IND vs ENG: తాము లేకపోతే గెలవడం కష్టమనే వారికి ఇదొక హెచ్చరిక: సునీల్ గావస్కర్
ఇంగ్లాండ్పై సిరీస్ విజయాన్ని 2021లో ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్తో పోలుస్తూ సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను (IND vs ENG) భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఎక్కువగా యువకులతో కూడిన టీమ్ఇండియా బలమైన ఇంగ్లిష్ జట్టును సునాయాసంగా ఓడించడం విశేషం. సీనియర్లు విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, రహానె, కేఎల్ రాహుల్ (తొలి టెస్టు మినహా) లేనప్పటికీ భారత్ గెలిచింది. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్ ఈ సిరీస్లోనే అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విజయం తప్పకుండా కొందరికి హెచ్చరిక అని పేర్కొన్నాడు. తాము లేకపోతే భారత్ గెలవలేదని అనుకొనే వారికి ఇదొక బలమైన సందేశమని వ్యాఖ్యానించాడు.
‘‘మూడేళ్ల కిందట.. ఆసీస్తో టెస్టు సిరీస్ కోసం కొందరు సీనియర్ క్రికెటర్లు మిస్ అయ్యారు. అయినా, భారత్ అద్భుత విజయం సాధించింది. కేవలం 36 పరుగులకే (అడిలైడ్) ఆలౌటైన తర్వాత మెల్బోర్న్ టెస్టులో విజయం.. సిడ్నీ మ్యాచ్ను డ్రా చేసుకోగలిగాం. సిడ్నీలోనూ రిషభ్ పంత్ మరో అర్ధ గంటపాటు క్రీజ్లో ఉంటే భారత్ గెలిచేదేమో. అప్పుడు యువ క్రికెటర్లు చూపించిన తెగువ.. ఇప్పుడు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లోనూ కనిపిస్తోంది. అందుకే, నేనెప్పుడూ చెబుతూ ఉంటా.. కేవలం పెద్ద స్టార్లు అవసరం లేదు. ఇకనుంచి ఎవరైనా ‘స్టార్లు’ తాము లేకపోతే భారత్ గెలవడం కష్టమని భావించే వారికి ఇది హెచ్చరికలాంటిది. క్రికెట్ అనేది జట్టుగా పోరాడేది. కేవలం ఒకరిద్దరి మీదనే ఆధారపడి ఉండదు.
ఇంగ్లాండ్పై సిరీస్ విజయంలో కీలక పాత్ర కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్దే. వారిద్దరే కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. వారికి తగ్గట్గుగా మార్చుకున్నారు. ప్రోత్సాహం అందించి సహజసిద్ధమైన ఆటను బయటకు తీశారు. అందుకే, జట్టులో పెద్ద స్టార్లు లేకపోయినా.. పెద్ద మనసు ఉంటే చాలు విజయాలు సాధించడానికి అని నిరూపించారు. స్వదేశంలోనే సిరీస్ కాబట్టి గెలిచిందనే అభిప్రాయమూ కొందరిలో ఉంటుంది. కానీ, బజ్బాల్తో ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని భావించే ఇంగ్లాండ్ను అడ్డుకోవడం వంటి కఠిన సవాల్ను భారత యువ జట్టు తట్టుకోగలిగింది’’ అని గావస్కర్ వెల్లడించారు. భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ మార్చి 7న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
ఎవరా 15..!
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం