Bridge Game: బ్రిడ్జ్లో పతకాలు.. ఈ ఆట గురించి తెలుసా?
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో (Asian Games) బ్రిడ్జ్ (జూదం) ఆడి పతకాలు గెలవొచ్చని చాలా మందికి తెలియదు. ఈ అంతర్జాతీయ పోటీల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించొచ్చు. మనవాళ్లు భారత్ తరపున బరిలో దిగడమే కాదు ఏకంగా రజతం సాధించారు. మరి ఆసియా క్రీడల్లో ఈ బ్రిడ్జ్ గోల ఏమిటో? తెలుసుకుందామా?
ఓ టేబుల్.. చుట్టూ నలుగురు వ్యక్తులు.. మధ్యలో పేక ముక్కలు.. అందరూ సీరియస్గా ఆటలో మునిగిపోయారు. విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గెలిచిన తర్వాత విజయనాదాలు చేశారు. వీళ్లు గెలవాలని కోరుకునే అభిమానులు.. ఆటను పర్యవేక్షించే ప్రతినిధులు. అదేంటీ.. బ్రిడ్జ్ (జూదం) ఆడటమే తప్పు.. ఇది వ్యసనంగా మారి ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. చట్ట విరుద్ధంగా ఆడే వాళ్లను పోలీసులకు అప్పజెప్పాల్సింది పోయి ప్రోత్సహించడమేమిటీ? అనుకుంటున్నారా? అయితే ఇది ఆస్తులు పొగొట్టుకుని కుటుంబాలను నడిరోడ్డుమీదకు లాగేసే ఆట కాదు. ప్రపంచ వేదికపై పతకాలు అందించే గేమ్. అవును.. ఆసియా క్రీడల్లో (Asian Games 2022) బ్రిడ్జ్ (Bridge)గా నిర్వహించిన ఈ ఆటలో పతకాలతో దేశానికి ఖ్యాతి తెచ్చేందుకు అథ్లెట్లు తలపడ్డారు. బ్రిడ్జ్లో రజతం (Silver Medel)తో మన పురుషుల జట్టు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. మరి ఆసియా క్రీడల్లో ఈ బ్రిడ్జ్ గోల ఏంటో? తెలుసుకుందామా?
శతాబ్దాల చరిత్ర..
ఈ ఆటకు శతాబ్దాల చరిత్ర ఉంది. 16వ శతకంలో ఇంగ్లాండ్లో ఆడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అయితే అధికారికంగా బ్రిడ్జ్ కోసం ఓ సంఘాన్ని 90 ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. 1932లోనే అంతర్జాతీయ బ్రిడ్జ్ లీగ్కు అంకురార్పణ జరిగింది. 1958లో ఇది ప్రపంచ బ్రిడ్జ్ సమాఖ్యగా మారింది. అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించడం, ఆటకు ఆదరణ పెంచే చర్యలు చేపట్టడం దీని విధి. 2018లో ఆసియా క్రీడల్లో బ్రిడ్జ్ అడుగుపెట్టింది. అప్పుడు పురుషుల పెయిర్, టీమ్, మహిళల పెయిర్, టీమ్, మిక్స్డ్ పెయిర్, టీమ్, సూపర్మిక్స్డ్ టీమ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పురుషుల పెయిర్లో స్వర్ణం, పురుషుల టీమ్, మిక్స్డ్ టీమ్లో కాంస్యాలు భారత్కు దక్కాయి. అప్పుడు 14 దేశాల నుంచి 213 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. చైనా మూడు స్వర్ణాలు సహా 6 పతకాలు గెలిచింది. ఈ సారి పురుషుల, మహిళల టీమ్, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో మాత్రమే పోటీలు జరిగాయి. పురుషుల టీమ్లో భారత్ రజతం గెలిచింది. ఈ సారి 12 దేశాల నుంచి 171 మంది అథ్లెట్లు బ్రిడ్జ్లో పోటీపడ్డారు.
వేర్వేరు రంగాల నుంచి..
ఆసియా క్రీడల బ్రిడ్జ్లో పాల్గొన్న అథ్లెట్లలో చాలా మంది వేర్వేరు రంగాలకు చెందిన వాళ్లే. కంపెనీలకు సీఈవోలుగా ఉన్నవాళ్లు, ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, వ్యాపార వేత్తలు, ఇతర ప్రొఫెషనల్ రంగాల నుంచి కూడా ఈ క్రీడల్లో పోటీపడ్డారు. సరదాగా ఆడే బ్రిడ్జ్లో పట్టు సాధించిన వాళ్లను ఆయా దేశాలు సెలక్షన్స్ నిర్వహించి మరీ ఆసియా క్రీడలకు పంపాయి. సాధారణంగా క్రీడల్లో యువకులు, పూర్తి ఫిట్నెస్తో ఉన్నవాళ్లు సత్తాచాటడం చూస్తుంటాం. కానీ బ్రిడ్జ్లో మాత్రం అనుభవమే ప్రధాన ఆయుధం. వయసు మీద పడ్డప్పటికీ బ్రిడ్జ్లో చేయి తిరిగి ఉంటే పతకాలు సాధించవచ్చు. 70 ఏళ్లకు పై బడ్డ ఆటగాళ్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. 78 ఏళ్ల మసూద్ మజార్ అత్యంత పెద్ద వయస్కుడు. 2018 క్రీడల్లో 89 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు. మహిళల విభాగంలోనూ పోటీలున్నాయి. దీనికి రిటైర్మెంట్ వయసు అనేది ఉండదు. పిన్న వయస్సు ప్లేయర్ అంటే భారత్కు చెందిన 22 ఏళ్ల విద్య పటేల్. చెస్ లాగే ఇది కూడా మైండ్ స్పోర్ట్. ఇది లాజికల్ పవర్ను పెంచుతుందని చెబుతుంటారు. మెదడు నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. అందుకే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీన్ని గుర్తించింది. కానీ ఇంకా ఒలింపిక్స్లో ప్రవేశపెట్టలేదు. త్వరలోనే ఇది ఒలింపిక్ క్రీడగానూ మారే అవకాశాలున్నాయి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు