Sourav Ganguly: హార్దిక్ పాండ్యను ట్రోల్ చేయొద్దు: సౌరభ్ గంగూలీ
ముంబయి కెప్టెన్సీ మార్పు అంశంపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్, దిల్లీ జట్టు క్రికెట్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) మాట్లాడాడు. కెప్టెన్సీ విషయంలో అభిమానులు హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను ట్రోల్ చేయొద్దని, అలా చేయడం సరికాదని దాదా సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 7న) ముంబయితో దిల్లీ తలపడనుంది. ప్రస్తుతం ఇరుజట్ల పరిస్థితి ఏమీ బాగోలేదు. దిల్లీ నాలుగు మ్యాచ్లు ఆడి ఒకే మ్యాచ్లో విజయం సాధించగా.. ముంబయి ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల ఖాతా తెరవలేదు. దీంతో ఈ ఇరుజట్లు తలపడే మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు నిర్వహించిన ప్రెస్కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీ మార్పు అంశంపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్, దిల్లీ జట్టు క్రికెట్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) మాట్లాడాడు. కెప్టెన్సీ విషయంలో అభిమానులు హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను ట్రోల్ చేయొద్దని, అలా చేయడం సరికాదని దాదా సూచించాడు.
‘‘అభిమానులు హార్దిక్ పాండ్యను ట్రోల్ చేయొద్దు. ఇది కరెక్ట్ కాదు. ఫ్రాంచైజీ అతడిని కెప్టెన్గా నియమించింది. కెప్టెన్గా నియమించడం అనేది క్రీడల్లో సాధారణ విషయం. టీమ్ ఇండియాకైనా, ఫ్రాంచైజీ టీమ్కైనా ఒకరిని కెప్టెన్గా నియమిస్తారు. అయితే, హార్దిక్కు ముంబయి పగ్గాలు అప్పగించడమనేది అతడు చేసిన తప్పు కాదు. అది ఫ్రాంచైజీ యజమాని తీసుకున్న నిర్ణయం. ఇక, రోహిత్ శర్మ విషయానికొస్తే.. అతడు అద్భుతమైన ఆటగాడు. టీమ్ఇండియా, ఐపీఎల్లో ముంబయి తరఫున ఆటగాడిగా, కెప్టెన్గా అదరగొట్టాడు’’ అని గంగూలీ వివరించాడు.
ఈ సీజన్ ఆరంభానికి ముందు ముంబయి కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను నియమించిన సంగతి తెలిసిందే. ఇది ముంబయి.. ముఖ్యంగా రోహిత్ అభిమానులకు రుచించలేదు. పాండ్యను కెప్టెన్గా నియమించినప్పటినుంచి అతడిని ట్రోల్ చేస్తున్నారు. మైదానంలోనూ ‘రోహిత్.. రోహిత్’ అంటూ నినాదాలు చేస్తూ హార్దిక్ను హేళన చేస్తున్నారు. అయితే, వీటిని అతడు పెద్దగా పట్టించుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM