IPL 2024: వారికి పార్టీలు ఎక్కువ.. అందుకే ఒక్క టైటిలూ లేదు: సురేశ్ రైనా
చెన్నై జట్టు విజయవంతంగా కొనసాగడంలో సురేశ్ రైనా కూడా కీలక పాత్ర పోషించాడు. ధోనీ తర్వాత ఆ జట్టు అభిమానులు ఎక్కువగా ఇష్టపడేది క్రికెటర్ రైనానే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో ఇప్పటి వరకు కొన్ని జట్లు ఒక్క టైటిల్నూ నెగ్గలేదు. ఆ జాబితాలో బెంగళూరు, పంజాబ్, దిల్లీ ఉన్నాయి. కొత్తగా వచ్చిన లఖ్నవూ కూడా సాధించలేదు. ముంబయి, చెన్నై ఐదేసి సార్లు ఛాంపియన్గా నిలిచాయి. స్టార్ క్రికెటర్లు ఉన్నా పైనాలుగు జట్లకు టైటిల్ కల మాత్రం నెరవేరలేదు. దీనికి కారణం ఏంటనే దానిపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రైనా చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
‘‘కొన్ని జట్లు ఎక్కువగా పార్టీలు ఇస్తుంటాయి. ఐపీఎల్లో రెండు, మూడు టీమ్లే ఇప్పటి వరకు టైటిల్ సాధించలేదు. చెన్నై ఎప్పుడూ పార్టీలు ఇవ్వలేదు. అందుకే, ఆ జట్టు ఐపీఎల్లో అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచింది. రెండు సార్లు సీఎల్టీ (ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీ)ని సొంతం చేసుకుంది. ముంబయి కూడా ఇలా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. లేట్ నైట్ పార్టీల వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఆలస్యంగా నిద్రపోతే.. మరుసటి రోజు ఎలా ఆడతారు? మే, జూన్లో ఎండలు తీవ్రంగా వుంటాయి. అలాంటప్పుడు మధ్యాహ్నం జరిగే మ్యాచుల్లో చురుగ్గా ఉండాలంటే తగినంత విశ్రాంతి అవసరం. రాత్రంతా పార్టీలు చేసుకుంటే ఎలా? భారత జట్టు తరఫున ఆడేటప్పుడూ ఇలాంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సరిగ్గా ఆడకపోతే కెప్టెన్ మనల్ని ఎందుకు జట్టులో ఉంచుతాడు? ఇప్పుడు నేను క్రికెట్ నుంచి బయటికొచ్చా. ఎప్పుడైనా పార్టీ చేసుకోవచ్చు (నవ్వుతూ)’’ అని రైనా వ్యాఖ్యానించాడు.
డుప్లెసిస్ వ్యాఖ్యలు సరికాదు
కోల్కతాతో మ్యాచ్లో మయాంక్ దగర్ ఓవర్లో 20 పరుగులు రావడంపై బెంగళూరు కెప్టెన్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి ఓవర్ తర్వాత తమపై ఒత్తిడి పెరిగిందని డుప్లెసిస్ వ్యాఖ్యానించడంపై రైనా స్పందించాడు. ‘‘మ్యాచ్ అనంతరం ఓ జూనియర్ ఆటగాడిని ఇలాంటి మాటలు అనకూడదు. కెప్టెన్గా నువ్వు కూడా పరుగులు చేయలేదు. నేను అతడితో చాలాకాలం కలిసి ఆడా. నాకు మంచి స్నేహితుడు. కానీ, యువ క్రికెటర్లను ప్రోత్సహించాలి. రోహిత్ శర్మ ఇలా ఎప్పుడూ మాట్లాడడు’’ అని రైనా అన్నాడు. ఈ సందర్భంగానే భారత జట్టుకు రోహిత్ తర్వాత కెప్టెన్ అయ్యే అవకాశాలు గిల్కు అధికంగా ఉన్నాయని రైనా తెలిపాడు.
నా తొలి అకాడమీ కశ్మీర్లోనే..
‘‘నా తొలి క్రికెట్ అకాడమీని జమ్ముకశ్మీర్లోనే ప్రారంభించాలని కోరుకున్నా. అక్కడ అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్లోకి నాణ్యమైన ఆటగాళ్లు వస్తారు. అంతేకాకుండా.. అక్కడి చిన్నారులు ఓ పక్క బంతి-బ్యాట్.. మరోవైపు ఏకే 47లు చూస్తున్నారు. క్రికెట్ వారికి మంచి ఎంపిక కావాలి. అక్కడక్కడా రాళ్లు విసిరే ఘటనలు జరిగినా.. నేను మాత్రం వారిని బ్యాట్ పట్టించేందుకే ప్రయత్నిస్తా’’ అని రైనా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ