England: ఇంగ్లాండ్ జట్టులో ముసలం?ప్రపంచకప్ ఘోర వైఫల్యంతో మొదలైన రచ్చ
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ (England) ఘోర ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి ఒకే దాంట్లోనే విజయం సాధించి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఘోర వైఫల్యంపై ప్రత్యేక కథనం..
ఎనిమిదేళ్ల ముందు ఇంగ్లాండ్ జట్టు (England Cricket Team) వన్డే ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన చేసింది. ఆరు మ్యాచ్ల్లో నాలుగు ఓడి నాకౌట్ చేరకుండానే నిష్క్రమించింది. శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి బలహీన జట్ల చేతిలో కూడా ఇంగ్లాండ్ ఓటములు చవిచూసింది. కానీ అప్పుడు ఇంగ్లిష్ జట్టు వైఫల్యం గురించి పెద్ద చర్చేమీ లేదు. ఎందుకంటే అదేమీ టైటిల్ ఫేవరెట్లలో ఒకటి కాదు. దాన్నొక సాధారణ జట్టులాగే చూశారందరూ. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతే దాన్నో సంచలనంలా కూడా భావించలేదు. కానీ వర్తమానంలోకి వస్తే.. ఇంగ్లాండ్ జట్టు ప్రతి ఓటమీ ఒక షాకే. ఆ జట్టు ఘోర వైఫల్యం అనూహ్యమే. ఓడటం కంటే ఓడిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక అంచనాలతో బరిలోకి దిగి అత్యంత పేలవ ప్రదర్శన చేసిన జట్టుగా నిలవబోతున్న ఇంగ్లాండ్.. ఈ దెబ్బ నుంచి కోలుకోవడం చాలా కష్టంగానే అనిపిస్తోంది.
సునీల్ గావస్కర్ సహా ఎంతోమంది దిగ్గజాలు, మాజీలు, విశ్లేషకులు.. ఇంగ్లాండ్ మరోసారి ప్రపంచకప్ గెలవబోతోందని బల్లగుద్ది చెప్పారు. 2015 ప్రపంచకప్లో ఘోర వైఫల్యం తర్వాత వన్డేలు ఆడే తీరునే పూర్తిగా మార్చేసి, దూకుడుకు మారు పేరుగా తయారైన ఇంగ్లిష్ జట్టు.. నాలుగేళ్లు తిరిగేసరికి ఎంత బలంగా తయారైందో తెలిసిందే. విధ్వంసక బ్యాటర్లు, నాణ్యమైన ఆల్రౌండర్లు, మేటి బౌలర్లతో నిండిన ఆ జట్టు 2019లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో తొలిసారి విజేతగా నిలిచింది. గత నాలుగేళ్లలో ఇంగ్లాండ్ ప్రదర్శన చూశాక మరోసారి టైటిల్ ఫేవరెట్గా ఎక్కువమంది పరిగణించారు. సొంతగడ్డపై భారత్ కూడా టైటిల్కు బలమైన పోటీదారే అయినా.. కప్పు దారిలో ప్రధాన అడ్డంకి ఇంగ్లాండే అవుతుందన్న అంచనాలు కలిగాయి. సెమీస్ లేదా ఫైనల్లో ఇంగ్లాండ్ ఎదురైతే మన జట్టు తట్టుకోగలదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకంటే గత ఏడాది టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరిన భారత్.. ఇంగ్లాండ్ చేతిలో ఏకంగా పది వికెట్ల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అందుకే ఆ జట్టు నుంచి మళ్లీ ముప్పు తప్పదేమో అన్న భయాలు కలిగాయి. కానీ భారత జట్టుతో లీగ్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ ఓడిన తీరు చూస్తే జాలి కలిగి ఉంటుంది. అయిదు మ్యాచ్ల్లో నాలుగు ఓడి పూర్తిగా ఆత్మవిశ్వాసం దెబ్బ స్థితిలో భారత్తో పోరులో అయినా మెరుగైన ప్రదర్శన చేసి పుంజుకునే ప్రయత్నం చేస్తుందనుకుంటే.. బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. 230 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదిస్తూ 100 పరుగుల తేడాతో ఓడటం అంటే డిఫెండింగ్ ఛాంపియన్కు అంతకంటే పరాభవం లేదు. ఇప్పటికే అఫ్గానిస్థాన్, శ్రీలంక లాంటి బలహీన జట్ల చేతిలో ఓడి అవమాన భారాన్ని మోస్తున్న జట్టును ఈ ఓటమి మరింత కుంగదీస్తుందనడంలో సందేహం లేదు. ఇక టోర్నీలో ఆ జట్టు సాంకేతికంగా మాత్రమే ఉన్నట్లు లెక్క. ఇప్పుడా జట్టున్న స్థితిలో నామమాత్రమైన చివరి మూడు మ్యాచ్ల్లో అయినా మెరుగైన ప్రదర్శన చేస్తుందా అన్నది సందేహమే.
అదీ ఇదీ ఒకే జట్టా?
టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా ఫార్మాట్తో సంబంధం లేకుండా ఇంగ్లాండ్ జట్టు కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అయితే ఆ జట్టు దూకుడు మామూలుగా లేదు. 2019లో తొలిసారి వన్డే ప్రపంచకప్ను గెలుచుకున్న ఇంగ్లాండ్.. నిరుడు టీ20 ప్రపంచకప్ను కూడా సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్తో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు ముందే జావగారిపోయే పరిస్థితి. ఆటలో ఆ జట్టు దూకుడు అలా ఉండేది. మిగతా జట్లకు ఇంగ్లాండ్కు తేడా ఏంటంటే.. ఆ జట్టులో కింది వరుసలోనూ బాగా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లుంటారు. బౌలర్లు కూడా 40-50 పరుగులు చేయగల సమర్థులే. అదే సమయంలో బౌలింగ్ చేయడానికి ఆరేడుగురు సిద్ధంగా ఉంటారు. బ్యాటింగ్లో అయినా, బౌలింగ్లో అయినా ఒకరు పోతే ఇంకొకరు అన్నట్లు బోలెడన్ని ప్రత్యామ్నాయాలుండేవి. అందుకే ఆరంభం నుంచి ప్రతి బ్యాటర్ బాదుడే బాదుడు అన్నట్లు ఆడేవాళ్లు.
మలన్, బెయిర్స్టో, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్స్టోన్, మొయిన్ అలీ.. ఇలా ఎంతకీ తరగని బ్యాటింగ్ బలం ఆ జట్టుది. వీళ్లు చాలదన్నట్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మరీ ప్రపంచకప్ కోసం జట్టులోకి వచ్చాడు స్టోక్స్. వుడ్, వోక్స్, విల్లీ, టాప్లీ, సామ్ కరన్, అట్కిన్సన్, రషీద్, లివింగ్స్టన్, అలీ.. ఇలా బౌలింగ్లోనూ ఎన్నో ఆప్షన్లు. ఇలాంటి ఆల్రౌండ్ బలం మరే జట్టుకూ లేదు. ప్రపంచకప్కు ముందు ఆ జట్టు ఫామ్ కూడా బాగుంది. న్యూజిలాండ్ను వన్డే సిరీస్లో ఓడించి టోర్నీలో అడుగు పెట్టింది. అందుకే టోర్నీలో ఆ జట్టును హాట్ ఫేవరెట్గా పేర్కొన్నారు. కానీ మొన్నటిదాకా అదరగొడుతున్న జట్టు అనూహ్యంగా ప్రపంచకప్లో ఘోరమైన ప్రదర్శన చేసింది. ఉన్నట్లుండి ఆ జట్టు ప్రదర్శన ఇంతలా ఎలా పడిపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు.
జట్టులో లుకలుకలు?
ప్రపంచకప్లో ఇంత భారీ అంచనాలతో బరిలోకి దిగి ఇంత ఘోరమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్లో కలకలం రేగుతోంది. నాలుగేళ్ల కిందట ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి ఆ జట్టు మాజీలు, మీడియా వాళ్ల అతి మామూలుగా లేదు. మైకేల్ వాన్ లాంటి వాళ్లు సామాజిక మాధ్యమాల్లో చేసే హడావుడి మామూలుగా ఉండేది కాదు. ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిన ప్రత్యర్థులను హేళన చేయడం ఆ జట్టు మద్దతుదారులకు అలవాటే. ప్రపంచకప్లో ఇంత ఘోరంగా ఆడుతున్నా సరే.. నిన్నటి మ్యాచ్లో కోహ్లి డకౌటైతే బాతు ఫొటోకు అతడి తల అతికించి మార్నింగ్ వాక్కు వెళ్తున్నాడు అంటూ వెటకారంగా ఒక పోస్టు పెట్టింది ఇంగ్లాండ్ ఆర్మీ అనే వెరిఫైడ్ హ్యాండిల్లో. కానీ తర్వాత రూట్ డకౌటైతే మన వాళ్లు రివర్స్ పంచ్లు గట్టిగానే ఇచ్చారు. ప్రపంచకప్ ఘోర వైఫల్యం నేపథ్యంలో వాన్ సహా ఇంగ్లాండ్ మద్దతుదారులు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది.
మాజీలు, మీడియా వాళ్లు జట్టును ఏకిపడేస్తున్నారు. 2019లో ఇంగ్లాండ్ను విజేతగా నిలిపిన మాజీ కెప్టెన్ మోర్గాన్ అయితే.. ప్రస్తుత జట్టులో లుకలుకలున్నాయన్నట్లు మాట్లాడాడు. డ్రెస్సింగ్ రూంలో ఏదో తేడా జరుగుతోందని అతను వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల మధ్య అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయని, సమష్టిగా ఆడట్లేదని మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్రౌండర్ లివింగ్స్టన్, జట్టు కోచ్ ఈ వార్తలను ఖండించినప్పటికీ.. ఆ జట్టులో అంతా సవ్యంగా లేదనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ తర్వాత జట్టు ప్రక్షాళన దిశగా ఇంగ్లాండ్ బోర్డు చర్యలకు దిగే అవకాశాలు కూడా లేకపోలేదు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్