IPL: గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా విదేశీ క్రికెటర్లకూ అవకాశాలు కల్పించిన టోర్నీ. ప్రస్తుతం 17వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే, గతేడాది కోల్కతా తరఫున ఆడిన డేవిడ్ వీజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు కోచ్గా చంద్రకాంత్ పండిత్ వచ్చాక.. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం తనతోపాటు చాలామంది విదేశీ ఆటగాళ్లకు నచ్చలేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గత సీజన్లో అతడికెదురైన అనుభవాలను వెల్లడించాడు.
‘‘జట్టులో చాలా విషయాలు తెర వెనక జరుగుతుంటాయి. కొన్నింటితో ఆటగాళ్లు సంతోషంగా ఉండలేరు. చాలాసార్లు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇబ్బందిగా మారింది. కొత్తగా వచ్చిన కోచ్ తనదైనశైలిలోనే అందరూ ఉండాలనేలా ప్రవర్తించేవారు. ఆటగాళ్లతో సరిగ్గా కూర్చున్నదే లేదు. అవసరం లేని మార్పులతో ప్లేయర్లు చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఒక విదేశీ ప్లేయర్గా.. కొన్నిసార్లు మేం సరైన విధానంలో కూర్చోం. కానీ, అతడు మాత్రం మమ్మల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించేవారు. భారత్లో ఇలాంటి కఠినమైన క్రమశిక్షణతోనే కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని అతడికి తెలుసు. కానీ, ఓవర్సీస్ ప్లేయర్లు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ లీగుల్లో ఆడుతుంటారు. మా వద్దకు వచ్చి ఇలా ఉండు.. అలా ప్రవర్తించాలి.. ఏం ధరించాలనేది కూడా చెబుతుండేవాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నాకంటే మొండిగా ఉండేవారు మాత్రం ఇబ్బందిపడ్డారు.
భారత యువ క్రికెటర్ రింకుసింగ్ ఐదు సిక్స్లతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంతో సంబంధం లేకుండా ఎవరైనా ఆటగాడు మంచి ప్రదర్శన చేస్తే అభినందించాలి. గెలుస్తారా? ఓడతారా? అనే భయంతో కూర్చోకూడదు. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపై పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అప్పుడే జట్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి’’ అని వీజ్ వ్యాఖ్యానించాడు. నమీబియా ఆటగాడు గత సీజన్లో 11 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. ఆ సీజన్లో రెండో టాప్ వికెట్ టేకర్. మరి అతడు ఆరోపణలు చేసిన కోచ్ చంద్రకాంత్ పండిత్కు దేశవాళీలో మంచి పేరుంది. చాలామంది క్రికెటర్లు ఆయన వద్దే శిక్షణ పొందారు. ప్రస్తుతం చంద్రకాంత్ కోచింగ్లోనే కోల్కతా ఈ సీజన్లో ఆడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం