WTC Final: ప్రపంచ రికార్డు నమోదు కావడం ఖాయం.. ఆఖరి రోజు ఛేదన కష్టం కాదు: రవిశాస్త్రి
భారత్ చివరి రోజు ఆటలో 280 పరుగులు చేస్తే తొలిసారి డబ్ల్యూటీసీ (WTC Final) ఫైనల్ విజేతగా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఆసీస్కు మాత్రం ఏడు వికెట్లు చాలు. ఈ క్రమంలో రవిశాస్త్రి, షమీ మాత్రం భారత్ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final) ఫైనల్ మ్యాచ్లో భారత్ 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం 164/3 స్కోరుతో ఉంది. మరో 280 పరుగులు చేస్తే టీమ్ఇండియా విజయం సాధిస్తుంది. అలాగే ఏడు వికెట్లను పడగొడితే ఆసీస్ ఛాంపియన్గా నిలుస్తుంది. క్రీజ్లో విరాట్ కోహ్లీ, రహానె ఉండటంతో భారత్కు ఆశలు ఉన్నాయి. ఆ తర్వాత ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ మంచి రిథమ్లో ఉన్నారు. శ్రీకర్ భరత్ కూడా ఓ చేయి వేస్తే ఛేదన కష్టమేం కాదు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ఇలాగే స్పందించాడు.
‘‘చివరి రోజు 280 పరుగులు చేయడం కష్టం కాదు. సాధ్యపడే అంశమే. తప్పకుండా మనం ఈ మ్యాచ్లో కొత్త రికార్డులను చూస్తాం. ప్రపంచ రికార్డు ఛేజింగ్ అవుతుందనడంలో నాకు అనుమానం లేదు. ఫలితం గురించి ఆందోళన పడకుండా ఆదివారం తొలి సెషన్ను కాచుకుంటే చాలు. ఎందుకంటే పిచ్ పరిస్థితి అలా ఉంది. నాలుగో రోజు ఆటలో రోహిత్ శర్మ, పుజారా తమ తప్పిదాల వల్లే పెవిలియన్కు చేరారు’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 2003లో ఆ జట్టు ఆస్ట్రేలియాపై 418 పరుగులు ఛేదించి గెలిచింది.
వందశాతం మనదే: షమీ
భారీ ఛేదనలో టీమ్ఇండియా తప్పకుండా గెలుస్తుందని పేసర్ మహ్మద్ షమీ భరోసా ఇచ్చాడు. ఇదేమీ పెద్ద కష్టంగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. ‘‘ప్రతి ఒక్కరూ వందశాతం నమ్మకంతో ఉండాలి. తప్పకుండా మనం విజయం సాధిస్తాం. గెలుపు కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. ప్రపంచంలోని అన్ని మైదానాల్లో మంచి ప్రదర్శనే ఇస్తున్నాం. అందుకే, మనం ఈ మ్యాచ్లో విజయ సాధిస్తామనే నమ్మకం ఉంది. బంతి తర్వాత బంతి ఆడుకుంటూ పోతే 280 పరుగులు చేయడం కష్టం కాదు. భారీ టార్గెట్ ఉందని కంగారుపడకుండా నింపాదిగా ఆడితే సరిపోతుంది’’ అని షమీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
ధోనీ-రైనా జోడీ మైదానంలో చెన్నై అభిమానులకు కనువిందు చేసింది. -
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.