BAN vs SL: 48 ఏళ్ల భారత్ రికార్డు బ్రేక్.. టెస్టుల్లో శ్రీలంక అరుదైన ఘనత
శ్రీలంక క్రికెటర్ ఇటీవల ఓ రికార్డు తన ఖాతాలో వేసుకోగా.. తాజాగా జట్టుపరంగానూ అరుదైన ఘనత సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్లో రికార్డులు బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఇది దశాబ్దాలు కూడా పట్టొచ్చు. తాజాగా శ్రీలంక క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టులో కమిందు మెండిస్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఏడో స్థానంలో సెంచరీలు చేసిన బ్యాటర్గా అవతరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్టులో మరో రికార్డును శ్రీలంక క్రికెట్ జట్టు బ్రేక్ చేసింది. ఆ టీమ్ అధిగమించిన రికార్డు టీమ్ఇండియా పేరిట ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 531 పరుగులకు ఆలౌటైంది. ఇందులో విశేషం ఏంటంటే.. ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకుండానే శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఆరుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో అలరించారు.
చివరి ఇద్దరు బ్యాటర్లు మినహా.. తొమ్మిది మందీ రెండంకెల స్కోరు చేశారు. కుశాల్ మెండిస్ (93), కమిందు మెండిస్ (92), కరుణరత్నె (86), ధనంజయ డిసిల్వా (70), చండిమాల్ (59), నిషాన్ మదుష్క (57) అర్ధశతకాలు సాధించారు. ఏంజెలో మ్యాథ్యూస్ (23), జయసూర్య (28), విశ్వ ఫెర్నాండో (11) డబుల్ డిజిట్ స్కోరు చేశారు. అంతకుముందు భారత్ 1976లో న్యూజిలాండ్పై 524/9 (డిక్లేర్డ్) స్కోరుతో ఈ ఘనత సాధించింది. విండీస్పై ఆస్ట్రేలియా 2009లో 520/7 (డిక్లేర్డ్), ఆసీస్పై దక్షిణాఫ్రికా 1998లో 517, ఆసీస్పై పాక్ 1981లో 500/8 (డిక్లేర్డ్) ఇలాగే స్కోర్లు సాధించాయి.
ముగ్గురి చేతుల్లో మిస్ అయిన క్యాచ్
బంగ్లాదేశ్ - శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ సంఘటన క్రికెట్ అభిమానుల్లో నవ్వులు పూయించింది. ముగ్గురు ఆటగాళ్లు ఒక క్యాచ్ను వదిలేసిన తీరు నెట్టింట వైరల్గా మారింది. ఖలేద్ అహ్మద్ (ఇన్నింగ్స్లోని 121వ ఓవర్) బౌలింగ్లో ప్రభాత్ జయసూర్య బ్యాట్ను తాకుతూ బంతి స్లిప్లోకి దూసుకెళ్లింది. అక్కడ కెప్టెన్ నజ్ముల్ షాంటో కాస్త తడబడి బంతిని పైకి లేపాడు. ఆ పక్కనే రెండో స్లిప్లో ఉన్న షాహదాత్ కూడా అందుకోలేకపోయాడు. మూడో స్లిప్లో ఉన్న జకీర్ హసన్ వైపు బంతి వెళ్లినా పట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ముగ్గురి చేతుల్లోకి వెళ్లిన బంతిని క్యాచ్ పట్టుకోలేకవడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్