Rishabh Pant: రిషభ్ పంత్.. నువ్వెప్పుడూ తలొంచకూడదని కోరుకుంటా: గావస్కర్
హైదరాబాద్ చేతిలో ఓటమితో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడిన తీరే దీనికి నిదర్శనం. ఈ క్రమంలో సునీల్ గావస్కర్ అతడికి ధైర్యం చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: అరుణ్జైట్లీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో దిల్లీపై హైదరాబాద్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్రైజర్స్ నిర్దేశించిన 267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. సొంత మైదానంలో భారీ ఓటమిని చవిచూడటంతో ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం సునీల్ గావస్కర్తో అతడు మాట్లాడాడు.
‘‘హైదరాబాద్ ఇన్నింగ్స్కు మాకు ప్రధాన తేడా పవర్ ప్లే. వారు దూకుడుగా ఆడటంతో మాపై ఒత్తిడి మ్యాచ్ చివరి వరకూ కొనసాగింది. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించాం. వారి బౌలింగ్ జట్టును పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. బ్యాటింగ్లో కనీసం వారిని 230 లోపు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ను గెలిచే అవకాశాలు ఎక్కువ. మేం 260+ లక్ష్య ఛేదనకు దిగాల్సి వచ్చింది. సెకండ్ బ్యాటింగ్ సమయంలో మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ నెమ్మదించింది. మేం అనుకున్న విధంగా బంతి రాలేదు. ఫ్రేజర్ ఇచ్చిన శుభారంభాన్ని చివరి వరకూ కొనసాగించలేకపోయాం. తీవ్ర ఒత్తిడిలోనూ అతడి ఆటతీరు ఆకట్టుకుంది’’ అని పంత్ వ్యాఖ్యనించాడు.
వ్యాఖ్యాత గావస్కర్ స్పందిస్తూ ‘‘పంత్.. నీ తలను ఎప్పుడూ దించొద్దని నేను కోరుకుంటా. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. తప్పకుండా మీ జట్టు పుంజుకుంటుందని ఆశిస్తున్నా. ఎప్పుడూ నవ్వుతూనే ఉండు’’ అని చెప్పాడు. ‘‘థ్యాంక్యూ సర్. తప్పకుండా ప్రయత్నిస్తా’’ అంటూ పంత్ సమాధానం ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం