Virat Kohli: విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దు.. రెచ్చగొట్టొద్దు: బౌలర్లకు మాజీ పేసర్ కీలక సూచన
క్రీజ్లో పాతుకుపోతే విరాట్ కోహ్లీ (Virat Kohli) డేంజరస్ బ్యాటర్. ఒకవేళ ఎవరైనా బౌలర్ స్లెడ్జింగ్కు పాల్పడితే మరింత ప్రమాదకరంగా మారతాడు. ఇదే విషయంపై మాజీ పేసర్ ఎన్తిని కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: మెగా టోర్నీలకు (ODI World Cup 2023) ముందు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మఖయా ఎన్తిని బౌలర్లకు కీలక సూచనలు చేశాడు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. ఈ భారత స్టార్ బ్యాటర్ను మాత్రం రెచ్చగొట్టద్దొని సూచించాడు. ఎందుకో అలా చేయకూడదనేది కూడా వివరించాడు. ఎలాంటి స్లెడ్జింగ్ చేయకుండా తమ పని ఏదో బౌలర్లు చూసుకోవాలని పేర్కొన్నాడు. ‘‘వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీని (Virat Kohli) స్లెడ్జింగ్ చేయొద్దు. బౌలర్ ఎవరైనా సరే స్లెడ్జింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏమీ అనకుండా ఉంటే.. అతడే విసుగుగా భావిస్తాడు. అప్పుడు ఔట్ చేసేందుకు బౌలర్లకు అవకాశం లభిస్తుంది’’ అని వ్యాఖ్యానించాడు.
అదృష్టం కలిసిరావాలి.. ట్రోఫీలను గెలిస్తేనే గొప్ప కెప్టెన్సీకి నిదర్శనం: గావస్కర్
‘‘విరాట్ కోహ్లీ గురించి మా బౌలర్లకు చెప్పేదొక్కటే. అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరూ ఒక్క మాట కూడా అనొద్దు. మళ్లీ మళ్లీ చెబుతున్నా స్లెడ్జింగ్ చేయొద్దు. అలా చేస్తే మాత్రం అతడి చేతుల్లో ఘోర పరాభవం తప్పదు. అతడికి ఇలాంటి పోటీ అంటే చాలా ఇష్టం. ఇలా చేస్తే మాత్రం విరాట్ ఏం కావాలని కోరుకున్నాడో అదే జరుగుతుంది. ఒకవేళ ఎవరూ విరాట్ను ఏమీ అనకుండా ఉంటే తప్పకుండా విసుగుగా భావిస్తాడు. అప్పుడు పొరపాట్లు చేసి ఔటయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, విరాట్కు బౌలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు స్మార్ట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని ఎన్తిని తెలిపాడు.
ఈ నాలుగే సెమీఫైనలిస్టులు..
‘‘భారత్తోపాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సెమీస్కు చేరతాయి. దక్షిణాఫ్రికా ఛాంపియన్గా నిలిచి ట్రోఫీని తీసుకు వస్తుందని భావిస్తున్నా. మా జట్టులో డికాక్, బవుమా, డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషిస్తారు. రబాడ, నోకియా, ఎంగిడి వంటి టాప్ పేసర్లు దక్షిణాఫ్రికా సొంతం. అందుకే, ఈ వరల్డ్ కప్లో మా జట్టు సెమీస్కు చేరగలదని విశ్వసిస్తున్నా. ఐపీఎల్లో నోకియా అద్భుతమైన బౌలింగ్ సంధించాడు. భారత్లోని పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటం కలిసొస్తుంది’’ అని వెల్లడించాడు. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.