Dunith Wellalage: ఏకై వచ్చాడు.. మేకైపోయాడు.. శ్రీలంక జట్టులో వెల్లలాగె సంచలనం
శ్రీలంకతో ఆసియా కప్లో సూపర్-4 పోరు. పాక్తో మ్యాచ్లో మాదిరే ఇన్నింగ్స్ను ఘనంగా మొదలుపెట్టింది భారత జట్టు. 11 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఇంకేముంది 350 స్కోరు ఖాయం అనుకున్నారంతా. కానీ చివరికి చూస్తే టీమ్ ఇండియా 213 పరుగులకే ఆలౌటైంది. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న భారత ఇన్నింగ్స్కు బ్రేకులేసి.. వికెట్లు కాపాడుకోవడానికి, పరుగులు చేయడానికి మన బ్యాటర్లు నానా అవస్థలు పడేలా చేసిన బౌలర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage).
శ్రీలంకతో ఆసియా కప్లో సూపర్-4 పోరు. పాక్తో మ్యాచ్లో మాదిరే ఇన్నింగ్స్ను ఘనంగా మొదలుపెట్టింది భారత జట్టు. 11 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఇంకేముంది 350 స్కోరు ఖాయం అనుకున్నారంతా. కానీ చివరికి చూస్తే టీమ్ ఇండియా 213 పరుగులకే ఆలౌటైంది. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న భారత ఇన్నింగ్స్కు బ్రేకులేసి.. వికెట్లు కాపాడుకోవడానికి, పరుగులు చేయడానికి మన బ్యాటర్లు నానా అవస్థలు పడేలా చేసిన బౌలర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage). తర్వాత బ్యాటింగ్లోనూ అదరగొట్టిన ఈ కుర్రాడి వయసు కేవలం 20 ఏళ్లే. మ్యాచ్ నెగ్గింది భారతే అయినా.. ఈ యువ ఆల్రౌండర్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇచ్చారంటే తన ప్రదర్శన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. భారత్తో మ్యాచ్లో సంచలన ప్రదర్శనతో అతడి పేరు మార్మోగింది. ఆసియా కప్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికై.. ఇప్పుడు సీనియర్లకే చెక్ పెట్టేలా కనిపిస్తున్నాడు ఈ కుర్రాడు.
ఈ ఆసియా కప్కు ముందు దునిత్ వెల్లలాగె ఆడింది తొమ్మిది వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ మాత్రమే. 9 వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టి, 109 పరుగులే చేశాడతను. ఏకైక టెస్టులో వికెట్టే పడగొట్టలేకపోయాడు. చేసిన పరుగులు 18 మాత్రమే. అండర్-19 స్థాయిలో సంచలన ప్రదర్శన చేసినప్పటికీ.. శ్రీలంక తరఫున పెద్దగా రాణించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారు. ఆసియా కప్కు కూడా అతడి ఎంపిక సందేహంగానే కనిపించింది. కానీ స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) గాయం కారణంగా ఆసియా కప్కు దూరం కావడం వెల్లలాగెకు కలిసొచ్చింది. ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్టులోనూ అతడికి అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని అతను బాగానే ఉపయోగించున్నాడు. తనలోని ప్రతిభనంతా బయటికి తీస్తూ మ్యాచ్ మ్యాచ్కూ ప్రదర్శనను మెరుగుపరిచాడు. అఫ్గానిస్థాన్పై 33 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టి జట్టు సూపర్-4కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక భారత్పై అతడి ప్రదర్శన ప్రకంపనలు రేపిందనే చెప్పాలి. స్పిన్ ఆడటంలో మంచి నైపుణ్యం ఉన్న రోహిత్, కోహ్లి, రాహుల్, శుభ్మన్ లాంటి స్టార్ బ్యాటర్లను అతను బుట్టలో వేసిన తీరు ప్రశంసలు అందుకుంది. తన బౌలింగ్లో పరుగులు చేయడం సంగతి అటుంచితే.. వికెట్లను కాపాడుకోవడం మన బ్యాటర్లకు కష్టమైంది. పిచ్ స్పిన్గా బాగానే సహకరించిన మాట వాస్తవం కానీ.. మ్యాచ్లో మిగతా స్పిన్నర్లందరినీ మించి అతను రాణించాడు. ఆపై బ్యాటింగ్లోనూ గొప్పగా పోరాడి నిఖార్సయిన ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. హసరంగ లేడు కాబట్టి వేరే ఛాయిస్ లేక వెల్లలాగెను జట్టులోకి తీసుకున్న శ్రీలంకకు ఇప్పుడు తీయని తలనొప్పి ఎదురు కానుంది. హసరంగ తిరిగొచ్చినా.. దునిత్ను కూడా తుది జట్టులో కొనసాగించక తప్పని పరిస్థితి తలెత్తింది. అతడి కోసం తీక్షణ లేదా మరొక ఆటగాడు తన స్థానాన్ని త్యాగం చేయక తప్పేలా లేదు.
అలా వెలుగులోకి..
దునిత్ వెల్లలాగె వెలుగులోకి వచ్చింది గత ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో జరిగిన టీ20 ప్రపంచకప్తో. అప్పటికే వివిధ వయసు విభాగాల్లో సత్తా చాటిన దునిత్ను లంక సెలక్టర్లు అండర్-19 జట్టు కెప్టెన్గా ఎంపిక చేసి ప్రపంచకప్కు పంపించారు. అక్కడ అతను ఆల్రౌండ్ మెరుపులతో అదరగొట్టాడు. వరుసగా రెండు మ్యాచుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడమే కాక.. బ్యాటింగ్లోనూ రాణించాడు. మొత్తంగా 17 వికెట్లు తీయడమే కాక.. 264 పరుగులు కూడా చేసి టోర్నీలో ఉత్తమ ఆల్రౌండర్గా నిలిచాడు. ఒక మ్యాచ్లో వెల్లలాగె ఆల్రౌండ్ మెరుపులు చూసి లెజెండరీ పేసర్ లసిత్ మలింగ అబ్బురపడ్డాడు. వచ్చే దశాబ్ద కాలంలో అతను వన్డే క్రికెట్లో అత్యంత కీలక ఆటగాడు కాబోతున్నాడని మలింగ జోస్యం చెప్పడం విశేషం. ‘‘ఈ రోజు శ్రీలంక 12 మందితో ఆడినట్లు అనిపిస్తోంది. దునిత్ అంత చక్కటి ప్రదర్శన చేశాడు. అతడిలో గొప్ప ఆల్రౌండ్ నైపుణ్యం ఉంది. వన్డేల్లో రాబోయే దశాబ్ద కాలంలో శ్రీలంకకు అతను అత్యంత కీలక ఆటగాడు అవుతాడని నమ్ముతున్నా’’ అని మలింగ పేర్కొన్నాడు. దశాబ్దం వరకు ఏమో కానీ.. ఆసియా కప్ ప్రదర్శనతో దునిత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రపంచకప్లో అతను లంక తురుపుముక్క కాబోతున్నాడనడంలో సందేహం లేదు. ప్రపంచకప్ జరిగేది స్పిన్కు అనుకూలించే భారత్ పిచ్లపై కావడంతో ఆ టోర్నీలో తన మెరుపులు చూడొచ్చు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్