Virat Kohli: ఇంకెంతకాలం విరాట్ ఒక్కడే ఆడాలి.. మీరేం చేస్తున్నారు?: గావస్కర్
విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే బ్యాటింగ్ భారం మోపడం సరైంది కాదని.. మిగతా వారూ సహకరిస్తే బెంగళూరు పరిస్థితి విభిన్నంగా ఉంటుందని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నైపై 21.. పంజాబ్పై 77.. కోల్కతాపై 83.. విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన పరుగులు. తొలి మ్యాచ్ మినహా ప్రతి దాంట్లో అతడే టాప్ స్కోరర్. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. గత సీజన్లలో అదరగొట్టిన కెప్టెన్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పటీదార్తోపాటు కొత్తగా వచ్చిన కామెరూన్ గ్రీన్ ప్రదర్శన ఇప్పుడు ఘోరంగా ఉంది. దీంతో బెంగళూరు బ్యాటింగ్ యూనిట్పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇంకెంతకాలం టాప్ఆర్డర్లో విరాట్ ఒక్కడిపైనే జట్టు ఆధారపడుతుందో తెలియడం లేదని వ్యాఖ్యానించాడు. కప్ను సాధించాలనే కల నెరవేరాలంటే సమష్ఠిగా రాణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.
‘‘విరాట్ కోహ్లీ ఇంకెంతకాలం ఒక్కడే జట్టును లాక్కొని రాగలడు. ఎవరో ఒకరు అతడికి సహకారం అందించాలని మీకు (బెంగళూరు బ్యాటర్లను ఉద్దేశించి) అనిపించడం లేదా? కోల్కతాతో మ్యాచ్లో ఎవరైనా క్రీజ్లో ఉండుంటే.. 83 పరుగులు కాకుండా కనీసం 120 రన్స్ చేసేవాడు. క్రికెట్ జట్టుగా ఆడే ఆట. కేవలం ఒక్కరి వల్లే మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించడం కష్టం. కోహ్లీకి సరైన మద్దతు దొరకడం లేదు’’ గావస్కర్ వ్యాఖ్యానించాడు.
గంభీర్ సీనియర్ ఆటగాడు: ఇర్ఫాన్ పఠాన్
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్ ఆలింగనం చేసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. గత సీజన్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా చూశారు. కానీ, వీరిద్దరూ నవ్వుతూ కరచాలనం చేసుకున్న వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాడు. కోహ్లీ కరచాలనం ఇవ్వడానికి వచ్చినప్పుడు గంభీర్ ముందుకు రావడం అభినందనీయం. ఒక్కోసారి ఆటలో పరిధిని దాటుతుంటారు. వీరిద్దరి మధ్య జరిగింది కూడా గతమే. ఇప్పుడు వారిద్దరూ ఇలా కలుసుకోవడం బాగుంది’’ అని పఠాన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.