IPL 2024: 200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు.
ఒకప్పుడు టీ20ల్లో 180 పరుగులు చేస్తే భారీ స్కోరు చేసినట్లే. ఇప్పుడు 200+ టార్గెట్ నిర్దేశించినా గెలుస్తామనే భరోసా లేదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కొన్ని మ్యాచ్ల ఫలితాలను చూస్తే అలాగే ఉంది. ఒకటా.. రెండా.. తొమ్మిది మ్యాచుల్లో ఇలాంటి పరిస్థితే. అందులో మూడు హైదరాబాద్ ఆడినవే. రికార్డు స్కోరు చేసినా ఒకదశలో ఆ జట్టుకూ ఓటమి భయం తప్పలేదు మరి.
ఐపీఎల్లో జట్టు అత్యధిక స్కోరు అంటే.. మొన్నీమధ్య వరకు 11 ఏళ్ల క్రితం నాటి గణాంకాలు చెప్పేవాళ్లు. ఈ ఏడాది ఆ రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు సార్లు బద్దలుకొట్టింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు 17వ సీజన్లో పరుగుల వరద ఎలా పారుతోందో. ఆ జట్టు ఈ సీజన్లో 277.. 287.. 266.. 204 పరుగులు చేసింది. ముంబయి 246.. 234 స్కోర్లతో అదరగొట్టగా... బెంగళూరు ఓసారి 262 పరుగులు చేసింది. రాజస్థాన్ 224 కొట్టగా... కోల్కతా 272.. 223.. 208 చేసింది. చెన్నై ఓసారి 206 పరుగులు కొట్టగా.. పంజాబ్ ఓసారి 200 చేసింది. దిల్లీ కూడా 205 పరుగులతో 200+ క్లబ్లో చేరింది. ఇలా 8 జట్లు 16 సార్లు 200కిపైగా పరుగులు చేశాయి.
కారణాలు ఇవేనా...
- ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనతో అదనంగా మరొక బ్యాటర్ జట్టులోకి వస్తున్నాడు. కోల్కతాతో మ్యాచ్లో జోస్ బట్లర్ ‘ఇంపాక్ట్’ ప్లేయర్గా వచ్చి శతకంతో జట్టును గెలిపించాడు. అలా ఈ రూల్ భారీ స్కోర్లకు ఓ కారణం అని చెప్పొచ్చు.
- పిచ్లు ఎక్కువగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటం కూడా మరో కారణం. అదేదో సినిమాలో చెప్పినట్లు కొడితే బౌండరీ అనేలా కొన్ని పిచ్లు రూపొందిస్తున్నారు. దీంతో బౌలర్లు చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి.
- మరోవైపు బెంగళూరు లాంటి కొన్ని జట్లు పేలవమైన బౌలింగ్తో ఇబ్బందిపడటమూ భారీ స్కోర్లకు ఆజ్యం పోస్తోంది. పరుగులు నియంత్రణలో ఆ జట్టు తడబడుతోంది.
- బంతి ఎక్కడేసినా... మైదానం నలువైపులా బౌండరీ దాటించగలిగే నైపుణ్యాలను కొత్త కుర్రాళ్లు మెరుగుపర్చుకున్నారు. విభిన్నమైన షాట్లతో 360 డిగ్రీ ప్లేయర్లు అనిపించుకునే పనిలో పడ్డారు.
- చిన్న మైదానాలు, బౌండరీ డైమన్షన్లు కూడా కొండంత స్కోర్లకు కారణంగా చెబుతున్నారు. కౌ కార్నర్ను లక్ష్యంగా చేసుకుని షాట్లు ప్రాక్టీస్ చేసి.. భారీ షాట్లతో స్కోర్లు పెంచేస్తున్నారు.
- బౌలర్లకు వరంగా ఉంటుందనుకున్న ‘రెండు బౌన్సర్ల’ రూల్ బెడిసికొడుతోంది. షార్ట్ బంతులతో వారిని ఇబ్బంది పెడదామని భావించిన బౌలర్లకు అప్పర్ కట్లు, సూప్లా షాట్లతో ఆ బంతుల్ని బౌండరీలు దాటిస్తున్నారు.
ఇక్కడో విషయం ఏంటంటే.. ఇన్నేసి పరుగులు చేసినా ఆ టీమ్లు భయపడ్డాయి అనే చెప్పాలి. ఎందుకంటే లక్ష్యఛేదనలో చివరి వరకు వచ్చి కొన్ని జట్లు ఆ లక్ష్యం అంత పెద్దదేమీ కాదు అనేలా ఆడాయి. కోల్కతా 208 చేస్తే.. హైదరాబాద్ 204 వరకు వచ్చేసింది. 277 పరుగుల రికార్డు స్కోరు చేసిన హైదరాబాద్కు ముంబయి సమాధానం 246. ఇక హైదరాబాద్ విసిరిన 283 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 262 వరకు వచ్చి వణికించింది. కోల్కతా 223 కొడితే.. రాజస్థాన్ అలవోకగా 224 కొట్టేసింది. అలాగే కోల్కతాపై బెంగళూరు 221 పరుగులు చేసి ఒక్క రన్ తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఐపీఎల్లో 200+ స్కోరు కొట్టినా.. విజయం మీద నమ్మకం అంతంత మాత్రమే అని అంటున్నారు క్రికెట్ పరిశీలకులు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్