World Cup 2023: వన్డే ప్రపంచకప్.. నాలుగో స్థానం కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ: సునీల్ గావస్కర్
అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ (world cup 2023) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా తుది జట్టులో నాలుగో స్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ ఉండొచ్చని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇటీవల భారత జట్టును ఎంపిక చేసింది. గాయాల కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), కేఎల్ రాహుల్ (KL Rahul)లకు జట్టులో చోటు దక్కింది. శ్రేయస్ను స్పెషలిస్ట్ బ్యాటర్గా తీసుకోగా.. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను వికెట్ కీపర్లుగా తీసుకున్నారు. అయితే, బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగు, ఐదు స్థానాల్లో ఎవరెవరూ ఆడతారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఆసియా కప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఐదో స్థానంలో ఆకట్టుకోగా.. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. గాయం తర్వాత కేఎల్ రాహుల్ ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు. ఆసియా కప్ సూపర్-4లో అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఈ అంశంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మాట్లాడాడు. వన్డే ప్రపంచకప్లో నాలుగో స్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.
సూపర్-4లో భారత్, పాక్ మ్యాచ్.. అభిమానులకు గుడ్న్యూస్
‘‘నాలుగో స్థానం కోసం శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ ఉండొచ్చు. ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో ఆడటం ఖాయం. కేఎల్ రాహుల్ తుది జట్టులో లేకపోతే ఇషాన్ వికెట్ కీపింగ్ చేస్తాడు. ఒకవేళ ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటే ఇషాన్ వికెట్ కీపింగ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే రాహుల్ గాయం పాలై శస్త్రచికిత్స చేయించుకుని జట్టులోకి వచ్చాడు. కాబట్టి.. ఇషాన్ వికెట్ కీపింగ్ చేయడం సమంజసం’’ అని సునీల్ గావస్కర్ వివరించాడు. భారత్ వన్డే ప్రపంచకప్ వేట అక్టోబర్ 8న (ఆస్ట్రేలియాతో, చెన్నై) మొదలవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?