Kiss Row: ఆ ముద్దుకు నేను అంగీకరించలేదు: స్పష్టత ఇచ్చిన క్రీడాకారిణి
స్పెయిన్ దేశం తొలిసారి ఫిఫా మహిళల ప్రపంచకప్(FIFA Women's World Cup) టైటిల్ను అందుకుంది. ఈ క్రమంలో క్రీడాకారిణులకు మెడల్స్ అందిస్తున్నప్పుడు జరిగిన ఘటన ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.
మాడ్రిడ్: ఫిఫా మహిళల ప్రపంచకప్ 2023 (FIFA Women's World Cup)లో తొలిసారిగా ఛాంపియన్గా నిలిచిన స్పెయిన్(Spain) జట్టు తన విజయంతో కంటే.. వివాదంతోనే అందరినోళ్లలో నానుతోంది. స్పెయిన్ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్.. స్టార్ ప్లేయర్ అయిన జెన్ని హెర్మోసో(Jenni Hermoso) పెదాలను చుంబించడమే అందుకు కారణమైంది. దీంతో స్పెయిన్తో పాటు అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ వివాదంపై హెర్మోసో స్పందించారు. ఆ ముద్దుకు తాను అంగీకరించలేదని వెల్లడించారు.
స్పానిష్ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రూబియాలెస్(Luis Rubiales) రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫెడరేషన్ శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించగా.. రూబియాలెస్ తన చర్యను సమర్థించుకున్నారు. పరస్పర అంగీకారంతోనే అలా వ్యవహరించినట్లు చెప్పారు. ఈ సమాధానంపై హెర్మోసో స్పందించారు. ‘ఈ విషయంపై నేను మీకు స్పష్టత ఇవ్వదల్చుకున్నా. ఆయన నాకు ఇచ్చిన ముద్దుకు నేను ఏ సమయంలోనూ అంగీకారం తెలపలేదు’ అని వెల్లడించారు.
మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణుల యూనియన్ ఫుట్ప్రో విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఆ విషయం వెల్లడించారు. ఫెడరేషన్లో ప్రస్తుత నాయకత్వం కొనసాగితే తాము క్రీడల్లో పాల్గొనమని ఫుట్ప్రో స్పష్టం చేసింది. నాయకత్వ మార్పులు జాతీయ జట్టు ఎదగడానికి దోహదం చేస్తాయని తెలిపింది. అలాగే ఈ వివాదం మహిళల ఫుట్బాల్ జట్టు సాధించిన అద్భుత విజయాన్ని దెబ్బతీయడం ఎంతగానో బాధిస్తోందని పేర్కొంది.
ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో ఇంగ్లాండ్ (England)ను ఓడించి స్పెయిన్ తొలి ఫిఫా మహిళల ప్రపంచకప్ టైటిల్ను అందుకుంది. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెడల్స్ అందిస్తూ.. స్పెయిన్ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. స్టార్ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో పెదాలను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారడంతో స్పెయిన్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే శుక్రవారం అందుకు రూబియాలెస్ నిరాకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల