IND vs ENG: ‘అంపైర్స్ కాల్’పై బెన్స్టోక్స్ వ్యాఖ్యలకు సునీల్ గావస్కర్ కౌంటర్!
ఫీల్డ్ అంపైర్ వెలువరించే నిర్ణయాలు ఒక్కోసారి అనుకూలంగా.. మరొకసారి ప్రతికూలంగా వస్తుంటాయి. రెండింటినీ స్వీకరించాల్సి ఉంటుంది. అనవసరమైన వ్యాఖ్యలు చేయడం ఎవరికైనా తగదు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 434 పరుగుల తేడాతో ఓటమిపాలైనప్పుడు.. కెప్టెన్ బెన్ స్టోక్స్ ‘అంపైర్స్ కాల్’పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు అలాంటిది వాడకుండా ఉంటే మంచిదనే అర్థంలో మాట్లాడాడు. ఇప్పుడు రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఒకసారి ఔట్ కాకుండా బయటపడ్డాడు. భారత్ డీఆర్ఎస్ తీసుకున్నా.. ‘అంపైర్స్ కాల్’ వల్ల పర్యటక జట్టుకు ప్రయోజనం కలిగింది. దీంతో టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కామెంట్రీ సందర్భంగా బెన్స్టోక్స్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చాడు.
‘‘డకెట్ విషయంలోనే చూడండి. అది ‘అంపైర్స్ కాల్’. ఇప్పటి వరకు ఎవరైతే దీని వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యలు చేశారో.. ఇప్పుడు ఏమంటారో మరి. బంతి స్టంప్స్ను తాకుతోంది. అలాంటప్పుడు బెన్ ‘గుడ్బై’ అంటూ వెళ్లిపోవాలి కదా. కానీ, అంపైర్స్ కాల్ కావడం వల్ల లైఫ్ దొరికింది. ఒకవేళ అదే వ్యతిరేకంగా నిర్ణయం ఇచ్చి ఉంటే డీఆర్ఎస్లోనూ ఔట్గా తేలేది. అప్పుడు టెస్టుల్లో ఎక్కువ మ్యాచ్లు కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిపోతాయి’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
రాంచీ మైదానం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. ఓపెనర్లతోపాటు వన్డౌన్ బ్యాటర్ను ఆకాశ్ ఔట్ చేశాడు. అయితే, జో రూట్ (106*) శతకంతో ఇంగ్లాండ్ను కాపాడాడు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి పర్యటక జట్టు ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం