SRH: ఈసారి అలా ఉండదు.. తొలి మ్యాచ్ నుంచే దూకుడుగా ఆడతాం: సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
ఆసీస్ను వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను (Pat Cummins) సన్రైజర్స్ హైదరాబాద్ తన సారథిగా నియమించుకుంది. గత ఫలితాలకు భిన్నంగా విజయాలబాట పట్టాలనే లక్ష్యంతో ఈసారి ఐపీఎల్ బరిలోకి దిగింది.
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఆటతీరు అధ్వానంగా ఉంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకే పరిమితమవుతూ అభిమానులను నిరాశపరిచింది. తాజాగా ఐపీఎల్ (IPL) 17వ సీజన్ కోసం సన్రైజర్స్ భారీ మొత్తం వెచ్చించి మరీ కొత్త కెప్టెన్ను తీసుకుంది. తమ జట్టు భవితవ్యం మారిపోతుందన్న ఆశలతో ఎడిషన్లో పోటీకి సిద్ధమైంది. జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఎస్ఆర్హెచ్ అభిమానులకు భరోసా ఇచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం నుంచే ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కమిన్స్ మాట్లాడిన వీడియోను ఎస్ఆర్హెచ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తొలి ప్రత్యర్థి కేకేఆర్పైనా, ఈ సీజన్లో తమ జట్టు ఆడే తీరుపై కమిన్స్ మాట్లాడాడు. తొలి మ్యాచ్ నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.
‘‘ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. శుభారంభం చేసేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగుతాం. టీ20 ఫార్మాట్ చూసేందుకు బాగానే ఉన్నా ఆడటం చాలా కష్టం. తొలి మ్యాచ్లో తలపడనున్న ప్రత్యర్థి కోల్కతా బలమైన జట్టే. మేం మాత్రం మొదట్నుంచి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. యువ క్రికెటర్లతో కలిసి ఆడటం ఎప్పుడూ బాగుంటుంది. మా జట్టులో నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. భువనేశ్వర్, ఐదెన్ మార్క్రమ్ వంటి సీనియర్లు ఉన్నారు.
అలాగే యువ టాలెంట్కు కొదవేం లేదు. అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి కుర్రాళ్లు ఉన్నారు. గత సీజన్లలో కొందరి ఆటతీరును గమనించా. ఇప్పుడున్న జట్టుతో పెద్దగా పని చేసిన అనుభవం నాకు లేదు. టీమ్లోని కొందరి గురించి పెద్దగా తెలియదు. కానీ తెలుసుకుంటా. జట్టుకు వారి నుంచి ఏమేం అవసరమో రాబడతా. కోచ్లు, సహాయక సిబ్బందితో కలిసి కుర్రాళ్లలో విశ్వాసం నింపుతా. తప్పకుండా ఈసారి ఎస్ఆర్హెచ్ అభిమానులను ఉత్సాహపరిచేలా చూస్తాం’’ అని కమిన్స్ వెల్లడించాడు. కోల్కతాతో (KKR vs SRH) మార్చి 23న ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్