IPL 2024: అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ సాఫీగా సాగిపోతోంది. గతంలో వలే స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాలు మళ్లీ చోటు చేసుకోకుండా బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు కఠిన చర్యలు చేపట్టారు. దీని కోసం బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నలుగురు అనుమానిత బుకీలను ఏసీయూ అధికారులు గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి. వారిని లగ్జరీ బాక్స్ల నుంచి బయటకు తీసుకొచ్చి స్థానిక పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. మరో ఇద్దరిని పొరపాటుగా గుర్తించినట్లు తేలడంతో వదిలేశారు. అయితే, అధికారికంగా ఐపీఎల్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
ఆ రెండు మ్యాచ్ల సందర్భంగా..
మార్చి 28న జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్-దిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. కార్పొరేట్ బాక్స్లో ఇద్దరు అనుమానితులను యాంటీ కరప్షన్ బృందం గుర్తించింది. వారిని పోలీసులకు అప్పగించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక రెండో ఘటన.. ముంబయిలోని వాంఖడే మైదానంలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 1న రాజస్థాన్తో ముంబయి తలపడింది. ఇక్కడా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అయితే, వారి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి అనుమానించదగిన సమాచారం లభించకపోవడంతో వదిలేశారు. వారు తిరిగి ఎంసీఏ ప్రెసిడెంట్ బాక్స్ వద్దకు చేరుకొన్నారు. కానీ, అక్కడి నుంచి వెళ్లాలని మ్యాచ్ నిర్వాహకులు వారికి సూచించారు. ఈ బాక్స్లోని టికెట్లు కేవలం ఆహ్వానితుల కోసమే.. సాధారణ అభిమానులకు కేటాయించరు.
మైదానంలో నుంచి ఏం చేస్తారు?
2013లో స్పాట్ ఫిక్సింగ్తో భారత క్రికెటర్ శ్రీశాంత్తోపాటు విదేశీ ఆటగాడు అజిత్ చండిలాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్, చెన్నై జట్లపై రెండేళ్లపాటు నిషేధం విధించారు. ఇప్పుడు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఈ రెండు సందర్భాల్లోనూ రాజస్థాన్ జట్టు ఉండటం గమనార్హం. అయితే, ఫిక్సింగ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇబ్బందేం లేదు. బుకీలు మాత్రం లైవ్లో మ్యాచ్ను చూసి దానిని అడ్వాంటేజ్గా తీసుకొని బెట్టింగ్లకు పాల్పడేందుకు అవకాశం ఉంది. మైదానంలో మ్యాచ్కు.. టీవీలో ప్రసారమయ్యే లైవ్ స్ట్రీమింగ్కు మధ్య సమయంలో వ్యత్యాసం ఉంటుంది. అనైతిక బెట్టింగ్ల ద్వారా లాభాలను ఆర్జించడానికి ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి బీసీసీఐ గట్టి చర్యలు చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి