T20 League : టీ20 లీగ్.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!
దాదాపు సగం టోర్నీ ముగిసింది. ఒక్కో జట్టు కనీసం ఏడేసి మ్యాచ్లను..
సగం టోర్నీ ముగిసేసరికి జట్ల పరిస్థితి ఇలా!
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు సగం టోర్నీ ముగిసింది. ఒక్కో జట్టు కనీసం ఏడేసి మ్యాచ్లను ఆడేశాయి. ఇక పాయింట్ల పట్టికలో కొత్త జట్లు టాప్-4లో కొనసాగుతున్నాయి. ఛాంపియన్ జట్లు కుదేలై అట్టడుగున నిలిచాయి. ఇవేం ఆడతాయిలే అనుకున్న కొన్ని జట్లు అనూహ్యంగా విజయాలతో విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో పది టీమ్లు ఎలాంటి ప్రదర్శన చేశాయి.. ఎవరు ముందడుగు వేశారో తెలుసుకుందాం..
- గుజరాత్ (12): టీ20 లీగ్లో తొలిసారి హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ (12) చెలరేగుతోంది. ఏడు మ్యాచ్లకు గాను కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడి ఆరు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదీనూ హైదరాబాద్ మీద ఓడిపోయింది. హార్దిక్ ఆల్రౌండ్ ప్రదర్శనతోపాటు షమీ, తెవాతియా, డేవిడ్ మిల్లర్, లాకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్ వంటి ప్లేయర్లు అదరగొట్టేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉండటంతో గుజరాత్ను అడ్డుకోవడం ప్రత్యర్థులకు సవాల్గా మారింది.
- హైదరాబాద్ (10): పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టు హైదరాబాద్. ఆరంభంలో రెండు మ్యాచ్లను ఓడి విమర్శలపాలైన హైదరాబాద్ మూడో మ్యాచ్ నుంచి తన తడాఖా చూపించింది. హేమాహేమీ జట్లను ఓడించింది. ప్రస్తుతం పాయింట్ల పరంగా టాప్లో ఉన్న గుజరాత్ను మట్టికరిపించిన జట్టు కూడా హైదరాబాదే కావడం విశేషం. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లను ఆడిన హైదరాబాద్ వరుసగా ఐదు విజయాలను నమోదు చేసింది. బెంగళూరును తక్కువ పరుగులకే (68) కుప్పకూల్చి మిగతా జట్లకు హెచ్చరికలు పంపింది.
- రాజస్థాన్ (10) : జోస్ బట్లర్ విజృంభణతోపాటు యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రాజస్థాన్ విజయాల బాటలో నడుస్తోంది. ప్రస్తుత సీజన్లో అత్యధిక స్కోరు కూడా రాజస్థాన్ పేరు మీదనే ఉంది. దిల్లీపై 222 పరుగులు సాధించింది. అయితే దిల్లీ కూడా దీటుగా బదులిచ్చినా చివరికి రాజస్థాన్నే విజయం వరించింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లను ఆడిన రాజస్థాన్ (10) ఐదు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. బట్లర్ మూడు శతకాలు, చాహల్ హ్యాట్రిక్ వికెట్ల ప్రదర్శన చేశారు. ఇదే ప్రదర్శన ఆఖరి వరకూ చేస్తే కప్ కొట్టే జట్లలో రాజస్థాన్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- లఖ్నవూ (10): కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా రాణిస్తూ లఖ్నవూ జట్టును నడిపిస్తున్నాడు. ఆదివారం ముంబయితో జరిగిన మ్యాచులో కేఎల్ రాహుల్ శతకం చేశాడు. అయితే జట్టు నిండా ఆల్రౌండర్లు ఉన్నప్పటికీ కొన్ని మ్యాచుల్లో గెలుపు వాకిట బోల్తా పడుతోంది. ఎనిమిది మ్యాచులు ఆడిన లఖ్నవూ 5 విజయాలు సాధించింది. మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో లఖ్నవూ (10) నాలుగో స్థానంలో ఉంది. ఇక నుంచి జట్టు సమష్ఠిగా రాణించాల్సిన అవసరం ఉంది.
- బెంగళూరు (10): గత నాలుగేళ్లుగా ప్రతి సీజన్కు ముందు ఒకటే నినాదం.. ఈసాలా కప్ నమదే.. అయితే ఆ జట్టు పరిస్థితిలో మాత్రం మార్పులేదు. కానీ ఈసారి మాత్రం కొత్త కెప్టెన్ డుప్లెసిస్ నేతృత్వంలోని బెంగళూరు విజృంభిస్తోంది. ఎనిమిది మ్యాచుల్లో ఐదు విజయాలు, మూడు ఓటములతో టాప్-5లో కొనసాగుతోంది. అయితే హైదరాబాద్తో మ్యాచ్లో ఈ సీజన్లోనే అత్యల్ప (68) స్కోరును నమోదు చేసింది. దీంతో ప్లేఆఫ్స్కు చేరుకుంటుందో లేదోనని మరోసారి అనుమానాలు రేకెత్తిస్తోంది.
- దిల్లీ (6): ఘన విజయాలను నమోదు చేసిన జట్టు.. స్వల్ప తేడాతో ఓటములను కొనితెచ్చుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయిన జట్టు దిల్లీ. మొదటి మ్యాచ్లోనే ఛాంపియన్ ముంబయిని ఓడించి సంచలనం సృష్టించిన దిల్లీ ఆ తర్వాత తడబాటుకు గురైంది. ప్రస్తుతం ఏడు మ్యాచులకుగాను కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసింది. నాలుగు మ్యాచుల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటోంది. డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, పృథ్వీషా, పావెల్ ఫామ్లోకి రావడం దిల్లీకి కలిసొస్తుంది. మరి మిగతా మ్యాచుల్లోనైనా రాణించాలని ఆశిద్దాం..
- కోల్కతా (6): కొత్త సారథి నేతృత్వంలో భారీ ఆశలతో టోర్నీలో అడుగు పెట్టిన కోల్కతా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైను చిత్తు చేసి మరీ బోణీ కొట్టింది. ఇక ఆ తర్వాత విజయాల కోసం నానా ఇబ్బందులు పడుతోంది. అడపాదడపా రెండు మ్యాచ్ల్లో గెలిచినా అవి ప్రస్తుత సీజన్లో బలహీనంగా ఉన్న ముంబయి, పంజాబ్ మీద కావడ విశేషం. ఎనిమిది మ్యాచుల్లో ఐదు ఓటములు, మూడు విజయాలతో కోల్కతా (6) పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
- పంజాబ్ (6): పటిష్ఠమైన బెంగళూరునే తొలి మ్యాచ్లో మట్టికరిపించి సీజన్ను ప్రారంభించిన పంజాబ్ అటు తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయింది. ఫామ్లో లేని చెన్నై, ముంబయిపై మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం ఏడు మ్యాచ్లను ఆడిన పంజాబ్ కేవలం మూడు విజయాలతో ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. నాలుగు ఓటములను చవి చూసింది. మయాంక్, శిఖర్ ధావన్ , రాజపక్స, లివింగ్ స్టోన్, షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. అయినా ఓడిపోవడంపై జట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
- చెన్నై (4): ఈ సీజన్లో చెన్నై గురించి తక్కువ మాట్లాడుకుంటేనే మంచిదేమో. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఏడు మ్యాచుల్లో కేవలం రెండే మ్యాచ్లను గెలిచి, ఐదు మ్యాచుల్లో ఓడిపాలవుతుందని ఆ జట్టు అభిమానులు ఊహించి ఉండరు. మెగా వేలంలో దాదాపు పాత ఆటగాళ్లనే తీసుకున్నప్పటికీ.. భారీ స్కోర్లు చేసిన మ్యాచుల్లోనూ డీలాపడటం గమనార్హం. అయితే ఫాస్ట్ బౌలింగ్పరంగా భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసిన దీపక్ చాహర్ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకపోవడం మైనస్గా చెప్పుకోవాలి. సారథ్య బాధ్యతలు చేపట్టిన జడేజా ఫామ్లోకి రాలేదు. అయితే ఎంఎస్ ధోనీ మాత్రం బ్యాట్తో చెలరేగడం అద్భుతమనే చెప్పాలి.
- ముంబయి (0): ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు బోణీ కొట్టని జట్టు ఏదైనా ఉందంటే అది ముంబయి. ఎనిమిది మ్యాచులు ఆడినా ఒక్క విజయమూ నమోదు చేయలేకపోయింది. బ్యాటింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్లో మాత్రం తేలిపోతోంది. ఆదివారం లఖ్నవూతో జరిగిన మ్యాచ్లోనూ ఓడిపోయింది. ఇక ప్లేఆఫ్స్ అవకాశాల సంగతి పక్కన పెడితే కనీసం ఒక్క విజయం సాధించైనా టోర్నీని ముగించాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్ శర్మ సారథిగానూ, వ్యక్తిగతంగానూ రాణించలేకపోతున్నాడు. ఇక మిగిలిన మ్యాచుల్లో ఎలాంటి ఫలితాలను చవిచూస్తుందో వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి