FIFA: ముద్దు వివాదం.. ఆ క్షమాపణలు సరిపోవంటూ ఫుట్బాల్ బాస్పై స్పెయిన్ పీఎం ఆగ్రహం
ఫిఫా మహిళల ప్రపంచకప్ 2023ను తొలిసారి గెలిచిన సంతోషంలో ఉన్న స్పెయిన్(Spain)ను ముద్దువివాదం వెంటాడుతోంది. ఆ దేశ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ ప్రవర్తించిన తీరే అందుకు కారణం.
మాడ్రిడ్: ఫిఫా మహిళల ప్రపంచకప్ 2023 (FIFA Women's World Cup) ఛాంపియన్గా స్పెయిన్ (Spain) అవతరించిన సంగతి తెలిసిందే. సంబరాల్లో భాగంగా స్పెయిన్ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ క్రీడాకారుణులకు ముద్దులు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. దానిపై ఆయన క్షమాపణలు చెప్పినా.. ఆరోపణలు ఆగడం లేదు. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఖెజ్ మాట్లాడుతూ.. ఆ సారీ ఏమాత్రం సరిపోదన్నారు.
ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో ఇంగ్లాండ్ (England)ను ఓడించి స్పెయిన్ తొలి ఫిఫా మహిళ ప్రపంచకప్ టైటిల్ను అందుకుంది. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెడల్స్ అందిస్తూ.. స్పెయిన్ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. స్టార్ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో పెదాలను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారడంతో స్పెయిన్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై అడిగిన ప్రశ్నకు ప్రధాని పెడ్రో స్పందిస్తూ.. ‘ఆయన చెప్పిన క్షమాపణలు సరిపోవు. ఆ అభ్యంతరకర ప్రవర్తనపై మరింత స్పష్టత ఇవ్వాలి’ అని అన్నారు. అయితే ఫెడరేషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని, దాని ప్రెసిడెంట్ను నియమించే, తొలగించే అధికారం స్పెయిన్ ప్రభుత్వానికి లేదని చెప్పారు.
అమ్మాయి వద్దనుకుంటే.. ఛాంపియన్ పుట్టింది
తన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు రావడంతో లూయిస్ ఇదివరకే క్షమాపణలు తెలియజేశారు. ‘నేను చేసింది తప్పు కావొచ్చు. దానిని అంగీకరించాలి. అమితమైన సంతోష సమయంలో ఎలాంటి దురుద్దేశం లేకుండా జరిగిన చర్య అది’ అని అన్నారు. కానీ.. ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్లు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఫెడరేషన్ శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.