ODI WC 2023: వాళ్లకు గాయం.. వీళ్లకు వరం.. ప్రపంచకప్ ఆడే ఛాన్స్ కొట్టేసిన ఆటగాళ్లు
కొన్ని రోజుల ముందు వరకూ అసలు ప్రపంచకప్ ఆడతారనే ఆశలే పెట్టుకోలేదు. తమ దేశాల ప్రపంచకప్ ప్రాథమిక జట్లలో వీళ్లకు చోటు దక్కకపోవడమే అందుకు కారణం. కానీ కొంతమంది ఆటగాళ్లు గాయపడటంతో వీళ్లకు వరంగా మారింది.
రచిన్ రవీంద్ర, హసన్ అలీ, దుషన్ హేమంత, మధుశంక, లిజార్డ్ విలియమ్స్, ఫెలుక్వాయో, అశ్విన్.. ఈ ఆటగాళ్ల గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? భారత్లో అక్టోబర్ 5న ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్లో వివిధ జట్లకు వీళ్లు ఆడబోతున్నారు. అయితే కొన్ని రోజుల ముందు వరకూ వీళ్లు అసలు ప్రపంచకప్ ఆడతారనే ఆశలే పెట్టుకోలేదు. తమ దేశాల ప్రపంచకప్ జట్లలో వీళ్లకు చోటు దక్కకపోవడమే అందుకు కారణం. కానీ కొంతమంది ఆటగాళ్ల గాయం.. వీళ్లకు వరంగా మారింది. ఇప్పుడు అనుకోకుండా ప్రపంచకప్లో ఆడే అవకాశం కొట్టేశారు.
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ఆడటం ఏ క్రికెటర్కైనా జీవితకాల లక్ష్యం. అదే ప్రపంచకప్ గెలిస్తే అంతకుమించి గొప్ప ఘనతేం ఉంటుంది? అందుకే ప్రపంచకప్ ఆడే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆటగాళ్లు పోటీపడతారు. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైతే ఆనందంలో మునిగిపోతారు. ఈ టోర్నీలో జట్టు విజయం కోసం తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతారు. ఇప్పుడు భారత్లో జరిగే ప్రపంచకప్ కోసం పది జట్లు సమరానికి సై అంటున్నాయి. అయితే ప్రపంచకప్లో ఆడే అవకాశం రాదనుకున్న కొంతమంది ఆటగాళ్లు ఇప్పుడీ మెగా టోర్నీలో ఆడబోతున్నారు.
టీమ్ఇండియాలో..
ప్రపంచకప్లోగా కేఎల్ రాహుల్ శస్త్రచికిత్స నుంచి కోలుకోవాలని, జట్టులోకి రావాలని భారత అభిమానులు బలంగా కోరుకున్నారు. అయితే దీని వెనుక మరో ప్రధాన కారణం కూడా ఉంది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంతో దూరమవడంతో ఈ స్థానాన్ని రాహుల్ భర్తీ చేయాలని అభిమానులు ఆశించారు. నిరుడు డిసెంబర్ చివర్లో రోడ్డు ప్రమాదంలో పంత్ గాయపడ్డ సంగతి తెలిసిందే. దీని నుంచి వేగంగా కోలుకుంటున్నప్పటికీ ప్రపంచకప్ వరకూ అతను ఫిట్నెస్ సాధించే అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ పైనే జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. రాహుల్ ఫిట్నెస్ సాధించాలని ఆకాంక్షించింది. ఒకవేళ పంత్ ఉండి ఉంటే.. అప్పుడు ఇషాన్ కిషన్ ప్రపంచకప్ జట్టులోకి వచ్చేవాడే కాదు. అలాగే కేఎల్ రాహుల్కూ తుదిజట్టులో చోటు కూడా కష్టమయ్యేదనే చెప్పాలి. మరోవైపు ప్రపంచకప్లో అక్షర్ ఆడటం ఖాయమేననిపించింది. మొదట టీమ్ఇండియా ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల జట్టులోనూ అక్షర్ ఉన్నాడు. కానీ ఆసియా కప్లో గాయంతో ప్రపంచకప్కూ దూరమయ్యాడు. అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనుకోకుండా అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పుడు మెగా సమరంలో సత్తాచాటాలనే పట్టుదలతో అశ్విన్ ఉన్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో భారత్ గెలిస్తే.. అప్పుడు ఇషాన్, రాహుల్, అశ్విన్ అంతటి అదృష్టవంతులు.. పంత్, అక్షర్ లాంటి దురదృష్టవంతులు ఉండరనే చెప్పాలి.
ఇంకా వీళ్లు..
పాకిస్థాన్తో వార్మప్ మ్యాచ్లో కివీస్ ఓపెనర్గా బరిలో దిగి 92 పరుగులతో ఆకట్టుకున్నాడు రచిన్ రవీంద్ర. అసలైతే అతనీ ప్రపంచకప్లో ఆడేవాడే కాదు. కానీ ఆల్రౌండర్ మైకెల్ బ్రేస్వెల్ పిక్క గాయంతో దూరమవడంతో అతని బదులుగా రచిన్ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక జట్టులో స్పిన్ ఆల్రౌండర్ వహిందు హసరంగ కీలక ఆటగాడిగా ఎదిగాడు. తన లెగ్స్పిన్తో బ్యాటర్లకు కళ్లెం వేయడమే కాదు.. బ్యాటింగ్లోనూ ధనాధన్ ఇన్నింగ్స్లతో అదరగొడతాడు. ఈ ఏడాది లంక ప్రిమియర్ లీగ్లో అత్యధిక పరుగులు (279) చేసిన ఆటగాడు, అత్యధిక వికెట్లు (19) తీసిన బౌలర్ అతనే. కానీ తొడ కండరాల గాయం అతని పాలిట శాపంగా మారింది. ఇప్పుడదే దుషన్ హేమంతకు వరంగా మారి జట్టులో చోటు దక్కేలా చేసింది. లంక పేసర్ దుష్మంత్ చమీర భుజం గాయం కారణంగా దిల్షన్ మధుశంక జట్టులోకి వచ్చాడు.
పాక్ యువ పేసర్ నసీˆమ్ షా ఆసియా కప్లో భుజం గాయానికి గురయ్యాడు. అతను ప్రపంచకప్ ఆడే అవకాశం లేకపోవడం హసన్ అలీకి కలిసొచ్చింది. దక్షిణాఫ్రికా జట్టులో పేసర్లు నోకియా, మగాల స్థానాల్లో వరుసగా లిజార్డ్ విలియమ్స్, ఫెలుక్వాయో ప్రపంచకప్ ఆడబోతున్నారు. 2019 ప్రపంచకప్ సమయంలోనూ నోకియా జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు తరపున ప్రపంచకప్ ఆడే అవకాశం లబుషేన్ కొట్టేశాడు. గాయపడ్డ స్పిన్నర్ ఆస్టన్ అగర్ బదులుగా బ్యాటర్గా లబుషేన్ జట్టులోకి వచ్చాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్