Hasaranga: హసరంగాపై ఐసీసీ వేటు.. రెండు మ్యాచ్లకు దూరంగా కానున్న శ్రీలంక కెప్టెన్
శ్రీలంక టీ20 కెప్టెన్ హసరంగా పై ఐసీసీ రెండు మ్యాచ్ల నిషేధం విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా (Wanindu Hasaranga)పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రెండు మ్యాచ్ల నిషేధాన్ని విధించింది. అఫ్గనిస్థాన్తో జరిగిన చివరి టీ20లో అంపైర్ లిండన్ హన్నిబల్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.‘‘ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి అంపైర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు మ్యాచ్ ఫీజులో 50శాతం కోతతో పాటు రెండు మ్యాచ్ల నిషేధాన్ని హసరంగాపై విధిస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. దీంతో వచ్చే నెలలో బంగ్లాదేశ్తో జరగనున్న మొదటి రెండు టీ20 మ్యాచ్లకు హసరంగా దూరం కానున్నాడు.
అసలు ఎం జరిగిందంటే..
అఫ్గానిస్థాన్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో శ్రీలంకకు 3 బంతుల్లో 11 పరుగులు కావాలి. ఈ సమయంలో అఫ్గాన్ బౌలర్ వఫాదర్ వేసిన బంతి బ్యాటర్ కమిందు మెండిస్ నడుము కంటే ఎత్తులో వెళ్లింది. లెగ్ అంపైర్గా ఉన్న హన్నిబల్ దాన్ని నోబాల్గా ప్రకటించలేదు. ఈ మ్యాచ్లో 3 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం హసరంగా మాట్లాడుతూ బంతి బ్యాటర్ నడుముకంటే ఎత్తుగా వెళ్లింది. అంపైర్ దాన్ని గమనించలేకపోతే అతడు క్రికెట్కు పనికిరాడు. వేరే పని చూసుకోవడం మంచిది. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
మరోవైపు ఈ మ్యాచ్లో అఫ్గాన్ బ్యాటర్ రెహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) పై కూడా వేటు పడింది. అంపైర్ సూచనలు పాటించకుండా ఫీల్డ్లో పదే పదే బ్యాట్ గ్రిప్ మార్చుకోవడంతో అతని మ్యాచ్ ఫీజు నుంచి 15 శాతాన్ని ఐసీసీ కోత విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం