లాడుకునేవాళ్లం. కానీ టీ20 యుగంలో పెద్ద జట్లను చిన్న టీంలు ఓడించడం తరచుగానే జరుగుతోంది. రెండు నెలల కిందట వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో ఏం జరిగిందో అందరూ చూశారు.
వెస్టిండీస్ లాంటి పెద్ద జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి రావడమే ఆశ్చర్యం అంటే.. ఇందులో నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి చిన్న జట్లు ఈ మాజీ ఛాంపియన్ను అలవోకగా ఓడించి సంచలనం రేపాయి. స్కాట్లాండ్ నిలకడగా రాణించి ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఇక అఫ్గానిస్థాన్ పసికూన నుంచి కసికూనగా మారి చాలా ఏళ్లయింది. పెద్ద జట్లను ఓడించడం ఆ జట్టు అలవాటుగా మార్చుకుంది. ఐర్లాండ్, నెదర్లాండ్స్ లాంటి జట్లు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్ద జట్లకు గట్టి పోటీనిచ్చే స్థాయిలో ఉన్నాయి. తమదైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడించగలమని చాటుతున్నాయి.
టీ20ల పుణ్యమే..
చిన్న జట్ల ఎదుగుదలలో టీ20 క్రికెట్ కీలక పాత్ర పోషిస్తోంది. దీని వల్ల చిన్న జట్ల ఆటగాళ్లకు మంచి ఎక్స్పోజర్ వస్తోంది. ఐదు రోజులు నిలబడి ఆడాల్సిన టెస్టులంటే చిన్న జట్లకు చాలా కష్టం. వన్డేల్లో 50 ఓవర్లు నిలబడటం కొంచెం కష్టమే. కానీ టీ20ల కథ వేరు. ఈ ఫార్మాట్లో జట్ల మధ్య అంతరం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఒక్క మెరుపు ఇన్నింగ్స్తో ఏమైనా జరిగిపోవచ్చు. ఒక ఆటగాడు కొన్ని ఓవర్లు విధ్వంసం సృష్టిస్తే ఆ జట్టు పైచేయి సాధించవచ్చు. అలాగే ఒక బౌలర్ మెరుపు స్పెల్తో ప్రత్యర్థి కుదేలు కావచ్చు. అలాంటి సంచలన ప్రదర్శనలు నమోదైనపుడు మ్యాచ్ ఫలితాలు తారుమారు అయిపోతుంటాయి.
టెస్టులు, వన్డేల నిర్వహణ అంటే కష్టం కానీ.. టీ20 సిరీస్లకు లోటే ఉండట్లేదు. చిన్న జట్ల మధ్య తరచుగా ద్వైపాక్షిక సిరీస్లు జరుగుతున్నాయి. దీంతో ఆటగాళ్లకు అనుభవం పెరుగుతోంది. ఈ ఫార్మాట్లో రాటుదేలుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా టీ20ల లీగ్లు బోలెడన్ని ఉన్నాయి. భారత ఆటగాళ్లను మినహాయిస్తే.. ప్రపంచవ్యాప్తంగా అన్ని టీ20 లీగుల్లోనూ అన్ని దేశాల ఆటగాళ్లూ ఆడుతున్నారు. ఈ మధ్య టీ10 లీగ్స్ కూడా పెరిగాయి. ఇందులో చిన్న జట్ల ఆటగాళ్లకు మంచి అవకాశం లభిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఆటగాళ్లతో కలిసి మ్యాచ్లు ఆడుతూ రాటుదేలుతున్నారు.
అందువల్లే పెద్ద జట్లతో మ్యాచ్ల సమయంలో భయం ఉండట్లేదు. ఎలాంటి బౌలర్లు, బ్యాటర్లను అయినా దీటుగా ఎదుర్కొంటున్నారు. టీ20ల అనుభవం కొన్నిసార్లు వన్డేల్లోనూ ఉపయోగపడుతూ ఆ ఫార్మాట్లో కూడా సంచలనాలు నమోదు చేస్తున్నారు. వచ్చే వన్డే ప్రపంచకప్లోనూ అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్ లాంటి జట్ల నుంచి పెద్ద జట్లకు షాకులు ఎదురైతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన