ప్రణయ్.. సాధించెన్
ప్రపంచ బ్యాడ్మింటన్లో మిగతా భారత క్రీడాకారులందరూ నిష్క్రమించిన వేళ.. చివరి ఆశగా బరిలోకి దిగిన హెచ్.ఎస్.ప్రణయ్.. పతకం ఖాయం చేసుకుని అభిమానులకు ఊరటనిచ్చాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్లో పతకం ఖాయం
క్వార్టర్స్లో అద్భుత విజయం
సాత్విక్-చిరాగ్ జోడీ నిష్క్రమణ
కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నా.. అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడిస్తున్నా.. మేజర్ టోర్నీల్లో టైటిళ్లు, పతకాలు మాత్రం హెచ్.ఎస్.ప్రణయ్కు అందని ద్రాక్షే! ప్రస్తుతం భారత అత్యుత్తమ షట్లర్లలో ఒకడైన ఈ కేరళ ఆటగాడు ఎట్టకేలకు కెరీర్లో ఓ పెద్ద ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సెమీస్కు చేరుకుని పతకం ఖాయం చేసుకున్నాడు. వరుసగా రెండో పర్యాయం పతకం సాధిస్తారనుకున్న స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ మాత్రం ఆ ఘనతకు అడుగు దూరంలో ఆగిపోయింది.
కోపెన్హాగెన్: ప్రపంచ బ్యాడ్మింటన్లో మిగతా భారత క్రీడాకారులందరూ నిష్క్రమించిన వేళ.. చివరి ఆశగా బరిలోకి దిగిన హెచ్.ఎస్.ప్రణయ్.. పతకం ఖాయం చేసుకుని అభిమానులకు ఊరటనిచ్చాడు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 8వ సీడ్ ప్రణయ్ 19-21, 21-18, 21-8తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై అద్భుత విజయం సాధించాడు. తనపై 7-2తో మెరుగైన రికార్డున్న అక్సెల్సన్తో పోరులో ప్రణయ్ తొలి గేమ్ ఓడిపోయి కూడా పుంజుకుని మ్యాచ్ గెలిచిన తీరు అమోఘం. ఆరంభ గేమ్ హోరాహోరీగా సాగినప్పటికీ.. అక్సెల్సన్ నిలకడగా ఆధిక్యంలోనే ఉన్నాడు. 12-17తో వెనుకబడ్డ దశలో ప్రణయ్ పుంజుకుని వరుసగా అయిదు పాయింట్లతో స్కోరు సమం చేసినా.. చివరికి గేమ్ ప్రత్యర్థికే సొంతమైంది. రెండో గేమ్ ఆరంభంలోనే ప్రణయ్ 1-7తో వెనుకబడటంతో అతడి పనైపోయినట్లే అనిపించింది. కానీ ప్రణయ్ పట్టు వదల్లేదు. గొప్పగా పోరాడాడు. 15-15తో స్కోరు సమం చేశాడు. 17-17 వద్ద ప్రణయ్ దూకుడుగా ఆడి అక్సెల్సన్కు షాకిచ్చాడు. వరుసగా మూడు పాయింట్లతో గేమ్ విజయానికి చేరువయ్యాడు. అక్సెల్సన్ అతణ్ని అందుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్ అనూహ్యంగా ఏకపక్షమైంది. అప్పటికే అలసిపోయిన అక్సెల్సన్ ప్రణయ్ దూకుడు ముందు నిలవలేకపోయాడు 5-5 వద్ద విజృంభించిన అతను.. వరుసగా పాయింట్లు కొల్లగొడుతూ 16-6తో పైచేయి సాధించాడు. ఆ తర్వాత ప్రణయ్ విజయం లాంఛనమే అయింది.
సాత్విక్కు నిరాశే: నిరుడు ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం నెగ్గి, మరోసారి పతక ఫేవరెట్లుగా టోర్నీలో అడుగు పెట్టిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టిలకు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచిన ఈ జోడీకి కిమ్ ఆస్ట్రప్-ఆండర్స్ స్కారుప్ జోడీ చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో భారత ద్వయం 18-21, 19-21తో డెన్మార్క్ జంట చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఒక్కసారీ ఆధిక్యం సాధించకపోయినప్పటికీ చివర్లో ప్రత్యర్థుల స్కోరుకు చేరువగా వచ్చి గేమ్ను చేజార్చుకున్న సాత్విక్-చిరాగ్.. రెండో గేమ్లో 15-15తో స్కోరు సమం చేసి మ్యాచ్ను మూడో గేమ్కు మళ్లించేలా కనిపించింది. ఇక్కడి నుంచి ప్రతి పాయింట్ కోసం పోరాటం తీవ్ర స్థాయిలో సాగింది. కానీ ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ ప్రత్యర్థి జోడీ గేమ్తో పాటు మ్యాచ్నూ సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే