IPL 2024: అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ సాఫీగా సాగిపోతోంది. గతంలో వలే స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాలు మళ్లీ చోటు చేసుకోకుండా బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు కఠిన చర్యలు చేపట్టారు. దీని కోసం బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నలుగురు అనుమానిత బుకీలను ఏసీయూ అధికారులు గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి. వారిని లగ్జరీ బాక్స్ల నుంచి బయటకు తీసుకొచ్చి స్థానిక పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. మరో ఇద్దరిని పొరపాటుగా గుర్తించినట్లు తేలడంతో వదిలేశారు. అయితే, అధికారికంగా ఐపీఎల్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
ఆ రెండు మ్యాచ్ల సందర్భంగా..
మార్చి 28న జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్-దిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. కార్పొరేట్ బాక్స్లో ఇద్దరు అనుమానితులను యాంటీ కరప్షన్ బృందం గుర్తించింది. వారిని పోలీసులకు అప్పగించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక రెండో ఘటన.. ముంబయిలోని వాంఖడే మైదానంలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 1న రాజస్థాన్తో ముంబయి తలపడింది. ఇక్కడా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అయితే, వారి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి అనుమానించదగిన సమాచారం లభించకపోవడంతో వదిలేశారు. వారు తిరిగి ఎంసీఏ ప్రెసిడెంట్ బాక్స్ వద్దకు చేరుకొన్నారు. కానీ, అక్కడి నుంచి వెళ్లాలని మ్యాచ్ నిర్వాహకులు వారికి సూచించారు. ఈ బాక్స్లోని టికెట్లు కేవలం ఆహ్వానితుల కోసమే.. సాధారణ అభిమానులకు కేటాయించరు.
మైదానంలో నుంచి ఏం చేస్తారు?
2013లో స్పాట్ ఫిక్సింగ్తో భారత క్రికెటర్ శ్రీశాంత్తోపాటు విదేశీ ఆటగాడు అజిత్ చండిలాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్, చెన్నై జట్లపై రెండేళ్లపాటు నిషేధం విధించారు. ఇప్పుడు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఈ రెండు సందర్భాల్లోనూ రాజస్థాన్ జట్టు ఉండటం గమనార్హం. అయితే, ఫిక్సింగ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇబ్బందేం లేదు. బుకీలు మాత్రం లైవ్లో మ్యాచ్ను చూసి దానిని అడ్వాంటేజ్గా తీసుకొని బెట్టింగ్లకు పాల్పడేందుకు అవకాశం ఉంది. మైదానంలో మ్యాచ్కు.. టీవీలో ప్రసారమయ్యే లైవ్ స్ట్రీమింగ్కు మధ్య సమయంలో వ్యత్యాసం ఉంటుంది. అనైతిక బెట్టింగ్ల ద్వారా లాభాలను ఆర్జించడానికి ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి బీసీసీఐ గట్టి చర్యలు చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!