IPL 2024: ‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది.
(సోర్స్: ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. తొలుత గుజరాత్ చేతిలో.. ఇప్పుడు హైదరాబాద్పై పరాజయం పాలైంది. హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో గుజరాత్ టైటిల్ను నెగ్గగా.. ఇప్పుడు ముంబయి మాత్రం విజయం కోసం శ్రమించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా హార్దిక్ సారథ్యంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు మళ్లీ కెప్టెన్సీని రోహిత్శర్మకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఓ యూజర్ పెట్టిన పోస్టుకు భారత మాజీ క్రికెటర్ సూటిగా సమాధానం ఇచ్చాడు.
‘‘ఐపీఎల్ చరిత్రలో నేను ఇప్పటివరకు చూసిన అత్యంత చెత్త కెప్టెన్సీ అతడిదే. వెంటనే అతడు తన సారథ్యాన్ని వదిలేయాలి. లేకపోతే ముంబయి అయినా తొలగించాలి’’ అని సదరు అభిమాని ఎక్స్లో పోస్టు పెట్టాడు. దీనికి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాను ట్యాగ్ చేశాడు. ‘మీరేం అనుకుంటున్నారు’ అని ప్రశ్నించాడు. సదరు అభిమాని పోస్టుపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘మీకేం అయింది? ఎందుకలా అంటున్నారు? అబద్ధాలను ప్రచారం చేయొద్దు బ్రదర్. మీ స్టేట్మెంట్ తప్పు. అలాగే నా పేరును ప్రస్తావించారు. కానీ, నా పేరులోనూ అక్షర దోషాలు ఉన్నాయి. మీలోనే ఏదో తేడా ఉంది’’ అని చోప్రా పోస్టు చేశాడు.
మళ్లీ అదే ప్రశ్న.. బుమ్రా ఎక్కడ?
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఎలాంటి తప్పిదాలు చేశాడో.. హైదరాబాద్తోనూ హార్దిక్ పాండ్య తన కెప్టెన్సీలో అవే పునరావృతం చేశాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సద్వినియోగం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. హైదరాబాద్తో మ్యాచ్లో నాలుగో ఓవర్ వేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. మళ్లీ బుమ్రాను 13వ ఓవర్లోనే బౌలింగ్కు తీసుకొచ్చాడు. అప్పటికే అభిషేక్, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలు సాధించారు. దీనిని ప్రస్తావిస్తూ.. ఆసీస్ దిగ్గజం టామ్ మూడీ సోషల్ మీడియా వేదికగా ‘‘బుమ్రా ఎక్కడ? మ్యాచ్ ఇప్పటికే సగం ముగిసింది. స్టార్ బౌలర్కు ఒకే ఒక్క ఓవరా ఇచ్చేది?’’ అంటూ పోస్టు పెట్టాడు. బుమ్రాతో 15వ ఓవర్, 19వ ఓవర్ను పాండ్య వేయించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో బుమ్రా వికెట్ లేకుండా 36 పరుగులు ఇచ్చాడు. మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించినా.. వారితో పోలిస్తే బుమ్రా మాత్రం పొదుపుగానే వేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో