Sunil Chhetri: ఛెత్రి ముగించేశాడు
భారత ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే అందరి కళ్లూ ఛెత్రిని వెతుకుతాయి. కానీ మైదానంలో అతడు కనిపించడు.
ఫుట్బాల్కు వీడ్కోలు
కోల్కతా
భారత ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే అందరి కళ్లూ ఛెత్రిని వెతుకుతాయి. కానీ మైదానంలో అతడు కనిపించడు. జట్టు కష్టాల్లో ఉంటే ఛెత్రి గోల్ చేస్తాడులే అన్న భరోసా ఉంటుంది. ఇకపై ఆ ధీమా ఉండదు. భారత ఫుట్బాల్కు కేరాఫ్ అడ్రస్గా మారిన దిగ్గజ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రి.. గోల్స్ వేట ఆపేశాడు. 19 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలుకుతూ.. గురువారం చివరి మ్యాచ్ ఆడేశాడు.
భారత్ ఫుట్బాల్లో ఓ శకం ముగిసింది. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో కువైట్తో మ్యాచ్ తనకు ఆఖరిదని గత నెలలోనే ప్రకటించిన భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఇప్పుడు వీడ్కోలు పలికాడు. గురువారం భారత్, కువైట్ జట్ల మధ్య పోరు 0-0తో డ్రా అయింది. భావోద్వేగాల నడుమ, కళ్లన్నీ తనపైనే ఉండగా మైదానంలో అడుగుపెట్టిన ఛెత్రి.. తన చివరి మ్యాచ్లో జట్టును గెలిపించడానికి తీవ్రంగా శ్రమించాడు. కానీ కువైట్ గట్టిపోటీనివ్వడంతో విజయం దక్కలేదు. అలసిన కాళ్లతో, తడిసిన శరీరంతో ఛెత్రి మైదానం వీడాడు. సహచర, ప్రత్యర్థి ఆటగాళ్లు, కోచ్లు ఛెత్రికి వీడ్కోలు పలికారు. చివరిసారిగా అతని ఆటను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు చప్పట్లతో దిగ్గజానికి గుడ్బై చెప్పారు. స్టేడియంలో తిరిగి ప్రేక్షకులకు అభివాదం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తీవ్రమైన భావోద్వేగంతో ఆటగాళ్ల గార్డ్ ఆఫ్ హానర్ మధ్య అతను నిష్క్రమించాడు. స్టాండ్స్లోని అతని కుటుంబ సభ్యులూ కన్నీటిపర్యంతమయ్యారు. అభిమానుల కళ్లూ తడిశాయి. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే మొట్టమొదటి సారి ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మూడో రౌండ్ చేరేందుకు అవకాశం ఉండేది. కానీ డ్రా కావడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ప్రస్తుతం 5 పాయింట్లతో ఉన్న భారత్ తన చివరి మ్యాచ్లో ఈ నెల 11న ఖతార్లో ఆడుతుంది. అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన ఛెత్రి.. మరో రెండేళ్ల పాటు ఇండియన్ సూపర్ లీగ్లో బెంగళూరు జట్టుకు ఆడే అవకాశముంది. ‘‘నీ కెరీర్కు అభినందనలు. ఈ ఆటలో నువ్వో దిగ్గజానివి’’ అని మ్యాచ్కు ముందు ఛెత్రిని ఉద్దేశించి క్రొయేషియా కెప్టెన్ లూకా మోద్రిచ్ వీడియో సందేశం పంపించాడు.
151
ఛెత్రి ఆడిన అంతర్జాతీయ మ్యాచ్లు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన భారత ఆటగాడు అతనే.
ఛెత్రి 2011లో అర్జున, 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్రత్న పురస్కారాలు అందుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన