Aiden Markram: మేం గెలవాలన్న కసితో ఆడలేదు.. SRH బ్యాటర్లపై మార్క్రమ్ అసహనం
SRH vs DC: దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది. దీనిపై ఆ జట్టు కెప్టెన్ నిరాశ వ్యక్తం చేశాడు.
హైదరాబాద్: ఐపీఎల్ (IPL 16)లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు మళ్లీ పరాభవం తప్పలేదు. బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాట్స్మెన్ ఘోర వైఫల్యంతో చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడిపోయింది. వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ కెప్టెన్ మార్క్రమ్ (Aiden Markram) దీనిపై స్పందిస్తూ బ్యాట్స్మెన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బ్యాటింగ్ దళం ఏ మాత్రం ఉత్సాహంగా ఆడలేదని అసహనం ప్రదర్శించాడు. (SRH vs DC)
‘‘మేం (జట్టును ఉద్దేశిస్తూ) బ్యాట్తో మళ్లీ విఫలమయ్యాం. కసిగా ఆడలేకపోయాం. దురదృష్టవశాత్తూ.. మేం గెలవాలన్న ఉద్దేశంతో ఆడుతున్న జట్టులా కన్పించట్లేదు. అయితే దీన్నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలి. ఛేదన మరింత ఉత్తమంగా ఎలా చేయాలి.. జట్టులో ఆటగాళ్లంతా మరింత స్వేచ్ఛగా, ఐకమత్యంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మా జట్టులో చాలా మంచి ఆటగాళ్లు, బ్యాట్స్మెన్ ఉన్నారు. కానీ, ఉత్తమంగా ఆడాలన్న శ్రద్ధ లేకపోవడం వల్లే మేం నిరాశ చెందాల్సి వస్తుంది. ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చేసేందుకు మరింత శ్రమించాల్సి ఉంది’’ అని మార్క్రమ్ (Aiden Markram) తెలిపాడు. ఇక.. ఈ ఓటమికి బౌలర్లు ఏ మాత్రం కారణం కాదని, పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు ఉత్తమంగా బౌలింగ్ చేశారని కెప్టెన్ ప్రశంసించాడు.
వార్నర్ సెలబ్రేషన్స్ వైరల్..
బౌలర్ల పోరాటంతో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals).. అయిదు ఓటముల తర్వాత వరుసగా రెండో విజయాన్నందుకుంది. అదీ హైదరాబాద్పై గెలవడం దిల్లీకి మరింత ప్రత్యేకమనే చెప్పాలి. దిల్లీ కెప్టెన్ వార్నర్ (David Warner).. గతంలో సన్రైజర్స్కు ప్రాతినిధ్యం వహించి విభేదాలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత రాత్రి హైదరాబాద్పై గెలవగానే వార్నర్ ఆనందంతో చిందులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా.. వార్నర్ రియాక్షన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దిల్లీ విజయంపై వార్నర్ స్పందిస్తూ.. ‘‘ఐదు ఓటముల తర్వాత మేం పుంజుకున్నాం. వరుసగా మూడో విజయాన్ని కూడా అందుకుంటామని ధీమాగా ఉన్నాం. దిల్లీ తర్వాతి మ్యాచ్ మళ్లీ హైదరాబాద్తోనే. అది కూడా గెలుస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
ముంబయి వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. చివరి మూడు మ్యాచుల్లో గెలిచినా నాకౌట్ దశకు చేరుకోవడం కష్టమే. గెలుస్తామనుకున్న మ్యాచుల్లోనే ఓటమిపాలై అభిమానులను నిరాశకు గురి చేసింది. -
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ పొట్టి కప్ బరిలోకి దిగబోతున్నాడు. ఈసారైనా తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోవాలంటే కీలకమైన మూడో స్థానంలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. -
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
డేవిడ్ వార్నర్ మైదానంలో దూకుడుగా ఆడేస్తాడు. సోషల్ మీడియాలో వీడియోలతో అభిమానులను అలరిస్తాడు. భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. -
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు. -
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!