Sourav Ganguly: కోహ్లీని నేను కెప్టెన్సీ నుంచి తప్పించలేదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ ఎపిసోడ్పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం అప్పట్లో పెద్ద దుమారానికి దారితీసింది. తనను ఆకస్మికంగా సారథ్య బాధ్యతల నుంచి తొలగించారని కోహ్లీ మీడియాతో తెలిపాడు. అప్పటి బీసీసీఐ పెద్దలకు, కోహ్లీకి మధ్య విభేదాలు తలెత్తడంతో కెప్టెన్సీ నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది. అప్పుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు (2021-22) ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో వన్డే కెప్టెన్సీపై విరాట్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 సారథ్య బాధ్యతలను వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని, వన్డే కెప్టెన్గా తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని పేర్కొన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధం. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తర్వాత అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుని ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లీ కెప్టెన్సీ ఎపిసోడ్పై గంగూలీ తాజాగా ఓ షోలో మాట్లాడాడు. విరాట్ తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని గంగూలీ మరోసారి వివరణ ఇచ్చాడు.
‘‘నేను విరాట్ను కెప్టెన్సీ నుంచి తొలగించలేదు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీ టీ20లకు నాయకత్వం వహించడానికి ఆసక్తి చూపలేదు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అతడికి ఒక విషయం చెప్పా. కెప్టెన్సీపై ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిదని సూచించా’’ అని గంగూలీ చెప్పాడు. అలాగే రోహిత్ శర్మ తొలుత మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉండటానికి ఆసక్తి చూపలేదని గంగూలీ పేర్కొన్నాడు. ‘‘రోహిత్ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ వహించడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. నేను అతడిపై ఒత్తిడితో చివరకు అంగీకరించాడు. కానీ, ఎవరు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నా మైదానంలో బాగా ఆడేది ఆటగాళ్లే. తాను భారత క్రికెట్ అభివృద్ధికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను అంతే. ఇది ఒక చిన్న భాగం’’ అని దాదా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..