Travis Head: వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head).
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. ఓపెనర్గా క్రీజులో అడుగుపెట్టడం.. ధనాధన్ ఇన్నింగ్స్తో జట్టుకు మెరుపు ఆరంభాలను అందించడమే పనిగా వార్నర్ సాగాడు. కెప్టెన్ కూడా కావడంతో మరింత బాధ్యతతో నిలకడగా పరుగులు సాధించాడు. కానీ వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అదే ఆస్ట్రేలియా నుంచి.. అలాంటి లెఫ్టార్మ్ బ్యాటరే బరిలోకి దిగాడు. సంచలన బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్.
ఆసీస్ నుంచే...
మెరుపు ఆరంభాలను అందించే మరో ఓపెనర్ సన్రైజర్స్కు దొరుకుతాడా?.. ఇవీ 2022 వేలానికి ముందు వార్నర్ను సన్రైజర్స్ వదులుకున్నప్పుడు రేకెత్తిన ప్రశ్నలు. 2022, 2023 సీజన్లలో ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. మార్క్రమ్, మయాంక్, అభిషేక్, హ్యారీ బ్రూక్ ఇలా వేర్వేరు ఓపెనింగ్ జోడీలను పరీక్షించినా ఫలితం దక్కలేదు. అలాంటి దశలో తానున్నానంటూ హెడ్ వచ్చాడు. ఆస్ట్రేలియా నుంచే వార్నర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు దూసుకొచ్చాడు. సన్రైజర్స్ తరపున ఇలా ఐపీఎల్లో అడుగుపెట్టాడో, లేదో అలా రెచ్చిపోతున్నాడు. అయినా అతనంతే. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే.. ఒక్కసారి పిచ్పై అంచనాకు వచ్చి బంతిపై గురి కుదిరితే ఇక ఆగడు. 2013లోనే హెడ్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అప్పుడు రూ.30 లక్షలకు అతణ్ని దిల్లీ తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఆర్సీబీ అతణ్ని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. 2016, 2017 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన అతను.. 10 మ్యాచ్ల్లో 138.51 స్ట్రైక్రేట్తో 205 పరుగులు చేశాడు. ఆ తర్వాత వివిధ కారణాలతో లీగ్కు దూరమయ్యాడు. 2023 సీజన్కు ముందు వేలంలో అతణ్ని ఎవరూ కొనుక్కోలేదు. కానీ నిరుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో, వన్డే ప్రపంచకప్ తుదిపోరులో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ను విజేతగా నిలిపిన హెడ్కు ఈ సీజన్కు ముందు జరిగిన వేలంలో డిమాండ్ ఏర్పడింది. ఇతర జట్లతో పోటీపడీ మరీ సన్రైజర్స్ రూ.6.80 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడా ధరకు న్యాయం చేస్తూ హెడ్ చెలరేగుతున్నాడు.
ఇలాగే సాగితే..
2016లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఐపీఎల్ ఛాంపియన్గా నిలపడంలో వార్నర్ది కీలక పాత్ర. 848 పరుగులు చేసిన అతను.. కోహ్లీ (973) తర్వాత ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. 2015 (562), 2017 (641), 2019 (692)లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. వార్నర్ కాకుండా సన్రైజర్స్ తరపున ఆరెంజ్ క్యాప్ అందుకున్నది ఒక్క విలియమ్సన్ (735) మాత్రమే. ఇక 2019 తర్వాత మరే సన్రైజర్స్ బ్యాటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. తాజాగా బెంగళూరుపై 39 బంతుల్లోనే శతకం చేసిన హెడ్ ఇదే దూకుడు కొనసాగిస్తే ఆరెంజ్ క్యాప్ అందుకునే ఆస్కారముంది. అలాగే సన్రైజర్స్నూ రెండో టైటిల్ దిశగా నడిపించే అవకాశముంది. ఈ సీజన్లో ముంబయితో మ్యాచ్లో అడుగుపెట్టిన హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. అప్పుడు జట్టు రికార్డు స్కోరు 277 చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆర్సీబీపై 41 బంతుల్లోనే 102 పరుగులు చేసి అత్యధిక స్కోరు రికార్డును 287 పరుగులతో సన్రైజర్స్ మరోసారి బద్దలు కొట్టడంలో ప్రధాన భూమిక పోషించాడు. సన్రైజర్స్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన హెడ్ ఇదే ధనాధన్ బ్యాటింగ్ కొనసాగించాలన్నది అభిమానుల ఆకాంక్ష.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం