IRE vs IND: ఐర్లాండ్తో టీ20 సిరీస్.. కళ్లన్నీ వారిపైనే.. మూడో కెప్టెన్గా బుమ్రా!
యువ జట్టుతో ఐర్లాండ్ పర్యటనకు (IRE vs IND) వెళ్లిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఎలాంటి ఫలితాలను సాధిస్తాడనేది ఆసక్తికరంగా మారినా.. తన ఫిట్నెస్ను నిరూపించుకొని తిరిగి గాడిలో పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆగస్ట్ 18 నుంచి ఐర్లాండ్తో మూడు టీ20ల (IRE vs IND) సిరీస్ ప్రారంభం కానుంది. ఇదేంటి ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి టోర్నీల ముంగిట ఇలా పొట్టి ఫార్మాట్ ఎందుకు అనే సందేహం చాలా మందికి రావడం సహజం. అయితే, ఈ సిరీస్ను కూడా భారత జట్టు తన ప్రయోగాలకు వేదికగా మార్చుకుంది. అలాగే కొందరి ఫిట్నెస్ను పరీక్షించుకోవడానికి ఉపయోగించుకోనుంది. ఆసియా గేమ్స్లో పాల్గొనబోయే రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని జట్టు సభ్యులకు మరింత అనుభవం వచ్చేందుకు ఈ సిరీస్ సహాయ పడనుంది.
వన్డేల్లోకి తిరిగొచ్చిన బెన్స్టోక్స్.. అసలెందుకు అతడిపై భారీ అంచనాలు?
దాదాపు ఏడాది తర్వాత మైదానంలోకి దిగేందుకు సిద్ధమైన జస్ప్రీత్ బుమ్రాకు ఐర్లాండ్తో టీ20 సిరీస్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీత నిర్ణయం తీసుకుంది. అతడి ఫిట్నెస్ను నిరూపించుకోవడానికి ఇదే సరైన వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగు ఓవర్ల కోటా అయినప్పటికీ బౌలింగ్లో రిథమ్ను అందుకొనేందుకు ఉపయోగపడటం ఖాయం. అలాగే మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా ఐర్లాండ్తో సిరీస్కు ఎంపికైన సంగతి తెలిసిందే. అతడూ తన సత్తాను నిరూపించుకుంటే ఆసియా కప్ సహా వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. విండీస్ పర్యటనలో మెప్పించలేకపోయిన సంజూ శాంసన్కు మరో ఛాన్స్ ఈ ఐర్లాండ్ సిరీస్తో వచ్చింది. తుది జట్టులోకి వచ్చి ఉత్తమ ప్రదర్శన చేస్తేనే భవిష్యత్తులో స్థానం దక్కే అవకాశం ఉంది.
మూడో సారథిగా బుమ్రా..
టీమ్ఇండియా 2018 నుంచి ఇది మూడో పర్యటన కావడం విశేషం. తొలిసారి 2018లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో రెండు టీ20ల్లో ఐర్లాండ్తో తలపడింది. ఆ రెండింట్లోనూ టీమ్ఇండియానే గెలిచింది. ఆ తర్వాత 2022లో హార్దిక్ పాండ్య సారథ్యంలో రెండు టీ20లు ఆడింది. ఇక్కడా మనదే విజయం. ఇప్పుడు బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగనుడటం గమనార్హం. తొలుత 2009 టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లూ తలపడ్డాయి. అక్కడా గెలుపు భారత్దే. అయితే, ఐర్లాండ్ ఓడిపోయినంత మాత్రాన తక్కువగా అంచనా వేయకూడదు. టీ20ల్లో భారత్పైనే 221/5 భారీ స్కోరు సాధించిన విషయాన్ని ఆటగాళ్లు మరువకూడదు.
ఐర్లాండ్ - భారత్ సిరీస్లకు సంబంధించి మరికొన్ని విశేషాలు..
- కుల్దీప్ సూపర్బ్ బౌలింగ్: తొలిసారి (2018లో) ఐర్లాండ్ సిరీస్కు వెళ్లినప్పుడు రోహిత్ శర్మ (97), శిఖర్ ధావన్ (74) విజృంభించారు. వీరిద్దరి ధాటికి తొలి మ్యాచ్లో 208/5 స్కోరు చేసింది. అనంతరం భారత బౌలర్లు ఐర్లాండ్ను 132/9 స్కోరుకే పరిమితం చేశారు. కుల్దీప్ యాదవ్ (4/21) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. చాహల్ (3/38), బుమ్రా (2/19) అండగా నిలిచారు.
- భారీ తేడాతో..: ఇదే సిరీస్లో రెండో టీ20 మ్యాచ్లోనూ భారత్ 200+ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (70), సురేశ్ రైనా (69) హాఫ్ సెంచరీలు సాధించడంతో టీమ్ఇండియా 213/4 స్కోరు చేసింది. అనంతరం కుల్దీప్ యాదవ్ (3/16), చాహల్ (3/21) విజృంభణతో 70 పరుగులకే ఐర్లాండ్ కుప్పకూలింది. దీంతో 143 పరుగుల భారీ తేడాతో భారత్ గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా కేఎల్ రాహుల్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా చాహల్ నిలిచారు.
- 12 ఓవర్ల మ్యాచ్: హార్దిక్ పాండ్య నాయకత్వంలో (2022లో) రెండు టీ20లను ఆడేందుకు ఐర్లాండ్కు భారత్ వెళ్లింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా 12 ఓవర్లకే మ్యాచ్ జరిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ చాహల్ (1/11) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలుత ఐర్లాండ్ 108/4 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దీపక్ హుడా (47*), ఇషాన్ కిషన్ (26), హార్దిక్ (24) రాణించడంతో 9.2 ఓవర్లలోనే 111/3 స్కోరు చేసి విజయం సాధించింది.
- దీపక్ హుడా సెంచరీ: ఇదే సిరీస్లో రెండో మ్యాచ్లో మాత్రం ఐర్లాండ్నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 225/7 స్కోరు చేసింది. దీపక్ హుడా (104) సెంచరీ సాధించాడు. సంజూ శాంసన్ (77) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, బ్యాటింగ్కు సహకరించిన పిచ్పై ఐర్లాండ్ కూడా దూకుడుగా ఆడింది. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (60), పాల్ స్టిర్లింగ్ (40), టారీ టెక్టర్ (39), జార్జ్ డాక్రెల్ (34*), మార్క్ ఐదెర్ (23*) ధాటికి ఛేదన దిశగా సాగింది. కానీ, కీలక సమయంలో పరుగులను నియంత్రించడంతో భారత్ కేవలం 4 రన్స్ తేడాతో మాత్రమే విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా సెంచరీ హీరో దీపక్ హుడా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్