Indian Captains won Asia Cup: టీమ్ఇండియాకు ఆసియా కప్ను అందించిన కెప్టెన్లు వీరే..
ఆసియా కప్ను ఇప్పటివరకు 15సార్లు నిర్వహించగా.. భారత్ ఏడుసార్లు విజేతగా నిలిచింది. మరి టీమ్ఇండియా (Team India) కు ఆసియా కప్లను అందించిన కెప్టెన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
క్రికెట్లో ప్రపంచకప్ల తర్వాత అతిపెద్ద టోర్నీ ఏదైనా ఉందంటే ఆసియా కప్ మాత్రమే. దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ మినీ టోర్నీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తోంది. ఆసియా కప్ (Asia Cup) 1984లో ప్రారంభమై ఇప్పటివరకు 15 సీజన్లను పూర్తి చేసుకుంది. భారత్ అత్యధికంగా ఏడుసార్లు (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) విజేతగా నిలిచింది. శ్రీలంక గతేడాది ఛాంపియన్గా అవతరించి ఆరో టైటిల్ను సొంతం చేసుకుంది. మరి భారత్కు ఆసియా కప్లను అందించిన కెప్టెన్లు ఎవరెవరంటే?
సన్నీదే బోణీ
భారత్కు మొట్టమొదటి ఆసియా కప్ను అందించిన కెప్టెన్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar). 1984లో నిర్వహించిన ఆసియా కప్ (Asia Cup) మొదటి ఎడిషన్లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక పాల్గొన్నాయి. ఈ సీజన్లో మూడే మ్యాచ్లు నిర్వహించగా.. సునీల్ గావస్కర్ నాయకత్వంలోని టీమ్ఇండియా (Team India) ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి కప్ను ఎగరేసుకుపోయింది. శ్రీలంకపై 10 వికెట్లతో ఘన విజయం సాధించిన భారత్.. తర్వాతి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 54 పరుగుల తేడాతో మట్టికరిపించి టైటిల్ను ముద్దాడింది.
రెండోది సర్కార్ సారథ్యంలో
1986లో జరిగిన రెండో ఎడిషన్లో భారత్ పాల్గొనలేదు. క్రికెట్ సంబంధిత వ్యవహారాలతోపాటు సివిల్ వార్ దెబ్బకు టీమ్ఇండియా లేకుండానే టోర్నీ జరిగింది. 1988లో జరిగిన తర్వాతి ఎడిషన్లో భారత్ పాల్గొని రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. దిలీప్ వెంగ్ సర్కార్ (Dilip Vengsakar) సారథ్యంలోని టీమ్ఇండియా.. లీగ్ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్లపై విజయం సాధించగా.. శ్రీలంక చేతిలో 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫైనల్లో అదే శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకోవడంతోపాటు లీగ్ దశలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది.
అజహరుద్దీన్ ‘డబుల్’
హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin) టీమ్ఇండియాకు వరుసగా రెండు ఆసియా కప్లు (1990, 1995) అందించాడు. భారత్, పాకిస్థాన్ మధ్య సియాచిన్ విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 1990 ఆసియా కప్లో పాక్ ఆడలేదు. దీంతో మూడు జట్లతోనే (శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్) టోర్నీ నిర్వహించారు. లీగ్ దేశలో శ్రీలంకతో చేతిలో పరాజయంపాలైన భారత్.. ఫైనల్లో లంకను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్ను మూడో టైటిల్ను ఖాతాలో వేసుకుంది. 1995లో నిర్వహించిన ఆసియా కప్నకు కూడా అజహరుద్దీనే కెప్టెన్గా ఉన్నాడు. 1995లోనూ భారత్ ఆసియా కప్ ఛాంపియన్గా నిలవగా.. ప్రత్యర్థి శ్రీలంకే కావడం గమనార్హం.
‘కెప్టెన్ కూల్’ ఎన్నంటే?
మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) కూడా కెప్టెన్గా భారత్కు రెండు ఆసియా కప్లు అందించాడు. ధోనీ నాలుగు ఆసియా కప్లకు సారథ్యం వహించగా.. 2010, 2016లో టీమ్ఇండియాను విజేతగా నిలిపాడు. 2008లో రన్నరప్తో సరిపెట్టుకుంది. 2010లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 81 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. 2016లో ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగ్గా.. బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్లో ధోనీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆరోసారి ఆసియా కప్ విజేతగా అవతరించింది.
కోహ్లీ ఆడకపోవడంతో రోహిత్కు ఛాన్స్
భారత్ చివరసారిగా ఆసియా కప్ను గెలిచింది 2018లో. అప్పుడు రెగ్యులర్ కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఆసియా కప్నకు విశ్రాంతినిచ్చారు. దీంతో కోహ్లీ స్థానంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit Sharma) భారత్ను విజేతగా నిలిపాడు. బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్ (48) రాణించి టాప్ స్కోరర్గా నిలిచాడు. 2022 ఆసియా కప్లోనూ రోహిత్ సారథ్యంలోనే బరిలోకి దిగిన భారత్.. సూపర్-4 దశలోనే ఇంటి ముఖం పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో కూడా రోహిత్ శర్మే భారత కెప్టెన్గా ఉన్నాడు. ఈ సారి హిట్మ్యాన్ సారథిగా ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో చూడాలి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన