Asian Games: అదరగొట్టిన వెటరన్లు... ఆసియా క్రీడల్లో పతకాల మెరుపులు
వయసు మీద పడినా తమ ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ కొందరు భారత వెటరన్లు హాంగ్జౌ ఆసియా క్రీడల్లో అదరగొట్టారు. రోహన్ బోపన్న,సౌరభ్ ఘోషల్, సీమా పునియా పతకాలు కొల్లగొట్టి భారత పతాకను రెపరెపలాడించారు.
35 ఏళ్లు దాటితేనే శరీరంలో సరళత తగ్గుతుంది. ఈ వయసులో ఆటలంటే చాలా కష్టం. అందుకే ఎక్కువ మంది రిటైర్ అవుతుంటారు. మరి అదే వయసు 40 దగ్గరగా ఉండి బరిలో దిగితే! అంతర్జాతీయ పతకాలు సాధిస్తే! అద్భుతమే!!. అలా వయసు మీద పడినా తమ ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ కొందరు భారత వెటరన్లు హాంగ్జౌ ఆసియా క్రీడల్లో అదరగొట్టారు. 44 ఏళ్ల రోహన్ బోపన్న టెన్నిస్లో స్వర్ణంతో సత్తా చాటితే.. 37 ఏళ్ల సౌరభ్ ఘోషల్ స్క్వాష్లో పసిడి ముద్దాడాడు. ఇక అథ్లెటిక్స్లో 40 ఏళ్ల సీమా పునియా డిస్కస్ త్రోలో తన హవా కొనసాగిస్తూ కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. రోహన్ బోపన్న,సౌరభ్ ఘోషల్,సీమా పునియా
బోపన్న అదరహో
వయసు పెరుగుతున్న కొద్దీ రోహన్ బోపన్న ఆట కూడా మెరుగువుతోంది. ఇటీవల అతడి వరుస విజయాలే ఇందుకు నిదర్శనం. గ్రాండ్స్లామ్ మొదలుకొని ఆసియా క్రీడల దాకా బోపన్న హవా కొనసాగుతోంది. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి స్థిరంగా రాణిస్తున్నాడతను. ఎబ్డెన్ జతగా ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ గెలిచిన బోపన్న.. ఈ ఏడాది వింబుల్డన్లో సెమీఫైనల్ చేరాడు. యుఎస్ ఓపెన్లో ఫైనల్ చేరాడు. కానీ తుదిపోరులో కొద్దిలో ఓడి టైటిల్ చేజార్చుకున్నాడు. అక్కడే ఆగలేదతను. ఆసియా క్రీడల్లో రుతుజతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణంతో మెరిశాడు. లియాండర్ పేస్, మహేశ్భూపతి తర్వాత భారత టెన్నిస్కు పెద్ద దిక్కుగా మారిన బోపన్న.. కెరీర్లో ఆరంభంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. పాక్ ఆటగాడు ఖురేషితో కలిసి జట్టు కట్టినా టైటిల్స్ ఎక్కువగా నెగ్గలేదు. కానీ ఎబ్డెన్ అతడికి కలిసొచ్చాడు. సమన్వయంతో ఆడుతున్న ఈ జోడీ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో స్థిరంగా ముందుకెళుతోంది. ఆసియా క్రీడల్లోనూ బోపన్న తన అనుభవాన్ని చూపించాడు. నిజానికి రుతజకు అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేదు. పెద్దగా గెలిచింది కూడా ఏమీ లేదు. కానీ బోపన్న అండతో ఆమె మిక్స్డ్ డబుల్స్ స్వర్ణాన్ని కైవసం చేసుకోగలిగింది.
సౌరభ్ ఆగట్లేదు
స్క్వాష్లో కోల్కతాకు చెందిన సౌరభ్ ఘోషల్ది మరో కథ. వయసుతో పని లేకుండా పతకాల వేటలో సాగుతున్న అతడు.. ఆసియా క్రీడల్లో సింగిల్స్లో రజతం, టీమ్ విభాగంలో స్వర్ణంతో మెరిశాడు.. మొత్తం మీద ఈ క్రీడల్లో ఈ వెటరన్ ఇప్పటి వరకు తొమ్మిది పతకాలు సాధించాడు. 2006 దోహా ఆసియా క్రీడలతో మొదలుపెట్టి అతడు ప్రతి క్రీడల్లోనూ పతకం గెలవడం విశేషం. 2018-2019 మధ్య టాప్-10 ర్యాంకుల్లో నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచిన సౌరభ్..2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గి సింగిల్స్లో పతకం గెలిచి తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరో స్టార్ దీపిక పల్లికల్తో కలిసి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు సాధించిన ఘోషల్.. కెరీర్లో చరమాంకంలో మరింత చెలరేగుతున్నాడు.
పెళ్లి అయినా..
2014లో తొలిసారి ఆసియా క్రీడల్లో డిస్కస్త్రోలో స్వర్ణం గెలిచింది సీమా పునియా. మళ్లీ పదేళ్ల తర్వాత కూడా ఆసియా క్రీడల్లో పోడియంపై నిలబడింది. 40 ఏళ్ల వయసులో యువ అథ్లెట్ల పోటీని తట్టుకుని హాంగ్జౌ క్రీడల్లో కాంస్యం గెలిచి సత్తా చాటింది. జకర్తాలో జరిగిన గత క్రీడల్లోనూ కంచు గెలిచిన సీమా..ఈసారి క్రీడల్లో పతకం తెస్తుందని ఎవరికీ అంచనాలు లేవు. కానీ అనుభవాన్ని రంగరిస్తూ ఈ హరియాణా అథ్లెట్ పతకాన్ని ముద్దాడింది. ఆసియా క్రీడలతోనే సీమా కెరీర్ ముడిపడి ఉంది. 2006 దోహా ఆసియా క్రీడలకు ముందు ఆమె డోపింగ్ పరీక్షలో పాజిటివ్గా తేలింది. ఈ క్రీడలకు దూరమైపోయింది. కానీ ఈ షాక్ నుంచి బయటపడి మళ్లీ పునరాగమనం చేసిన ఆమె.. దిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలుచుకుంది. పెళ్లి అయినా కెరీర్ కొనసాగించిన సీమ 2012 లండన్ ఒలింపిక్స్లోనూ పోటీపడ్డా.. కొద్దిలో 13వ స్థానంలో నిలిచింది. కానీ 2014 ఇంచియెన్ ఆసియా క్రీడల్లో స్వర్ణంతో అదరగొట్టింది. 40 ఏళ్ల వయసొచ్చింది.. ఇక ఆమె కేవలం పార్టిసిపేట్ చేయడానికే వెళ్లింది అనుకుంటే.. హాంగ్జౌ ఆసియా క్రీడల పతకం గెలిచి అబ్బురపరిచింది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు