Hyderabad Vs Mumbai: హైదరాబాద్ జట్టుకు తప్పని నిరీక్షణ.. కీలక స్పిన్నర్ మరో వారం దూరం!
ఓటమితో టోర్నీని ప్రారంభించిన రెండు జట్లు నేడు ఉప్పల్ వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు షాకింగ్ న్యూస్. టాప్ స్పిన్నర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ మినీ వేలంలో దక్కించుకున్న శ్రీలంక ఆటగాడి సేవలను హైదరాబాద్ మరో వారం రోజులపాటు కోల్పోనుంది. ఇప్పటికే కోల్కతాతో తొలి మ్యాచ్కు అందుబాటులో లేని టాప్ ఆల్రౌండర్ వనిందు హసరంగ.. నేడు ముంబయితోనూ బరిలోకి దిగడం లేదు. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఎడమ మడమ నొప్పి కారణంగా మరో వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని అతడు భావిస్తున్నట్లు సమాచారం. విదేశీ వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి.
శ్రీలంక తరఫున వన్డే సిరీస్, టీ20 సిరీస్ ఆడిన హసరంగ 8 వికెట్లు పడగొట్టాడు. అతడి గాయం తీవ్రతను పరిశీలించాల్సి ఉందని శ్రీలంక క్రికెట్ బోర్డు వైద్య బృందం వెల్లడించింది. వచ్చే జూన్ నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్ నేపథ్యంలో రిస్క్ తీసుకోవడానికి అతడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ జట్టుతో ఎప్పుడు కలుస్తాడనేది చెప్పలేని పరిస్థితి. ఇటీవల బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా అంపైరింగ్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హసరంగపై మూడు డిమెరిట్ పాయింట్ల శిక్ష పడింది. దీంతో బంగ్లాతో రెండు టెస్టు సిరీస్ నుంచి వేటు పడింది. గతంలోనే ఐదు డిమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో ఉన్నాయి.
పాండ్య బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలి: కుంబ్లే
హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇంకాస్త ముందుగా బ్యాటింగ్కు రావాలని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. ‘‘ముంబయి తొలి మ్యాచ్లో విజయం సాధించే స్థితి నుంచి ఓటమిపాలైంది. చివరి ఐదు ఓవర్లలో కేవలం 43 పరుగులు చేయడం టీ20ల్లో చాలా సులువే. ఇంకా 7 వికెట్లు చేతిలో ఉన్నాయి. హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. రెండో మ్యాచ్లో ఆ పొరపాటు చేయొద్దు’’ అని కుంబ్లే సూచించాడు. గుజరాత్తో మ్యాచ్లో చివర్లో వచ్చిన పాండ్య నాలుగు బంతుల్లో 11 పరుగులు చేశాడు. కీలక సమయంలో ఔట్ కావడంతో ముంబయికి ఓటమి తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు