ODI WC 2023: లేక లేక ఛాన్స్ వస్తే.. అనుకోకుండా జట్టులోకి వచ్చి అదరహో
కొందరు ఆటగాళ్లు అనుకోకుండా ఒక అవకాశం దక్కితే దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. అదిరే ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తున్నారు.
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) ఒక ఆసక్తికర ట్రెండ్ నడుస్తోంది. టీమ్మేనేజ్మెంట్ శీత కన్నేయడంతోనో, మరో కారణంతోనో తుది జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు.. అనుకోకుండా ఒక అవకాశం దక్కితే దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. అదిరే ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తున్నారు. మ్యాచ్ విన్నర్లుగా మారి.. ఇన్నాళ్లూ వాళ్లను పక్కన పెట్టినందుకు టీమ్ మేనేజ్మెంట్ చింతించేలా చేస్తున్నారు. ఆ ఆటగాళ్లెవ్వరో చూద్దాం పదండి.
మంచి వేగం, బౌలింగ్లో కచ్చితత్వం, అనుభవం.. అన్నీ ఉన్నా సరే టీమ్ఇండియా సీనియర్ ఫాస్ట్బౌలర్ మహ్మద్ షమి.. ప్రపంచకప్లో తొలి నాలుగు మ్యాచ్ల్లో అవకాశం దక్కించుకోలేకపోయాడు. ప్రపంచకప్ ముంగిట ఆస్ట్రేలియాపై అయిదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టినా సరే.. అతణ్ని కాదని శార్దూల్ ఠాకూర్నే తుది జట్టులో ఆడిస్తూ వచ్చారు. ఐతే న్యూజిలాండ్తో మ్యాచ్ ముంగిట హార్దిక్ పాండ్య గాయపడి జట్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో షమిని తుది జట్టులో ఆడించింది భారత్. అతను అయిదు వికెట్లతో అదరగొట్టాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో మ్యాచ్లోనూ రెచ్చిపోయి బౌలింగ్ చేసిన షమి.. నాలుగు వికెట్లతో ఆ జట్టు నడ్డి విరిచాడు. ఇంత గొప్ప బౌలర్ను ఇన్నాళ్లూ ఎందుకు పక్కన పెట్టారా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు షమి.
మన కుల్దీప్ యాదవ్ లాగే చైనామన్ స్పిన్నర్ అయిన తబ్రేజ్ షంసి కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికా జట్టులో ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా ఉంటున్నాడు. ఐతే ప్రపంచకప్ జరుగుతోంది స్పిన్ పిచ్లకు నెలవైన భారత గడ్డ మీద అయినా.. కేశవ్ మహరాజ్ ఒక్కడినే తుది జట్టులో ఆడిస్తూ షంసిని పక్కన పెట్టింది దక్షిణాఫ్రికా. తొలి నాలుగు మ్యాచ్ల్లో అతణ్ని ఆడించలేదు. ఐతే ఆస్ట్రేలియాతో లఖ్నవూలో జరిగిన మ్యాచ్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాతో షంసిని కూడా తుది జట్టులోకి తీసుకున్నారు. ఆ మ్యాచ్లో అతను రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక చెన్నైలో పాకిస్థాన్తో మ్యాచ్లో అయితే షంసి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. నాలుగు కీలక వికెట్లతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. దక్షిణాఫ్రికాను గెలిపించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
నాలుగు రోజుల ముందు వరకు శ్రీలంక ప్రపంచకప్ జట్టులో సభ్యుడే కాదు సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్. ఐతే ఫాస్ట్బౌలర్ పతిరన గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడికి అనుకోకుండా అవకాశం దక్కింది. టోర్నీ మధ్యలో జట్టులోకి వచ్చిన మాథ్యూస్ తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఇంగ్లాండ్పై రెండు కీలక వికెట్లతో మ్యాచ్ను మలుపు తిప్పే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్లో అతడికి అవకాశం రాలేదు కానీ.. వస్తే అందులో కూడా అదరగొట్టేవాడేమో. ఇదే మ్యాచ్లో మూడు వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన లహిరు కుమార కూడా ముందు టీమ్ మేనేజ్మెంట్ నిరాదరణకు గురైనవాడే. కొంచెం లేటుగా అతణ్ని తుది జట్టులోకి తీసుకున్నాడు. ఇంగ్లాండ్పై అతను అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ దళం ఉన్న జట్టు ఏదంటే అఫ్గానిస్థాన్ పేరే చెప్పాలి. రషీద్ ఖాన్, ముజీబ్ రెహ్మాన్, మహ్మద్ నబి లాంటి ప్రమాదకర స్పిన్నర్లతో అఫ్గాన్ ఎంత పెద్ద జట్టుకైనా సవాలు విసిరే స్థితిలో ఉంది. ఐతే ఈ ముగ్గురూ తుది జట్టులో కచ్చితంగా ఉండాల్సిన ఆటగాళ్లు కావడంతో మరో యువ ప్రతిభావంతుడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. అతనే.. నూర్ అహ్మద్. అండర్-19 స్థాయి నుంచే అదరగొడుతూ అఫ్గాన్ జాతీయ జట్టులోకి వచ్చేశాడు ఈ మిస్టరీ స్పిన్నర్. ఇప్పటికే ఐపీఎల్లో కూడా ఆడేసిన ఈ కుర్రాడికి ప్రపంచకప్లో కొంచెం లేటుగా అవకాశం దక్కింది. చెన్నైలో పాకిస్థాన్తో మ్యాచ్లో ఆడిస్తే రషీద్, ముజీబ్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన చోట మూడు కీలక వికెట్లతో అదరగొట్టాడు. ఆ మ్యాచ్లో అఫ్గాన్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ఇప్పటిదాకా ప్రపంచకప్లో ఆడకపోవడానికి సెలక్టర్లు లేదా టీమ్ మేనేజ్మెంట్ శీతకన్నేయడం కారణం కాదు. అతను గాయం వల్ల టోర్నీలో సగం వరకు జట్టుకు అందుబాటులో లేడు. ఫిట్నెస్ సాధించి తుది జట్టులోకి రావడం ఆలస్యం.. తన దూకుడు చూపించాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో మెరుపు శతకం (67 బంతుల్లో 109) సాధించాడు. ఇదే మ్యాచ్లో ఆకట్టుకున్న న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ (ఒక వికెట్, 58 పరుగులు) కూడా ఇన్నాళ్లూ తుది జట్టుకు దూరంగా ఉన్నవాడే. ఆలస్యంగా వచ్చిన అవకాశాన్ని అతను కూడా సద్వినియోగం చేసుకుని తన విలువను చాటి చెప్పాడు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్