Rohit Sharma: కోహ్లీ అండ్ కో వస్తే.. ఏం చేయాలో మాకు తెలుసు: రోహిత్ శర్మ
ఇంగ్లాండ్పై నాలుగో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేశారని.. రోహిత్ శర్శ అభినందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: యువ జట్టుతో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాలుగో టెస్టు అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందని.. సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చినా మేం ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని అద్భుతంగా ఆడిన ధ్రువ్ జురెల్పై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు.
‘‘సవాళ్లు విసిరిన టెస్టు సిరీస్లో అద్భుత పోరాటంతో మా యువకులు తమ సత్తా చాటారు. మరో మ్యాచ్ మిగిలిఉండగానే టెస్టు సిరీస్ను గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ప్రత్యర్థి జట్టు నుంచి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొన్న తీరు బాగుంది. మైదానంలో మేం ఎలా ఆడాలని భావించామో.. అదే తీరులో ఆధిపత్యం ప్రదర్శించాం. కుర్రాళ్లు చాలా శ్రమించారు. దేశవాళీ క్రికెట్ ఆడి నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్లేయర్లూ తమ సత్తా చాటారు. ఇక్కడ నేను, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిందొకటే. యువ క్రికెటర్లకు స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయగలిగాం. వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయడమే మా కర్తవ్యంగా భావించాం.
రెండో టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్ ఏ ఒత్తిడికి గురికాకుండా గొప్ప పరిణితి ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్లో కీలకమైన 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులు చేసి జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించాడు. గిల్ కూడా తన ఫామ్ను అందిపుచ్చుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఈ సిరీస్లోనే అరంగేట్రం చేసి సత్తా చాటాడు. ఇక సీనియర్లు విరాట్ కోహ్లీతో సహా ఇతరులు వచ్చినప్పుడు జట్టులో మార్పుల గురించి మాపై ఒత్తిడి లేదు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. కుర్రాళ్లు ఎప్పుడు అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. గత మూడు టెస్టుల్లో మా ఆటతీరుకు ఇదే నిదర్శనం. చివరి మ్యాచ్లోనూ ఉత్సాహంగా బరిలోకి దిగుతాం’’ అని రోహిత్ వెల్లడించాడు.
ఇది గొప్ప టెస్టు మ్యాచ్: బెన్ స్టోక్స్
‘‘తప్పకుండా ఇది గొప్ప టెస్టు మ్యాచ్ అవుతుంది. ఒకసారి స్కోరు బోర్డు చూస్తే అర్థమవుతుంది. కేవలం ఐదు వికెట్ల తేడాతోనే భారత్ గెలిచింది. ప్రతి రోజు ఎత్తుపల్లాలు చవిచూశాం. మా జట్టులో పెద్దగా అనుభవం లేని స్పిన్నర్లు ఉన్నారు. కానీ, వారు రాణించిన తీరు అద్భుతం. వారి నుంచి ఇంకేం ఆశించలేను. నా కెప్టెన్సీలో యువకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. భారత్లో అశ్విన్, కుల్దీప్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లను ఎదుర్కొని పరుగులు చేయడం సులువేం కాదు. జో రూట్పై వచ్చిన విమర్శలను నేను పట్టించుకోను. అతడు టెస్టుల్లో 12వేలకుపైగా పరుగులు చేశాడు. మేం ఈ టెస్టులో విజయం కోసం చివరివరకూ పోరాడాం’’ అని ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు