Team India: టీమ్ఇండియాలో నిలకడలేమి.. మళ్లీ మొదటికొచ్చిందా..?
ఒకసారి దూకుడుగా ఆడేస్తారు. మరోసారి కుప్పకూలి నిరాశపరుస్తారు. ఇదీ ఆసియా కప్లో (Asia Cup 2023) భారత్ బ్యాటింగ్ పరిస్థితి. లీగ్ స్టేజ్లో పాక్పై టాప్ ఆర్డర్ విఫలమైనా.. గౌరవప్రదమైన స్కోరు చేసింది. సూపర్ -4లో దూకుడుగా ఆడేసి భారీ స్కోరు చేసింది. తీరా ఇప్పుడు శ్రీలంకపై చెమటోడ్చాల్సి వచ్చింది.
ఒక్క రోజు ముందు జరిగిన మ్యాచ్లో భీకరమైన పేసర్లు.. దూకుడుగా ఆడే బ్యాటర్లు ఉన్న చిరకాల ప్రత్యర్థిని అలవోకగా చిత్తు చేశాం. మరుసటి రోజు.. అదే మైదానం.. ఈసారి మాత్రం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఆసియా కప్ ఫైనల్కు (Asia Cup 2023) అయితే చేరిపోయాం కానీ.. మరోసారి టీమ్ఇండియా (Team India) నిలకడలేని బ్యాటింగ్ ప్రదర్శన కలవరపెట్టే అంశమే. మళ్లీ నిలకడలేమి భారత జట్టును అవహించిందా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది.
కొలంబో వేదికగా భారత్ వరుసగా మూడు రోజుల్లో రెండు మ్యాచ్లు ఆడింది. తొలుత పాకిస్థాన్పై 356 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీల హీరోలు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్తోపాటు రోహిత్ శర్మ, గిల్ హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, శ్రీలంకతో మ్యాచ్లో మాత్రం ఆరంభంలో ఉన్న దూకుడును కొనసాగించలేక భారత్ ఇబ్బంది పడింది. పిచ్ స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా మారిందని భావించినా.. ఓపెనర్లు తొలి వికెట్కు 80 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వికెట్లను పారేసుకున్నారు. మిడిల్లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కాసేపు నిలబడినా.. అది సరిపోలేదు. అప్పుడు కూడా టీమ్ఇండియా వరుసగా వికెట్లను సమర్పించుకుంది. చివర్లో అక్షర్ పటేల్ కూడా ఓ చేయి వేశాడు కాబట్టే భారత్ 213 పరుగులు చేయగలిగింది. స్పిన్ను ఎదుర్కోవడంలో భారత్కు తిరుగులేదని అంతా భావించే వేళ యువ స్పిన్నర్లు వెల్లలాగె, అసలంక, తీక్షణలకు మొత్తం వికెట్లను సమర్పించారు.
వ్యత్యాసం ఉండాలి కదా..
స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ శ్రీలంక బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డారు కదా..? వారి సొంత మైదానంలోనే 214 రన్స్ టార్గెట్ను ఛేదించే క్రమంలో 172కే ఆలౌట్ అయింది కాబట్టి పిచ్ స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉందనే వాదనను పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, శ్రీలంక ఆటగాళ్లకు భారత్లోని స్టార్ ప్లేయర్లకు చాలా వ్యత్యాసం ఉందనేది మరికొందరి వాదనా. టీమ్ఇండియాలోని ఆటగాళ్లతో పోలిస్తే వారంతా పెద్దగా అనుభవం లేనివారే. అయినా సరే చివరి వరకూ విజయం కోసం పోరాడారు. భారత్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ వారిని ఒత్తిడిలోకి నెట్టారు. లేకపోతే పరాభవం ఎదురై విమర్శలకు గురి కావాల్సి వచ్చేది. అయితే, వరుసగా మ్యాచ్లు ఆడటం వల్ల కూడా భారత ప్రదర్శనపై ప్రభావం పడి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఒకప్పుడు అలా..
గత పదేళ్ల కిందట వరకు భారత్లోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైతే.. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టేవారు. అయితే, ఎంఎస్ ధోనీ నాయకత్వం వచ్చాక దాదాపు ఎనిమిదో వికెట్ వరకు బ్యాటింగ్ చేయడం అలవాటైంది. ఇటీవల వరకు లోయర్ ఆర్డర్ కూడా కాసిన్ని పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలుస్తోంది. మళ్లీ ఇప్పుడు ఆ పాత రోజులకు టీమ్ఇండియా పరిస్థితి వెళ్తుందా..? అనేది అనుమానంగా మారింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ను తీసుకుంటే.. రోహిత్ శర్మ (53) హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్నప్పటికీ గిల్, విరాట్ వెనువెంటనే ఔట్ కావడంతో రోహిత్ కాన్సట్రేషన్ సన్నగిల్లి వికెట్ను ఇచ్చేశాడు. సరే ఇషాన్, రాహుల్ కుదురుకున్నారనుకునేలోపే.. వారితోపాటు హార్దిక్, జడేజా కూడా వెంటనే పెవిలియన్కు చేరిపోయారు. పార్ట్టైమ స్పిన్నర్ అసలంకకు కూడా నాలుగు వికెట్లను ఇవ్వడం మరింత బాధించే అంశం. పాకిస్థాన్ జట్టు కూడా ఇలా నిలకడలేమి ఆటతీరుతో కీలక సమయాల్లో మ్యాచ్లను ఓడిపోతుండేది.
ముందుంది మెగా టోర్నీ
‘ఇలాంటి కఠిన సవాళ్లు ఎదురైతే మనం నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినట్లే’ అని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినప్పటికీ.. ఆ మాటలు ఆసియా కప్ ఫైనల్ సహా మెగా టోర్నీ సందర్భంగా బూమరాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. వచ్చే ప్రపంచకప్లో కీలకమైన సమయంలో ఇలా వికెట్లను పారేసుకుంటే ప్రత్యర్థులు మరింత చెలరేగే అవకాశం ఉండటంతోపాటు ఐసీసీ కప్ను నెగ్గాలనే పదేళ్ల కలపై నీళ్లు పడటం ఖాయం. అన్ని మ్యాచుల్లోనూ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తేనే టైటిల్ను ఖాతాలో వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో రాణిస్తేనే ఛాంపియన్గా నిలవగలం.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్