Suryakumar Yadav: త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ‘మిస్టర్ 360’ బ్యాటర్, టీ20ల్లో టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. మడమ, స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స కారణంగా ఐపీఎల్ 17వ సీజన్లో తొలి మూడు మ్యాచ్లకు అతడు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఫిట్నెస్ సాధించిన ఈ ముంబయి బ్యాటర్ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. పంజాబ్పై 78 పరుగుల కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తన ఫిట్నెస్పై అతడు స్పందించాడు.
‘‘ఫిట్నెస్పరంగా వందశాతం సిద్ధమయ్యే దిశగా సాగుతున్నా. ఫీల్డింగ్ కోసం నెమ్మదిగా ట్రైనింగ్ మొదలెట్టా. తప్పకుండా త్వరలోనే 40 ఓవర్లపాటు (బ్యాటింగ్, ఫీల్డింగ్ కలిపి) మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తా. జీవితంలో ఆటుపోట్లు సహజం. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలి. ఇక నా బ్యాటింగ్ శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గను. టీ20 ఫార్మాట్లో దూకుడు ఉండాల్సిందే. మేనేజ్మెంట్ కూడా దీనిపై ప్రత్యేకంగా సూచనలు చేయదు. ఈ మ్యాచ్కు ముందు రోజు బ్యాటర్ల మీటింగ్ జరిగింది. టాప్ ఆర్డర్లో కనీసం ఒక్కరైనా 17 ఓవర్ల వరకు క్రీజ్లో ఉండాలనుకున్నాం. పిచ్ కఠినంగా ఉందనే భావనతో నెట్స్లో ప్రాక్టీస్ చేశాం. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచితేనే బౌలర్లకు తేలికవుతుంది. పంజాబ్పై నేను క్రీజ్లో ఎక్కువ సమయం ఉండేందుకు ప్రయత్నించా. రోహిత్ ఔటైన తర్వాత ఆ బాధ్యతను నేను స్వీకరించా. నా బ్యాటింగ్ తీరులో మాత్రం ఎలాంటి మార్పులేదు’’ అని సూర్య తెలిపాడు.
ఆఖరి ఓవర్కు రోహిత్ కెప్టెన్సీ!
చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సిన క్రమంలో.. రోహిత్ శర్మ ముంబయి బౌలర్కు కీలక సూచనలు చేస్తూ కనిపించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ.. జట్టుకు అవసరమైన వేళ అతడు ముందుండి నడిపించాడని అభిమానులు ఖుషీ అయ్యారు. ఆకాశ్ మధ్వాల్ బంతినందుకోవడంతో.. రోహిత్ అతడి వద్దకు వచ్చి ఫీల్డింగ్ను సెట్ చేశాడు. బంతిని ఎలా వేయాలనేదానిపై సూచనలూ ఇచ్చాడు. పాండ్య కూడా అక్కడే ఉన్నాడు. మధ్వాల్ కట్టుదిట్టంగా బంతులేయడంతో ముంబయి 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్