Travis Head: వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head).
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. ఓపెనర్గా క్రీజులో అడుగుపెట్టడం.. ధనాధన్ ఇన్నింగ్స్తో జట్టుకు మెరుపు ఆరంభాలను అందించడమే పనిగా వార్నర్ సాగాడు. కెప్టెన్ కూడా కావడంతో మరింత బాధ్యతతో నిలకడగా పరుగులు సాధించాడు. కానీ వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అదే ఆస్ట్రేలియా నుంచి.. అలాంటి లెఫ్టార్మ్ బ్యాటరే బరిలోకి దిగాడు. సంచలన బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్.
ఆసీస్ నుంచే...
మెరుపు ఆరంభాలను అందించే మరో ఓపెనర్ సన్రైజర్స్కు దొరుకుతాడా?.. ఇవీ 2022 వేలానికి ముందు వార్నర్ను సన్రైజర్స్ వదులుకున్నప్పుడు రేకెత్తిన ప్రశ్నలు. 2022, 2023 సీజన్లలో ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. మార్క్రమ్, మయాంక్, అభిషేక్, హ్యారీ బ్రూక్ ఇలా వేర్వేరు ఓపెనింగ్ జోడీలను పరీక్షించినా ఫలితం దక్కలేదు. అలాంటి దశలో తానున్నానంటూ హెడ్ వచ్చాడు. ఆస్ట్రేలియా నుంచే వార్నర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు దూసుకొచ్చాడు. సన్రైజర్స్ తరపున ఇలా ఐపీఎల్లో అడుగుపెట్టాడో, లేదో అలా రెచ్చిపోతున్నాడు. అయినా అతనంతే. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే.. ఒక్కసారి పిచ్పై అంచనాకు వచ్చి బంతిపై గురి కుదిరితే ఇక ఆగడు. 2013లోనే హెడ్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అప్పుడు రూ.30 లక్షలకు అతణ్ని దిల్లీ తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఆర్సీబీ అతణ్ని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. 2016, 2017 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన అతను.. 10 మ్యాచ్ల్లో 138.51 స్ట్రైక్రేట్తో 205 పరుగులు చేశాడు. ఆ తర్వాత వివిధ కారణాలతో లీగ్కు దూరమయ్యాడు. 2023 సీజన్కు ముందు వేలంలో అతణ్ని ఎవరూ కొనుక్కోలేదు. కానీ నిరుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో, వన్డే ప్రపంచకప్ తుదిపోరులో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ను విజేతగా నిలిపిన హెడ్కు ఈ సీజన్కు ముందు జరిగిన వేలంలో డిమాండ్ ఏర్పడింది. ఇతర జట్లతో పోటీపడీ మరీ సన్రైజర్స్ రూ.6.80 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడా ధరకు న్యాయం చేస్తూ హెడ్ చెలరేగుతున్నాడు.
ఇలాగే సాగితే..
2016లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఐపీఎల్ ఛాంపియన్గా నిలపడంలో వార్నర్ది కీలక పాత్ర. 848 పరుగులు చేసిన అతను.. కోహ్లీ (973) తర్వాత ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. 2015 (562), 2017 (641), 2019 (692)లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. వార్నర్ కాకుండా సన్రైజర్స్ తరపున ఆరెంజ్ క్యాప్ అందుకున్నది ఒక్క విలియమ్సన్ (735) మాత్రమే. ఇక 2019 తర్వాత మరే సన్రైజర్స్ బ్యాటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. తాజాగా బెంగళూరుపై 39 బంతుల్లోనే శతకం చేసిన హెడ్ ఇదే దూకుడు కొనసాగిస్తే ఆరెంజ్ క్యాప్ అందుకునే ఆస్కారముంది. అలాగే సన్రైజర్స్నూ రెండో టైటిల్ దిశగా నడిపించే అవకాశముంది. ఈ సీజన్లో ముంబయితో మ్యాచ్లో అడుగుపెట్టిన హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. అప్పుడు జట్టు రికార్డు స్కోరు 277 చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆర్సీబీపై 41 బంతుల్లోనే 102 పరుగులు చేసి అత్యధిక స్కోరు రికార్డును 287 పరుగులతో సన్రైజర్స్ మరోసారి బద్దలు కొట్టడంలో ప్రధాన భూమిక పోషించాడు. సన్రైజర్స్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన హెడ్ ఇదే ధనాధన్ బ్యాటింగ్ కొనసాగించాలన్నది అభిమానుల ఆకాంక్ష.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్