WI vs IND: విండీస్తో టీ20 సిరీస్.. పొట్టి కప్కు బాట.. కుర్రాళ్ల సత్తాకు పరీక్ష!
విండీస్ పర్యటనలో (WI vs IND) భారత్ చివరి సిరీస్ను ఆడేందుకు సిద్ధమైంది. గురువారం నుంచి వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో భారత్ తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రయోగాలు చేసి మరీ విండీస్పై వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా (Team India) రెండు రోజుల వ్యవధిలోనే మరో సిరీస్కు సిద్ధమైంది. అయితే, ఈసారి వెస్టిండీస్తో టీ20 సిరీస్లో (WI vs IND) తలపడనుంది. హార్దిక్ పాండ్య నాయకత్వంలోని భారత్ బరిలోకి దిగుతుండగా.. కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకుని మరీ విండీస్ సిద్ధమైంది. కుర్రాళ్లకు సదావకాశం వచ్చిన ఈ సిరీస్ను వినియోగించుకుంటే వచ్చే ఏడాది జరిగే పొట్టి కప్ సంగ్రామంలో ఆడే అవకాశం రావడం ఖాయం. ఎందుకంటే ఇక్కడే టీ20 మెగా టోర్నీ జరగనుంది. అయితే, ఈలోగా వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్ గురించి మాట్లాడుకుందాం..
గత తొమ్మిదేళ్లుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: సంజూ శాంసన్
టెస్టు, వన్డే సిరీస్లను గెలిచిన ఆనందంలో ఉన్న టీమ్ఇండియాను ఎదుర్కోవడం వెస్టిండీస్కు తేలికైన విషయం కాదు. కానీ, ఆ జట్టులోనూ డేంజరస్ టీ20 బ్యాటర్లు ఉన్నారు. దీంతో భారత బౌలింగ్ VS విండీస్ బ్యాటర్లకు మధ్య సమరం ఆసక్తికరంగా ఉండనుంది. యువ బౌలర్లు అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, చాహల్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్తో కూడిన భారత బౌలింగ్ దళం బరిలోకి దిగనుంది. రోవ్మన్ పావెల్, కేల్ మేయర్స్, రోస్టన్ ఛేజ్, హెట్మయెర్, పూరన్, హోల్డర్ వంటి హేమాహేమీలైన టీ20 బ్యాటర్లను తట్టుకొని పరుగులు నియంత్రించాలంటే కచ్చితంగా శ్రమించాల్సిందే.
యశస్వి - ఇషాన్ .. ఎక్కడ వస్తారో..?
భారత జట్టులో యువ క్రికెటర్లకు ఉన్న పోటీ మరెక్కడా లేదు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను మేనేజ్మెంట్ పక్కన పెట్టేసింది. హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టీ20ల్లో టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ను డిప్యూటీగా నియమించింది. అలాగే ఐపీఎల్లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మను ఎంపిక చేసింది. ఇషాన్, శుభ్మన్ గిల్, సంజూ శాంసన్ ఉండనే ఉన్నారు. అయితే, తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్కు తోడుగా ఓపెనర్గా ఎవరు వస్తారు? ఎందుకంటే యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఎడమచేతి వాటం బ్యాటర్లు. వీరిద్దరూ ఓపెనర్లుగా ఐపీఎల్లో రాణించారు. సంజూ శాంసన్ను కాదని తిలక్ వర్మను తీసుకుంటారనేది సందిగ్ధమే. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఒక్కడే జట్టులో ఉండటం అతడికి కలిసొచ్చే అవకాశం.
మ్యాచ్ల షెడ్యూల్ ఇలా..
- తొలి టీ20: ఆగస్ట్ 3 (గురువారం)
- రెండో టీ20: ఆగస్ట్ 6 (ఆదివారం)
- మూడో టీ20: ఆగస్ట్ 8 (మంగళవారం)
- నాలుగో టీ20: ఆగస్ట్ 12 (శనివారం)
- ఐదో టీ20: ఆగస్ట్ 13 (ఆదివారం)
ఈ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి.
జట్లు (అంచనా):
భారత్: హార్దిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, చాహల్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్.
విండీస్: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), కేల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ ఛార్లెస్, రోస్టన్ ఛేజ్, షిమ్రోన్ హెట్మయెర్, నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్, ఒషానె థామస్, జాసన్ హోల్డర్, అకీల్ హుసేన్, అల్జారీ జోసెఫ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్