Jake Fraser McGurk: వచ్చాడో మెరుపు వీరుడు.. రికార్డు శతకంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఫ్రేజర్
క్రికెట్లో రికార్డులు బద్దలు కావడం సహజమే. కానీ అరుదైన రికార్డులు చాలా ఏళ్లు నిలిచి ఉంటాయి. ఏబీ డివిలియర్స్ (AB de Villiers) మెరుపు సెంచరీ అలాంటిదే. 2015లో అతడు సృష్టించిన ఆ రికార్డు చాలా ఏళ్లు నిలిచి ఉంటదని అనుకున్నారు కానీ ఓ టీనేజ్ కుర్రాడు ఆ రికార్డును తుడిచి పెట్టేశాడు.
క్రికెట్లో రికార్డులు బద్దలు కావడం సహజమే. కానీ అరుదైన రికార్డులు చాలా ఏళ్లు నిలిచి ఉంటాయి. ఏబీ డివిలియర్స్ (AB de Villiers) మెరుపు సెంచరీ అలాంటిదే. 2015లో అతడు సృష్టించిన ఆ రికార్డు చాలా ఏళ్లు నిలిచి ఉంటుందని అనుకున్నారు కానీ ఓ టీనేజ్ కుర్రాడు ఆ రికార్డును తుడిచి పెట్టేశాడు. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేయని ఈ బ్యాటర్ ఈ రికార్డును సాధించడమే ఇక్కడి విశేషం. అతడి పేరు జేక్ ఫ్రేజర్ మెకెర్క్ (Jake Fraser-McGurk). 21 ఏళ్ల ఈ ఓపెనర్.. రికార్డు శతకంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
బాదుడే బాదుడు
దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రేజర్ టాస్మానియాతో జరిగిన మ్యాచ్లో సునామీలా విరుచుకుపడ్డాడు. సిక్స్లు, ఫోర్లతో దడదడలాడించాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లోనే అతడి సెంచరీ పూర్తయిందంటే ఫ్రేజర్ ఏ స్థాయిలో బ్యాట్ ఝుళిపించాడో అర్థం చేసుకోవచ్చు. 18 బంతుల్లో అర్థసెంచరీ చేసిన అతడు.. మరో 11 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. 38 బంతుల్లో 125 పరుగులు... 10 ఫోర్లు, 13 సిక్స్లు.. ఇదీ అతడి ఇన్నింగ్స్ స్వరూపం. ఇంత వేగంగా ఆడాడు కాబట్టే డివిలియర్స్ రికార్డు బద్దలుకొట్టగలిగాడు.
అండర్-19 ప్రపంచకప్లో ఆడి..
2020లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో జాక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా (Australia) తరఫున ఆడాడు. ఇదే టోర్నీలో ఆసీస్ వర్ధమాన ఆటగాళ్లు తన్వీర్ సంఘా, టాడ్ మార్పీ కూడా బరిలో దిగారు. ఇటీవలే తన్వీర్, టాడ్ మార్ఫీ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. కానీ పెద్దగా రాణించలేదు. అయితే ఇంకా అరంగేట్రం చేయకుండానే ఫ్రేజర్ రికార్డు శతకంతో అదరగొట్టాడు. అండర్-19 టోర్నీలో వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో ఫ్రేజర్ 97 బంతుల్లో 84 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. 4 మ్యాచ్ల్లో దాదాపు వంద స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. క్వార్టర్ఫైనల్లో భారత్ చేతిలో ఆసీస్ ఓడిపోవడంతో అక్కడితో ఫ్రేజర్ ఆట ఆగింది.
కోతి గీరిందని..
2020 అండర్-19 ప్రపంచకప్లో భారత్ చేతిలో ఓడినా అయిదో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్ నుంచి ఓ విచిత్రమైన పరిస్థితిలో ఆఖరి నిమిషంలో ఫ్రేజర్ జట్టు నుంచి తప్పుకున్నాడు. కింబర్లేలో ఆస్ట్రేలియా జట్టు ఓ ప్రకృతి వనాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు కోతి గీరడంతో గాయపడ్డాడు. దీంతో వెస్టిండీస్తో ప్లేఆఫ్ మ్యాచ్తో పాటు టోర్నీ నుంచే వైదొలిగాడు. ఆ తర్వాత పునరాగమనం చేసిన ఫ్రేజర్ ఫామ్ కొనసాగించాడు.
ఫస్ట్క్లాస్ అరంగేట్రంలోనూ మెరిసి
జాక్ ఫ్రేజర్ 17 ఏళ్ల వయసులో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్లోనే సత్తా చాటాడు. విక్టోరియా తరఫున ఆడుతూ క్వీన్స్లాండ్పై అర్ధసెంచరీతో మెరిశాడీ కుర్రాడు. ఆ తర్వాత లిస్ట్-ఏ అరంగేట్రంలోనూ అర్ధసెంచరీతో సత్తా చాటాడు. సౌత్వేల్స్తో మ్యాచ్లో అతడు 49 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఫ్రేజర్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు అద్భుతమైన ఫీల్డర్ కూడా. బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్కు ఆడుతూ అడిలైడ్ స్ట్రైకర్స్పై ఓ కళ్లుచెదిరే క్యాచ్ను అందుకున్నాడు. ఇదే జోరుతో ఆడితే ఫ్రేజర్ను త్వరలోనే ఆసీస్ జట్టులో చూడడం ఖాయం.వార్నర్ లాంటి సీనియర్లు కెరీర్ చరమాంకంలో ఉన్న నేపథ్యంలో ఫ్రేజర్ లాంటి మెరుపు వీరుల రాక కంగారూ జట్టుకు శుభ సంకేతమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్