Virat Kohli: విరాట్కు ఆ శతకాలెంతో ప్రత్యేకం
వన్డే ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) శతకంతో మెరిశాడు. ఆసీస్పై సెంచరీ సాధించే అవకాశం వచ్చినా.. చేజార్చుకున్నాడు. ఇప్పుడు బంగ్లాపై అద్భుతంగా ఒడిసిపట్టాడు.
క్రికెట్లో శతకం అంటే ఎంతో స్పెషల్. అలాంటిది వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) లాంటి మెగా ఈవెంట్లో మూడంకెల స్కోరు సాధిస్తే ఆ ఆనందమే వేరు. సెంచరీల మీద సెంచరీలు చేసే విరాట్ కోహ్లి (Virat Kohli).. తానాడిన నాలుగు ప్రపంచకప్పుల్లో ఇప్పటిదాకా చేసిన శతకాలు మూడు మాత్రమే! ఇందులో భారత్లో జరిగిన ప్రపంచకప్ల్లో చేసినవే రెండు. అందుకే ఈ మూడు సెంచరీలు అతడికెంతో అమూల్యం. ఇవి భిన్నమైన క్రికెట్ తరాల మధ్య.. ఇంకా భిన్నమైన పరిస్థితుల్లో సాధించడమే ఇందుకు కారణం. 2011లో కుర్రాడిగా జట్టులోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు.. 2015లో ఓ స్టార్గా ఎదిగినప్పుడు.. 2023లో కింగ్గా ఏలుతున్నప్పుడు.. అతడీ సెంచరీలు సాధించాడు.
దిగ్గజాల నీడలో
2011 ప్రపంచకప్లో సచిన్ తెందుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి దిగ్గజాల నీడలో కుర్రాడిగా వచ్చిన కోహ్లి గురించి ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. సీనియర్ ఆటగాళ్లకు అతడు కాస్త తోడ్పాటు ఇస్తే చాలని అభిమానులు అనుకున్నారు. ఈ క్రమంలోనే అతడు బంగ్లాదేశ్పై తొలి ప్రపంచకప్ సెంచరీ చేసి ఉనికి చాటుకున్నాడు. తాను ఎవరనేది ప్రపంచ తెరపై చాటి చెప్పాడు. ఒత్తిడిలోనూ రాణించగల సత్తా ఉందని నిరూపించుకున్నాడు. 83 బంతుల్లోనే 100 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.
ఈసారి మరింత మధురం
2011లో ఒక సెంచరీ సాధించినా.. ఆ తర్వాత నాలుగేళ్లు విరాట్ ఎంతో ఎదిగాడు. ఛేదనలో మొనగాడిగా పేరు తెచ్చుకున్నాడు. దిగ్గజాలు ఒక్కొక్కరుగా నిష్క్రమించడంతో భారత క్రికెట్లే బ్యాటింగ్కు వెన్నెముకగా మారాడు. అలాంటి స్థితిలో వచ్చిన 2015 ప్రపంచకప్లో కోహ్లి కీలక సమయంలో సెంచరీతో తన స్థాయిని చాటుకున్నాడు. అయితే 2011లో మిడిల్డార్లో వచ్చి శతక్కొట్టిన విరాట్.. పాక్పై మూడో స్థానంలో వచ్చి సెంచరీతో మెరిశాడు. శిఖర్ ధావన్తో అతడు వేసిన పునాదే ఈ మ్యాచ్లో భారత్ విజయానికి కారణమైంది.
8 ఏళ్ల తర్వాత
2015 వన్డే ప్రపంచకప్లో కోహ్లి జైత్రయాత్ర మామూలుగా సాగలేదు. పరుగులు ప్రవాహంలా వచ్చాయి. కానీ 2019 వన్డే ప్రపంచకప్లో మాత్రం అతడికి శతకం దక్కలేదు. 5 అర్ధసెంచరీలు సాధించాడు కానీ వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. ఆస్ట్రేలియాపై 82 పరుగులు చేయడమే అతడికి అత్యధికం. ఈ నేపథ్యంలో తాజా ప్రపంచకప్లో బంగ్లాదేశ్పై మూడంకెలను అందుకోవడం కోహ్లికి ఎప్పుటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే 8 ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో వచ్చిన సెంచరీ ఇది. వన్డేల్లో 48వ శతకం. ఎప్పటిలా దూకుడుగా ఆడకుండా.. సాహసాలు చేయకుండా ఎంతో పద్ధతిగా కొట్టిన శతకమిది. ఇదే జోరు కొనసాగిస్తే ఈ టోర్నీలో కోహ్లి మరిన్ని శతకాలు సాధించే అవకాశాలున్నాయి. వన్డేల్లో 50 శతకాల క్లబ్లోనూ చేరే ఛాన్సూ ఉంది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81