Team India: టీమ్ఇండియాలో నిలకడలేమి.. మళ్లీ మొదటికొచ్చిందా..?
ఒకసారి దూకుడుగా ఆడేస్తారు. మరోసారి కుప్పకూలి నిరాశపరుస్తారు. ఇదీ ఆసియా కప్లో (Asia Cup 2023) భారత్ బ్యాటింగ్ పరిస్థితి. లీగ్ స్టేజ్లో పాక్పై టాప్ ఆర్డర్ విఫలమైనా.. గౌరవప్రదమైన స్కోరు చేసింది. సూపర్ -4లో దూకుడుగా ఆడేసి భారీ స్కోరు చేసింది. తీరా ఇప్పుడు శ్రీలంకపై చెమటోడ్చాల్సి వచ్చింది.
ఒక్క రోజు ముందు జరిగిన మ్యాచ్లో భీకరమైన పేసర్లు.. దూకుడుగా ఆడే బ్యాటర్లు ఉన్న చిరకాల ప్రత్యర్థిని అలవోకగా చిత్తు చేశాం. మరుసటి రోజు.. అదే మైదానం.. ఈసారి మాత్రం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఆసియా కప్ ఫైనల్కు (Asia Cup 2023) అయితే చేరిపోయాం కానీ.. మరోసారి టీమ్ఇండియా (Team India) నిలకడలేని బ్యాటింగ్ ప్రదర్శన కలవరపెట్టే అంశమే. మళ్లీ నిలకడలేమి భారత జట్టును అవహించిందా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది.
కొలంబో వేదికగా భారత్ వరుసగా మూడు రోజుల్లో రెండు మ్యాచ్లు ఆడింది. తొలుత పాకిస్థాన్పై 356 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీల హీరోలు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్తోపాటు రోహిత్ శర్మ, గిల్ హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, శ్రీలంకతో మ్యాచ్లో మాత్రం ఆరంభంలో ఉన్న దూకుడును కొనసాగించలేక భారత్ ఇబ్బంది పడింది. పిచ్ స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా మారిందని భావించినా.. ఓపెనర్లు తొలి వికెట్కు 80 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వికెట్లను పారేసుకున్నారు. మిడిల్లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కాసేపు నిలబడినా.. అది సరిపోలేదు. అప్పుడు కూడా టీమ్ఇండియా వరుసగా వికెట్లను సమర్పించుకుంది. చివర్లో అక్షర్ పటేల్ కూడా ఓ చేయి వేశాడు కాబట్టే భారత్ 213 పరుగులు చేయగలిగింది. స్పిన్ను ఎదుర్కోవడంలో భారత్కు తిరుగులేదని అంతా భావించే వేళ యువ స్పిన్నర్లు వెల్లలాగె, అసలంక, తీక్షణలకు మొత్తం వికెట్లను సమర్పించారు.
వ్యత్యాసం ఉండాలి కదా..
స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ శ్రీలంక బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డారు కదా..? వారి సొంత మైదానంలోనే 214 రన్స్ టార్గెట్ను ఛేదించే క్రమంలో 172కే ఆలౌట్ అయింది కాబట్టి పిచ్ స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉందనే వాదనను పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, శ్రీలంక ఆటగాళ్లకు భారత్లోని స్టార్ ప్లేయర్లకు చాలా వ్యత్యాసం ఉందనేది మరికొందరి వాదనా. టీమ్ఇండియాలోని ఆటగాళ్లతో పోలిస్తే వారంతా పెద్దగా అనుభవం లేనివారే. అయినా సరే చివరి వరకూ విజయం కోసం పోరాడారు. భారత్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ వారిని ఒత్తిడిలోకి నెట్టారు. లేకపోతే పరాభవం ఎదురై విమర్శలకు గురి కావాల్సి వచ్చేది. అయితే, వరుసగా మ్యాచ్లు ఆడటం వల్ల కూడా భారత ప్రదర్శనపై ప్రభావం పడి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఒకప్పుడు అలా..
గత పదేళ్ల కిందట వరకు భారత్లోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైతే.. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టేవారు. అయితే, ఎంఎస్ ధోనీ నాయకత్వం వచ్చాక దాదాపు ఎనిమిదో వికెట్ వరకు బ్యాటింగ్ చేయడం అలవాటైంది. ఇటీవల వరకు లోయర్ ఆర్డర్ కూడా కాసిన్ని పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలుస్తోంది. మళ్లీ ఇప్పుడు ఆ పాత రోజులకు టీమ్ఇండియా పరిస్థితి వెళ్తుందా..? అనేది అనుమానంగా మారింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ను తీసుకుంటే.. రోహిత్ శర్మ (53) హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్నప్పటికీ గిల్, విరాట్ వెనువెంటనే ఔట్ కావడంతో రోహిత్ కాన్సట్రేషన్ సన్నగిల్లి వికెట్ను ఇచ్చేశాడు. సరే ఇషాన్, రాహుల్ కుదురుకున్నారనుకునేలోపే.. వారితోపాటు హార్దిక్, జడేజా కూడా వెంటనే పెవిలియన్కు చేరిపోయారు. పార్ట్టైమ స్పిన్నర్ అసలంకకు కూడా నాలుగు వికెట్లను ఇవ్వడం మరింత బాధించే అంశం. పాకిస్థాన్ జట్టు కూడా ఇలా నిలకడలేమి ఆటతీరుతో కీలక సమయాల్లో మ్యాచ్లను ఓడిపోతుండేది.
ముందుంది మెగా టోర్నీ
‘ఇలాంటి కఠిన సవాళ్లు ఎదురైతే మనం నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినట్లే’ అని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినప్పటికీ.. ఆ మాటలు ఆసియా కప్ ఫైనల్ సహా మెగా టోర్నీ సందర్భంగా బూమరాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. వచ్చే ప్రపంచకప్లో కీలకమైన సమయంలో ఇలా వికెట్లను పారేసుకుంటే ప్రత్యర్థులు మరింత చెలరేగే అవకాశం ఉండటంతోపాటు ఐసీసీ కప్ను నెగ్గాలనే పదేళ్ల కలపై నీళ్లు పడటం ఖాయం. అన్ని మ్యాచుల్లోనూ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తేనే టైటిల్ను ఖాతాలో వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో రాణిస్తేనే ఛాంపియన్గా నిలవగలం.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.