World Cup 2023: టీమ్ఇండియా.. ఇదే కావాలయ్యా.. ప్రపంచకప్లో భారత్ జోరు
ప్రపంచకప్కు ఎంపిక చేసే జట్టుపై సందిగ్ధత.. కీలక ఆటగాళ్లకు గాయాలు.. ఫామ్ లేమితో మరికొంత మంది క్రికెటర్లు. పైగా ఈ మెగా టోర్నీ జరిగేది స్వదేశంలో. దీంతో జట్టుపై ఎన్నో అంచనాలు. జట్టు ఎంపికపై ఎన్నో విమర్శలు. చివరి క్షణంలో అనూహ్యంగా జట్టులో మార్పు. ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు.. సందేహాల మధ్య ప్రపంచకప్లో టీమ్ఇండియా (Team India) అడుగుపెట్టింది.
ప్రపంచకప్కు ఎంపిక చేసే జట్టుపై సందిగ్ధత.. కీలక ఆటగాళ్లకు గాయాలు.. ఫామ్ లేమితో మరికొంత మంది క్రికెటర్లు. పైగా ఈ మెగా టోర్నీ జరిగేది స్వదేశంలో. దీంతో జట్టుపై ఎన్నో అంచనాలు. జట్టు ఎంపికపై ఎన్నో విమర్శలు. చివరి క్షణంలో అనూహ్యంగా జట్టులో మార్పు. ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు.. సందేహాల మధ్య ప్రపంచకప్లో టీమ్ఇండియా (Team India) అడుగుపెట్టింది. కానీ ఇప్పుడు.. మూడు మ్యాచ్లు ఆడేసరికి పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా నంబర్వన్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అదరగొడుతూ.. అద్భుత విజయాలతో సాగుతోంది. ఇప్పుడందరికీ జట్టుపై భరోసా. ఇదే జోరుతో సాగితే కప్పు మనదేనన్న ఆశ. హ్యాట్రిక్ విజయాలతో.. కప్పు వేటలో దూసుకెళ్తోన్న టీమ్ఇండియా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇదే కదా.. అభిమానులకు కావాల్సింది. ఇలాగే కదా.. టీమ్ఇండియా ఆడాల్సింది.
సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్గా ప్రపంచకప్లో అడుగుపెట్టిన టీమ్ఇండియా అదరగొడుతోంది. తొలి మూడు మ్యాచ్ల్లో విజయాలతో అలరించింది. ఇందులో రెండు పెద్ద గండాలను భారత్ అలవోకగా అధిగమించడం ఇక్కడ విశేషం. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై సాధికారిక విజయంతో టోర్నీని మొదలెట్టిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్లో అఫ్గానిస్థాన్ను చిత్తుచేసింది. ఇక పాకిస్థాన్తో పోరులో భారత్ రెచ్చిపోయి.. ప్రత్యర్థిని మట్టికరిపించింది. ప్రస్తుతానికి మూడు మ్యాచ్ల్లో విజయాలతో 6 పాయింట్లతో.. మెరుగైన నెట్ రన్రేట్తో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
బ్యాటింగ్లో ఇలా..
జట్టుకు ఎంతో కీలకమైన బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ శస్త్ర చికిత్సల నుంచి కోలుకుని వచ్చారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్లో వీళ్లు ఎలా రాణిస్తారోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పునరాగమనంలో తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే ఎలాంటి ప్రదర్శన చేస్తారేమోనని భయాలు వ్యక్తమయ్యాయి. తొలి మ్యాచ్లో ఆసీస్పై 200 పరుగుల ఛేదనలో రెండు పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. రోహిత్, ఇషాన్, శ్రేయస్ సున్నాకే వెనుదిరిగారు. దీంతో బ్యాటింగ్పై సందేహాలు మరింత పెరిగాయి. కానీ కోహ్లి, కేఎల్ రాహుల్ నిలబడి జట్టును గెలిపించారు. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడిలోనూ ఛేదనలో వీళ్లు చూపించిన బ్యాటింగ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక అఫ్గానిస్థాన్తో పోరులో రోహిత్, ఇషాన్, విరాట్ మెరిశారు. పాకిస్థాన్పై రోహిత్, శ్రేయస్ అయ్యర్ సత్తాచాటారు. దీంతో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్పై పెట్టుకున్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రపంచకప్లో జట్టుకు మూల స్తంభాలైన రోహిత్, విరాట్ అంచనాలకు తగ్గట్లుగా ఆడుతూ.. కప్పు కల దిశగా జట్టును నడిపిస్తున్నారు. మొత్తానికి మన బ్యాటింగ్ బలంగా మారి ప్రత్యర్థి బౌలర్లకు సవాలు విసురుతోంది.
బౌలింగ్ అలా..
ప్రపంచకప్లో ఇప్పటివరకూ భారత్ సాధించిన విజయాల్లో బౌలర్లదే కీలక పాత్ర అని చెప్పొచ్చు. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను 199కే ఆలౌట్ చేసినా.. పాకిస్థాన్ను 191కే కట్టడి చేసినా ఆ ఘనత మన బౌలర్లకే దక్కుతోంది. ప్రధాన పేసర్గా తనపై ఉన్న బాధ్యతలను బుమ్రా సమర్థంగా నిర్వహిస్తుండటం జట్టుకు ఎంతగానో మేలు చేస్తోంది. ఆసీస్పై 2 వికెట్లు పడగొట్టిన అతను.. అఫ్గాన్పై 4 వికెట్లతో విజృంభించాడు. పాక్తో పోరులోనూ రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. మొత్తానికి 8 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ప్రస్తుతం బుమ్రా నంబర్వన్గా ఉన్నాడు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ కూడా పదునైన బౌలంగ్తో రెచ్చిపోతున్నాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బ్యాటర్లను కట్టిపడేస్తున్నాడు. హార్దిక్ కూడా పేస్తో రాణిస్తున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ప్రత్యర్థి బ్యాటర్లను బుట్టలో పడేస్తున్నారు. ఆసీస్తో మ్యాచ్లో కుల్దీప్ 2, జడేజా 3 వికెట్లు పడగొట్టారు. పాక్పై చెరో రెండు వికెట్లు సాధించారు. దాయాదితో మ్యాచ్లో బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో 155/2తో ఉన్న పాక్ ఒక్కసారిగా కుప్పకూలి 191కే పరిమితమైంది.
భళా నాయక..
ప్రపంచకప్ అంటే చాలు బ్యాటింగ్లో రెచ్చిపోయే రోహిత్ శర్మ (Rohit Sharma) తనదైన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. అఫ్గానిస్థాన్పై మెరుపు శతకం బాదిన అతను.. పాక్పై 86 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్తో మ్యాచ్ లాగేసుకున్నాడు. మరోవైపు సారథిగానూ రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. తన నాయకత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తున్న వాళ్లకు అతను దిమ్మదిరిగే సమాధానమిస్తున్నాడు. ముఖ్యంగా పాక్తో పోరులో రోహిత్ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. ఆరంభంలో సిరాజ్ పరుగులిస్తున్నా అతనితో బౌలింగ్ కొనసాగించి రోహిత్ ఫలితం రాబట్టాడు. వెంటనే హార్దిక్ను దించాడు. మధ్యలోనూ సరైన సమయాల్లో బౌలింగ్ మార్పులతో పాకిస్థాన్ కుప్పకూలేలా చేశాడు. మరోవైపు పిచ్ను, పరిస్థితులను బట్టి సరైన జట్టు కూర్పుతో టీమ్ఇండియా బరిలో దిగుతోంది. స్పిన్కు అనుకూలంగా ఉంటే అశ్విన్ను తీసుకుని ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోంది. అదే పేస్కు సహకరించేలా పిచ్ కనిపిస్తే శార్దూల్ను మూడో పేసర్గా ఆడిస్తోంది. జట్టు ఇలాగే మంచి వ్యూహాలతో సాగుతూ.. ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తే నవంబర్ 19న కప్పును ముద్దాడుతుందనడంలో సందేహం లేదు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు