Rajasthan Vs Bengaluru: ‘ఎలిమినేటర్’ ఫలితమూ ఏకపక్షమే.. మరోలా జరిగితే ఆశ్చర్యమే: గావస్కర్
బెంగళూరు వరుస విజయాలకు బ్రేక్ పడుతుందా? రాజస్థాన్ ఓటముల నుంచి బయటపడుతుందా? అనేది ఇవాళ అహ్మదాబాద్ వేదికగా జరగబోయే మ్యాచ్తో తేలిపోనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ సెకండాఫ్లో బెంగళూరు వరుస విజయాలతో ప్లేఆఫ్స్లోకి దూసుకొచ్చింది. మరోవైపు ఆరంభమంతా విజయాలతో సాగిన రాజస్థాన్ చివరికి వచ్చేసరికి ఓటములతో డీలాపడింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ పోరు జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు.. రెండో క్వాలిఫయర్లో హైదరాబాద్తో తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ ఫలితంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. ఫలితం ఏకపక్షమే అవుతుందని వ్యాఖ్యానించాడు.
‘‘ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుతం చేసిందనే చెప్పాలి. మొదట్లో ఆ జట్టును చూసిన వారెవరూ ఇలా ఆడతారని ఊహించలేదు. అందుకే, ఆ జట్టుకు ఫ్యాన్స్ నుంచి క్రేజ్ మామూలుగా దక్కలేదు. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ సహా ఇతర సీనియర్లు బాధ్యతతో ఆడుతూనే కుర్రాళ్లను ముందుండి నడిపిస్తున్నారు. ఓపెనింగ్ జోడీ అదరగొడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు రాజస్థాన్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గత ఐదింట్లో నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఒకటి రద్దైంది. వారికి సరైన సాధన లేదనిపిస్తోంది. కోల్కతా తొలి క్వాలిఫయర్లో చేసిన మ్యాజిక్నే ఆర్ఆర్ చేస్తేనే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. అలాకాకపోతే మరోసారి ఏకపక్ష మ్యాచ్ను చూస్తామనిపిస్తోంది. అయితే దూకుడు మీదున్న ఆర్సీబీనే ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. అలా జరగకపోతే మాత్రం ఆశ్చర్యకరమే’’ అని గావస్కర్ వెల్లడించాడు.
గత రెండుసార్లు ఏమైందంటే?
రాజస్థాన్-బెంగళూరు (Rajasthan Vs Bengaluru) జట్లు ప్లేఆఫ్స్లో ఇప్పటి వరకు రెండు సార్లు తలపడ్డాయి. 2015లో ఆర్సీబీ విజయం సాధించగా.. 2022 సీజన్లో ఆర్ఆర్ గెలిచింది. ముచ్చటగా మూడోసారి తలపడుతుండటంతో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా.. బెంగళూరు 15, రాజస్థాన్ 13 మ్యాచుల్లో విజయం సాధించాయి. ప్రస్తుత సీజన్ లీగ్ స్టేజ్లో ఆర్సీబీపై ఆర్ఆర్ గెలిచింది. ఆ ఓటమికి ఈసారి బెంగళూరు ప్రతీకారం తీర్చుకొనేందుకు ఎదురు చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా గ్రూప్ ఎలో భారత్, కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’
టీ20 ప్రపంచ కప్ 2024లో ఓపెనర్గా దిగి విఫలమవుతున్న విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో ఆడి పరుగులు రాబడితే రిషభ్ పంత్ సంతోషిస్తాడని భారత మాజీ పేసర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
ఒక్క పరుగుతో ఓటమి.. నేపాల్ ఆశలను కూల్చేసిన సఫారీలు
T20 Worldcup 2024: టీ20 ప్రపంచకప్ నుంచి నేపాల్ నిష్క్రమించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఆ జట్టు ఓటమిపాలైంది. -
కోహ్లి జోరు అందుకునేనా..
ఐర్లాండ్ను చిత్తుచేసి.. పాకిస్థాన్ ముప్పును దాటి.. అమెరికాపై ఆధిపత్యంతో టీ20 ప్రపంచకప్లో సూపర్-8 చేరిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్కు సిద్ధమైంది. తన చివరి గ్రూప్ మ్యాచ్లో శనివారం కెనడాతో తలపడనుంది. -
పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్
ఆరంభం నుంచి సంచలనాలకు వేదికగా మారిన 2024 టీ20 ప్రపంచకప్లో 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద జట్లకు పెద్ద షాక్ తగిలింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
అఫ్గాన్ అదరహో..
ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా రాణిస్తూ నాకౌట్ చేరే రికార్డున్న న్యూజిలాండ్కు షాక్. టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి రౌండ్ కూడా దాటకుండానే ఇంటిముఖం పట్టింది. -
ఇంగ్లాండ్ చేతిలో ఒమన్ చిత్తు
టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. గ్రూపు-బి పోరులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తుచేసింది. -
మ్యాచ్ పూర్తవగానే సాఫ్ట్వేర్ పని..
భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పుడు అమెరికా జట్టులో ప్రధాన పేసర్. పాకిస్థాన్పై సూపర్ ఓవర్లో యుఎస్ సంచలన విజయం సాధించడంలో అతనే కీలకం. -
ప్రణయ్ పరాజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, సమీర్వర్మల పోరాటం ముగిసింది. -
సెమీస్లో నగాల్
భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ పెరుగియా టెన్నిస్ ఛాలెంజర్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. -
మేం అలా ఎప్పటికీ చేయం
టీ20 ప్రపంచకప్ నుంచి ఇంగ్లాండ్ను బయటకు పంపేలా తాము నెట్రన్రేట్ను తారుమారు చేయాలనుకుంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. -
సూపర్-8కు అమెరికా.. వర్షంతో పాకిస్థాన్ ఆశలు గల్లంతు
ఇంకో మ్యాచ్ మిగిలిఉండగానే టీ20 ప్రపంచకప్ సూపర్-8 రేసు నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?