ODI World Cup: స్పిన్నర్లే విన్నర్లు... ఈ ప్రపంచకప్లో వారిదే ఆధిపత్యం
వన్డే ప్రపంచకప్ 2023లో స్పిన్నర్ల పాత్ర కీలకం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ జట్ల మేటి స్పిన్నర్ల నుంచి ఈసారి చక్కటి ప్రదర్శన వస్తుందని చెబుతున్నారు.
ఉపఖండంలో ఎప్పుడు ప్రపంచకప్ (Cricket World Cup) జరిగినా స్పిన్నర్లదే హవా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్ వేదికగా మొదలైన 2023 ప్రపంచకప్ (ODI World Cup 2023) కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు భారత్ - ఆస్ట్రేలియా వన్డే సిరీస్ చూసినా.. ఆ తర్వాత వార్మప్ మ్యాచ్లను గమనించినా స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లు కాబోతున్నారని అర్థమైపోతుంది. ప్రపంచకప్ ఆరంభ పోరు ఈ అభిప్రాయాన్ని మరింత పెంచింది. ఏ వేదికలో ఆడుతున్నాం అన్నది సంబంధం లేకుండా స్పిన్ బలం బాగా ఉన్న జట్లే జయకేతనం ఎగురవేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ ఫలితాలతో పాటు ప్రపంచకప్ విజేత ఎవరన్నది కూడా స్పిన్నర్లే నిర్దేశిస్తే ఆశ్చర్యం లేదు.
1987, 1996, 2011లో ఉపఖండం వేదికగా ప్రపంచకప్లు జరిగాయి. ఆ టోర్నీలన్నింట్లో స్పిన్నర్లు జోరు చూపించారు. 2011 ప్రపంచకప్లో పడ్డ మొత్తం బంతుల్లో 47 శాతం స్పిన్నర్లు వేసినవే. వికెట్లలో కూడా 44 శాతం వాటా స్పిన్నర్లు తీసుకున్నారు. గతంలో భారత్ ప్రపంచకప్నకు ఆతిథ్యమిచ్చినపుడు వేరే ఉపఖండ దేశాల భాగస్వామ్యం ఉంది. కానీ ఈసారి మన దేశం ఒక్కటే ప్రపంచకప్ను నిర్వహిస్తోంది. భారత్లో మెజారిటీ స్టేడియాలు స్పిన్కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. మన బలం కూడా స్పిన్నే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టెస్టు సిరీస్లో స్పిన్ పిచ్లతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుంటుంది భారత్. ప్రపంచకప్లో పూర్తిగా పిచ్ల మీద ఆతిథ్య దేశం నియంత్రణ ఉండదు కానీ.. సొంత జట్టు బలానికి తగ్గట్లు, పిచ్ల సహజ స్వభావానికి అనుగుణంగానే వికెట్లు తయారు చేస్తారు. కాబట్టి ఈ ప్రపంచకప్లో స్పిన్నర్లే విన్నర్లు అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తొలి మ్యాచ్ నుంచే..
ఈ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్తోనే స్పిన్నర్ల ఆధిపత్యం మొదలైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ను పెద్ద దెబ్బ కొట్టింది స్పిన్నర్లే. మలన్ను ఔట్ చేసి తొలి వికెట్ తీసింది హెన్రీ అయినా.. తర్వాత ప్రమాదకర బెయిర్స్టోను స్పిన్నర్ శాంట్నర్ ఔట్ చేశాడు. అతను తర్వాత మరో వికెట్ కూడా పడగొట్టాడు. మరో స్పిన్నర్ రచిన్ రవీంద్ర ఓ వికెట్ తీయగా.. పార్ట్టైం స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ తన తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్లో పడ్డ మొత్తం 10 వికెట్లలో సగం స్పిన్నర్ల ఖాతాలో చేరాయి. ఇక ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో భారత స్పిన్నర్లు ఎలా రెచ్చిపోయారో తెలిసిందే.
ఆసీస్ ఇన్నింగ్స్లో పడ్డ పది వికెట్లలో స్పిన్నర్లే ఆరు చేజిక్కించుకున్నారు. తాజాగా హైదరాబాద్లో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ స్పిన్నర్ శాంట్నర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ స్పిన్నర్ల ఆధిపత్యం సాగింది. అహ్మదాబాద్ స్టేడియం స్వతహాగా స్పిన్నర్లకే అనుకూలం. అదే కాక దిల్లీ, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు.. ఇలా ప్రపంచకప్నకు ఆతిథ్యమిస్తున్న ప్రధాన నగరాల్లోని స్టేడియాలన్నీ స్పిన్కు అనుకూలించేవే. ఒక్క ధర్మశాలలో మాత్రం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పేస్కు సహకారం ఉంటుంది. అలా అక్కడ కూడా స్పిన్నర్ల ప్రభావం ఉండదనేమీ కాదు.
అన్ని జట్లకూ బలం
టోర్నీ జరుగుతోంది భారత్లో కావడం ఉపఖండ జట్లకు కలిసొచ్చేదే. సంప్రదాయంగా భారత్తో సహా మిగతా ఉపఖండ జట్లకు స్పిన్ బలం ఎక్కువే. భారత్కు కుల్దీప్, జడేజా, అశ్విన్ల రూపంలో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లున్నారు. పాకిస్థాన్కు షాదాబ్, నవాజ్, ఉసామా మిర్, అఘా సల్మాన్, ఇఫ్తికార్.. ఇలా పెద్ద స్పిన్ బలగమే ఉంది. శ్రీలంకకు తీక్షణ, వెల్లలాగె, ధనంజయ డిసిల్వా, అసలంక అందుబాటులో ఉన్నారు. బంగ్లాదేశ్కు షకిబ్ అతి పెద్ద బలం.
ఇంకా మెహిదీ హసన్ మిరాజ్, మెహిదీ హసన్ లాంటి మంచి స్పిన్నర్లున్నారు. అయితే విదేశీ జట్లకు కూడా స్పిన్ బలం తక్కువేమీ కాదు. అఫ్గానిస్థాన్ జట్టులో రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, నబి, నూర్ అహ్మద్ ఎంత ప్రమాదకరమో తెలిసిందే. న్యూజిలాండ్ జట్టులో శాంట్నర్, రచిన్ రవీంద్ర, ఇష్ సోధిలో అంత తేలిక కాదు. ఇంగ్లాండ్కు రషీద్, మొయిన అలీ, లివింగ్స్టన్.. దక్షిణాఫ్రికాకు షంసి, కేశవ్ మహరాజ్, మార్క్రమ్.. ఆస్ట్రేలియాకు జంపా, అగార్, లబుషేన్ స్పిన్ సేవలు అందించనున్నారు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు